Showing posts with label సకలదేవతల మహిమలు - దేవతల ప్రాధాన్యత. Show all posts
Showing posts with label సకలదేవతల మహిమలు - దేవతల ప్రాధాన్యత. Show all posts

Thursday, May 15, 2014

సింహాచల క్షేత్రమహత్యం



















సింహాచల క్షేత్రమహత్యం 

ఆదికాలం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని 'సింహాచలం' ఒక ప్రసిద్ధమైన వైష్ణవ పుణ్యక్షేత్రం. కైలాసంగా పిలవబడే ఈ పుణ్యక్షేత్రం సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తున, విశాఖ పట్టణానికి ఉత్తరాన 10 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రదేశం అధికభాగం అడవులు, కొండలతో నిండి ఉంటుంది. ఈ కొండల సముదాయం నీటిధారలతో, సన్నని కాలువలతో కూడివుంది ఇందులో ముక్యమైనది ఈశాన్యంలో ఉన్న హనుమంత ధార. మరికొన్ని ముఖ్యమైన ధారలు సీతమ్మ ధార, సింహాచలధార, మాధవధార, ఇందులో సింహాచల ధార అన్నిటికన్నా పెద్దది. సింహాచలం అంటే 'సింహం యొక్క కొండ' అని అర్థం. ఇది విష్ణువు నాలుగవ అవతారమైన నరసింహుని కొండగా భావించబడుతోంది. "సర్వం విష్ణు మయం జగత్'' అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రతీకగా నరసింహ అవతారం మనకి నిదర్శనంగా కనబడుతుంది. ఈ ఆలయ ప్రధాన దేవత శ్రీవరాహ నరసింహస్వామి. యాదగిరిగుట్టలో యోగ నరసింహుడిగా, వేదాద్రిలో లక్ష్మీనరసింహుడుగా, నరసింహస్వామి వారిని అనేక రూపాలతో భక్తులు ఆరాధిస్తారు. దశావతారాలలో విడి అవతారాలైన వరాహ, నరసింహ అవతారాలు రెండూ కలిసి వరాహనరసింహునిగా కనిపించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. వరాహ ముఖం, మానవశరీరం, సింహతోకతో కూడిన స్వామివారి శరీరం మరెక్కడా కనిపించదు. ఇక్కడి ప్రజలు స్వామివారిని "సింహాద్రి అప్పన్న'' అని పిలుస్తారు. 

బయటనుంచి ఈ ఆలయం ఒక కోటను తలపిస్తుంది. మిగతా ఆలయాలకు విరుద్ధంగా ఈ ఆలయం పడమరముఖంగా ఉంటుంది. పడమర ముఖంగా ఉన్న మహాగోపురం నుండి ఆలయంలోకి ప్రవేశిస్తే ప్రదక్షిణ చేసేందుకు వీలయిన మూడు ప్రాకారాలతో, అయిదు ద్వారాలతో, నాట్య, ఆస్థాన, భోగ మంటపాలతో ఆలయం విలసిల్లుతూ ఉంటుంది. సంతాన గోపాలయంత్రంపై ప్రతిష్టింపబడిన కప్పస్తంభాన్ని కౌగిలించుకున్న దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడివారి విశ్వాసం. ఇక్కడ ఉత్సవమూర్తులు షడ్రూపులు. వాటినే షడ్బేరులు (ఆరు) అంటారు. ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు. ఉత్సవమూర్తి గోవిందరాజులు, కౌతుక మూర్తి మదనగోపాలుడు, శయనమూర్తి వేణుగోపాలుడు, స్నపన (స్నానంచేసే మూర్తి), యోగానంద నరసింహుడు, బలిమూర్తి సుదర్శన చక్ర పెరుమాళ్ ఇవన్నీ స్వామివారి విభిన్న రూపాల క్రిందే లెక్క. ఆయా శరీరాలతో, ఆయా కైంకర్యాలను స్వామివారు స్వీకరిస్తూ ఉంటారన్నమాట. మూల విరాట్టు శిలావిగ్రహం కాగా, మిగిలినవి లోహమూర్తులు.

మూలవిరాట్టు :

మూలవిరాట్టు 'వరాహనరసింహ' ప్రహ్లాద మందిరం మధ్యలో చందనపూతతో, లింగాకారంలో దర్శనమిస్తాడు. ఇందులో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంది. ఏడాదిలో ఒక్క అక్షయతదియ (వైశాఖశుద్ధ తృతీయ) రోజు మాత్రమే కొద్ది గంటలసేపు స్వామివారిపై ఉన్న పూతను ఒలిచి, నిజరూప దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది. అప్పుడు త్రిభంగి భంగిమలో రెండుచేతులతో, వరాహ ముఖంతో, నరుని శరీరంతో, సింహ తోకతో స్వామివారు దర్శనమిస్తారు. మూలవరులకి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. పద్మాసనంలో కూర్చుని, చేతిలో పద్మంతో అభయ వరద ముద్రలో ఉన్న చతుర్భుజ తాయారు (లక్ష్మీ)కి, ఆండాళ్ సన్నిధులు ఉన్నాయి. ఆళ్వారులకు ఈ ఆలయంలో గౌరవస్థానం కల్పించబడింది. ఇక్కడ భగవద్రామానుజులు, మణవాళ మహాముని, విష్వక్సేన సన్నిధులు కూడా ఉన్నాయి. వారి జన్మ నక్షత్రాలలో విశేషమైన పూజలు నిర్వహించబడతాయి. రామానుజ కూటం అనే వంటశాల ఆలయంలో ఉంది. వైశాఖ, జ్యేష్ఠ మంటపాలలో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణం జరిపించడానికి ప్రత్యేకమైన కళ్యాణమండపం కూడా ఉంది. ఈ ఆలయానికి రెండు పుష్కరిణిలు ఉన్నాయి. ఒకటి స్వామి పుష్కరిణి, మరొకటి వరాహ పుష్కరిణి. ఇది కొండ కింద భాగంలో ఉంది. విశేషమైన పండుగ ఉత్సవాలలో స్వామికి ఈ పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. కొండ క్రింద ఉన్న రెండు ఉద్యానవనాల్లో స్వామి పండుగ సమయాలలో ఊరేగిస్తారు. 'గంగధార'కు వెళ్ళే దారిలో శ్రీత్రిపురాంతక, త్రిపురసుందరి ఆలయం ఉంది. శ్రీత్రిపురాంతక స్వామి ఇక్కడి క్షేత్రపాలకుడు. గంగధార ప్రక్కన సీతారాముల గుడిని కూడా దర్శించుకోవచ్చు. గుడికి వెళ్ళే మార్గంలో శ్రీకాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణదేవీల సన్నిధి ఉంది. హనుమంతునికి కూడా ప్రత్యేకమైన ఆలయం ఉంది.

దక్షిణ భారతదేశంలో గల చాలా ఆలయాలవలెనే ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది. ఈ స్థల పురాణం 32 అధ్యాయాలుగా విభజింపబడింది. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి ఈ కొండపై దర్శనమిస్తాడు. పురాణాల కథనం ప్రకారం, ఇది త్రేతాయుగానికి చెందినది. మునులను అవమానించిన కారణంగా విష్ణుమూర్తి ద్వార పాలకులైన జయ, విజయలు కశ్యప మహామునికి కుమారులుగా హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా జన్మిస్తారు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని బంధించి సమస్త ప్రాణులను హింసిస్తుండగా విష్ణుమూర్తి వరాహ రూపంలో అతన్ని సంహరించి భూమిని రక్షించాడు. సోదరుని మరణవార్తతో హిరణ్యకశిపుడు క్రోధుడై దేవతలను, ఋషులను, హరిభాక్తులను హింసిస్తుండగా శ్రీమహావిష్ణువు తన సేవకుల్లో ఒకరైన సుముఖున్ని హిరణ్యకశిపునికి కుమారుడిగా జన్మించమని ఆదేశించగా, అతడు ప్రహ్లాడునిగా జన్మించి, చిన్నతనంనుండే విష్ణుభక్తుడు అయ్యాడు. ఇది సహించక హిరణ్యకశిపుడు అనేక విధాలుగా అతన్ని మార్చడానికి ప్రయత్నించి విఫలుడై తన సేవకులతో ప్రహ్లాదున్ని సముద్రంలో పడవేసి, అతని మీద ఒక పర్వతాన్ని వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు.

అప్పుడు సేవకులు సింహగిరి పర్వతాన్ని ప్రహ్లాదునిపై వేయగా స్వామి వచ్చి రక్షిస్తాడు. ఆ సింహగిరే నేటి సింహాచలంగా రూపాంతరం చెందింది. ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్ష, హిరణ్యకశిపులని వధించిన అవతారాలైన వరాహ, నారసింహ రూపాలతో కలిసిన రూపంగా స్వామి ఇక్కడ వెలిశాడు. భక్తితో ప్రహ్లాదుడు స్వామికోసం ఇక్కడ ఒక ఆలయం కట్టించి వరాహనృసింహ స్వామిని పూజించినట్టు పురాణ కథనం. కృతయుగం చివరిలో ఈ ఆలయం నిరాదరణకు గురై కొంత భాగం భూమిలో కప్పబడిపోయింది. తరువాతి యుగంలో చంద్రవంశ రాజు వురూరవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ప్రహ్లాదుని కథ విష్ణుపురాణంలోను, భాగవతంలోను ప్రస్తావించబడింది. సింహాచలం ప్రహ్లాదుని రక్షించిన క్షేత్రంగాను, అహోబిలం హిరణ్యకశిపుని వధించిన తరువాత వెలసిన క్షేత్రంగాను పురాణ కథనం. 

ఆలయంలో స్వామివారి ప్రధానోత్సవాలు :

ఆగమ శాస్త్రం మరియు శిష్టాచార సాంప్రదాయం ప్రకారం ఆలయ ఉత్సవాలు చాలా ఉన్నాయి. కల్యాణోత్సవం, చందనోత్సవం, ధనుర్మాస ఉత్సవం, వారోత్సవం, మాసోత్సవం జరుపుతారు. చందనయాత్ర వీటిల్లో అతి ముఖ్యమైనది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలలనుండి భక్తులు వస్తారు. వైశాఖ మాసంలోని అక్షయతృతీయ రోజు ఈ ఉత్సవం చేస్తారు. ఇది శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన ఉత్సవంగా భావిస్తారు. ఈ రోజు స్వామికి చందనం సమర్పించినవారికి, దర్శించినవారికి మోక్షం, ఆనందం కలుగుతాయి. స్వామివారి చందనం తెల్లవారుఝామున తీసి పన్నెండు గంటల నిజరూప దర్శనం తరువాత సాయంత్రం మళ్ళీ చందనపూత వేస్తారు. పన్నెండు మణుగుల చందనం స్వామివారికి మూడు సార్లుగా వేస్తారు. అవి నరసింహ జయన్తి, ఆషాడ శుద్ధపూర్ణిమ, జ్యేష్ఠ శుద్ధ పూర్టిమ.

ఈ ఆలయం కట్టడం విభిన్నంగాను వివిధ పద్ధతుల మిళితంగాను ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు శిల్పకళా శోభితాలు. స్తంభాల మీద రకరకాల నరసింహ మూర్తులను ధ్యాన శ్లోక వర్ణనల ఆధారంగా మలిచారు. శ్రీవరాహ స్వామికి, శ్రీనరసిహునికి విడివిడిగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ ఈ రెండు ఒకటిగా కలిసి ప్రధాన దైవంగా ఆరాధించబడే స్థలం సింహాచలం ఒక్కటే. రెండూ స్వామివారి ఉగ్రరూపాలు అవడం చేత చందనంతో కప్పబడి ఉంచారనే అభిప్రాయం ఉంది.

Brahmasri chaganti koteswara rao garu 


లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం
























చందనోత్సవం

‘‘కుందాభనుందరతనుః పరిపూర్ణచంద్ర,
బింబానుకారి వదనో ద్విభుజస్ర్తినేత్రః
శాన్తస్ర్తిభంగి లలితః క్షితిగుప్తపాదః, సింహాచలే
జయంతి దేవవరో నృసింహః’’

శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం. సంవత్సరానికి ఒక్కరోజున అంటే ఈ వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే ఆ స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది. సంవత్సరమంతా చందన లేపనంతో ఉండే స్వామి ఈ ఒక్కరోజు మాత్రం నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ నిజరూప దర్శనం కోసం దేశం నలుమూల నుంచి ఎందరో భక్తులు వస్తారు. ఆ సింహాచలేశుని చందన యాత్రకి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

ఈ చందన యాత్ర వెనుక, విష్ణుమూర్తి నారసింహావతారం ధరించటం వెనుక ఓ కథ చెబుతారు. రాక్షణ రాజైన హిరణ్యకశిపుడు భ్రహ్మకోసం తపస్సు చేసి ఏ విధంగానూ తనకి మృత్యువు రాకుండా వరం పొందుతాడు. ఆ వరగర్వంతో లోకాలన్నింటినీ హింసించడం మొదలుపెడతాడు. అతని ఆగడాలను భరించటం కష్టమైన సమయంలో ముల్లోకవాసులు విష్ణువుకు మొరపెట్టుకుంటారు. అప్పుడు వారిని హిరణ్యకశిపుడు పెట్టే బాధలనుంచి రక్షించటానికి, బ్రహ్మ ఇచ్చిన వరాలకు భంగం కలగకుండా నరుడి దేహం, సింహపు తలతో నరసింహావతార మెత్తుతాడు విష్ణుమూర్తి. ఆ రూపంతో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఆ సంహారం మహోగ్రంగా సాగుతుంది.

ఆ తరువాత ఆ ఉగ్రం వెంటనే శాతించదు. అప్పుడు బ్రహ్మాది దేవతలు భక్తుడైన ప్రహ్లాదునికి ఓ సలహా ఇస్తారు. బ్రహ్మదేవునికి ఓ విషయం గుర్తుకు వస్తుంది. శ్రీచందన వృక్షానికి ఉగ్రత, ఉష్ణం, తాపం తగ్గించే శక్తి వుంది. కాబట్టి ఆ స్వామి ఉగ్రాన్ని శ్రీ చందన లేపనంతో శాంతింప చేయమని ప్రహ్లాదునికి సలహా ఇస్తాడు బ్రహ్మ. ఆ మాటను అనుసరించి ప్రహ్లాదుడు చందనం తెప్పించాడు. ఆ పరిమళంలోని చలువ పరిసరాలలో ప్రసరించగానే ఆ ఉగ్రమూర్తి శాంతించ సాగాడు. ఇక అప్పుడు ప్రహ్లాదుడు ఆ స్వామిని ప్రార్థిస్తూ చందనం పూయటంతో పూర్తిగా శాంతించాడట ఆ ఉగ్రనరసింహుడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని నరసింహ రూపంలోనే ప్రస్తుతం సింహాచలంగా పిలుస్తున్న సింహగిరిపై ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం.

ప్రతీ ఏటా వైశాఖ శుద్ధ విదియనాడు రాత్రి ఆ విగ్రహానికి ఉన్న పాతచందనం అంతా పూర్తిగా ఒలిచివేస్తారు. తదియనాడు స్వామికి సహస్ర ఘటాభిషేకం, ఆ పైన విశేషపూజలు జరుపుతారు. ఈ ఒక్కరోజు భక్తులు వరాహ, నారసింహ రూపంలో ఉన్న స్వామిని దర్శించుకోగలుగుతారు. తిరిగి స్వామివారి చందన లేపనంతో చందనోత్సవం పూర్తవుతుంది. వచ్చే సంవత్సరం చందనోత్సవం లోపు నాలుగుసార్లు స్వామికి చందన లేపనం చేస్తారు. దానిని కరాళ చందన ఉత్సవం అంటారు. సింహాచలం చూసి తీరవలసిన క్షేత్రం. సంపెంగి పూల పరిమళాలతో, ప్రశాంతమైన వాతావరణంలో, ఎత్తైన కొండపై ఉన్న ఈ ఆలయం పడమటి ముఖంగా ఉంటుంది. ఇలా ఉన్న ఆలయాన్ని దర్శించటం వల్ల విజయం సిద్ధిస్తుందని చెబుతారు పెద్దలు. ఆ ప్రాంతవాసులు ఆపదలు తీర్చి ఆదుకునే 'అప్పన్న'గా పిలుస్తారు. ఈ రోజంతా అక్కడ అప్పన్న నామం ప్రతిధ్వనిస్తూ వుంటుంది. ఆ స్వామి నిజరూప దర్శనం సకల పాప హరణమని భక్తుల నమ్మకం. 


రేపు అప్పన్న చందనోత్సవం

తెల్లవారుజాము 4 నుంచే సాధారణ భక్తులకు దర్శనాలు
రాత్రి 7 గంటల వరకే క్యూల్లోకి ప్రవేశం
విస్తృత ఏర్పాట్లు చేపట్టిన ఆలయ వర్గాలు
సింహాచలం, న్యూస్‌లైన్ : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం శుక్రవారం అంగరం వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. వరాహ, నృసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని 12 మణుగులు (500 కిలోలు) చందనంతో ఏడాదంతా నిత్య రూపంతో దర్శనమిచ్చే స్వామి, ఏటా వైశాఖ శుద్ధ తదితయనాడు మాత్రమే నిజరూప దర్శనమిస్తారు.

 నాలుగు విడతలు చందనం సమర్పణ
 ఏడాదిలో నాలుగు విడతలుగా మూడు మణుగుల (120 కిలోలు) చొప్పున చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడు విడతలుగా మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు.
     
 అర్ధరాత్రి నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభం

పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 నుంచే వైదిక కార్యక్రమాలను అర్చకులు ప్రారంభిస్తారు. శుక్రవారం తెల్లవారుజాము 3.30 గంటలకు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు తొలి దర్శనం చేస్తారు. అనంతరం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు అందజే స్తారు. రాత్రి  8.30 గంటల నుంచి శ్రీ వైష్ణవస్వాములు సహస్రఘట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. సింహగిరిపై ఉన్న గంగధార వద్ద నుంచి వెయ్యి కలశాలతో నీటిని తీసుకొచ్చి స్వామి నిజరూపాన్ని అభిషేకిస్తారు. 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామికి తొలివిడత చందనాన్ని (125 కిలోలు) సమర్పించి మరల నిత్య రూపభరితుడ్ని చేస్తారు.
http://www.sakshi.com nundi sekarana

Thursday, February 6, 2014

ఆంజనేయ స్వామి వారి "గంధ సింధూర





ఆంజనేయ స్వామి వారి "గంధ సింధూర" ప్రాధాన్యత:-
___________________________________
* ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.
*ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది.
*ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది.
*చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు.
*వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలగరు.
*విద్యార్థులు, విధ్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు.
*లో బీపీ ఉన్నవారు రక్త మీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్దిస్తుంది.
*గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.
*ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తరువాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన వన్నీ నెరవేరుతాయి.
******ఆంజనేయస్వామికి సింధూరాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుంది*****
ప్రత్యూష కిరణాలు

Saturday, December 21, 2013

ధృవుడు 'ధృవ తారగా' ఎలా మారాడు?





















ధృవుడు 'ధృవ తారగా' ఎలా మారాడు?
..............................
పూర్వం ఉత్తానపాదుడనే రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. వారిద్దరికీ చెరొక కొడుకూ ఉండేవారు. 
పెద్ద భార్య సునీతి శాంత స్వభావం కలది. ఆమె కొడుకు ధృవుడు. 

రెండోభార్య సురుచికి అందగత్తెననే అహంకారం. నోటి దురుసు తనం వల్ల రాజు ఆమెను ఎదిరించలేక పోయేవాడు. ఆమె కొడుకు ఉత్తముడు.

అప్పుడు ధృవుడు ఐదేళ్ల పసివాడు. అయినా తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టే నేర్పు ఆ పసివాడికి పుట్టుకతో వచ్చింది. 

పట్టపు రాణిగా తన తల్లికి లభించవలసిన గౌరవం తండ్రి గాని, పినతల్లి గాని ఇవ్వక పోగా, ఆమెను దాసి కన్నా చులకనగా చూడటం గమనించాడు. 

శాంత గుణం, ఓరిమి గల తల్లి పినతల్లి అధికారాన్ని, తండ్రి నిర్లక్ష్యాన్ని సహించి, లోలోపలే బాధపడటం కూడా గమనించాడు. 

ఒకనాడు రాజు అంతఃపురంలో సింహాసనంపై కూర్చుని, ఒడిలో ఉత్తముని పెట్టుకుని ముద్దాడుతున్నాడు. 
అటువైపు వచ్చిన ధృవుడు, తండ్రి దగ్గరకు వెళ్లి తాను కూడా ఒడిలో కూర్చుంటానని అడిగాడు. 
అయితే చిన్న భార్య అక్కడే ఉండటంతో, రాజు ధృవుణ్ని దగ్గరకు తీయలేదు. 

కానీ ధృవుడు తాను కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలన్న పట్టుదలతో తమ్ముడిని లాగ బోయాడు. 
పినతల్లి అతణ్ని చూసి హేళనగా ‘‘నా కడుపున పుట్టినవారికే ఆ స్థానం దక్కుతుంది. 

నీకంత కోరికగా ఉంటే, తపస్సు చేసి దేవుడిని ఆ స్థానం కావాలని ప్రార్థించు’’ అని బయటకు ఈడ్చింది.
తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండటం చూసి ధృవుడికి కోపం, రోషం, ఏడుపు అన్నీ ఒక్కసారిగా వచ్చాయి. 

చిన్నబోయిన ముఖంతో తల్లి వద్దకు వెళ్లాడు. 
కొడుకు బాధను చూసి ఆ తల్లి ఏడ్చింది. 
‘‘నీ పినతల్లి చెప్పింది నిజమే. 
నీవు నా కడుపున పుట్టకుండా ఆమె కడుపున పుట్టి ఉంటే, 
నీకు ఇంత అవమానం జరిగేది కాదు. 
ఆమె చెప్పినట్లే భగవంతుని ప్రార్థించు నాయనా’’ అని బాధపడింది.

తల్లి బాధను చూసిన ధృవుడు..ఎంత కష్టమైనా తపస్సు చేసి, తన తల్లికి ఉన్నత స్థానం దక్కేలా చేయాలని నిశ్చయించుకున్నాడు. 
తనకు, తన తల్లికి జరిగిన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకోనిదే రాజభవనంలో తిరిగి అడుగుపెట్టనని శపథం చేశాడు.

తల్లి కోసం ఏదైనా చెయ్యాలన్న లక్ష్యంతో బయలుదేరిన ధృవుడి వద్దకు నారదముని వచ్చాడు. 

జరిగింది మర్చి పొమ్మని, కొంతకాలానికి పరిస్థితులు చక్క బడతాయని ఊరడించాడు. 
కానీ ధృవుడు తన పట్టుదలను వదల్లేదు. 

ధృవుని మనోధైర్యాన్ని మెచ్చుకున్న నారదుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు.

అడవిలోకి వెళ్లిన ధృవుడు తన లక్ష్యం నెరవేరడానికి పటిష్టమైన ప్రణాళిక వేసుకున్నాడు. 
తన శరీరాన్ని, మనస్సును మెల్లమెల్లగా తపస్సుకు సిద్ధం చేసుకున్నాడు. 

మొదటి నెలలో మూడురోజులకొకసారి పళ్లు మాత్రం తింటూ ధ్యానం మొదలుపెట్టాడు. 
రెండోనెలలో ఆరు రోజులకొకసారి ఆకులు మాత్రం తిన్నాడు. 

మూడోనెలలో తొమ్మిది రోజులకొకసారి మంచినీరు తాగుతూ తపస్సు కొనసాగించాడు. 

నాల్గవ నెలలో 12 రోజుల కొకసారి మాత్రం గాలి పీల్చుతూ ధ్యాన యోగంలో గడిపాడు. 

ఐదవ నెలలో శ్వాసను బంధించి, ఒంటి కాలిపై నిలబడి తదేక ధ్యానంలో మునిగిపోయాడు. 

ఆరో నెలలో కాలి బొటనవేలిపై నిలబడి, తన మనస్సులో శ్రీహరిని ధ్యానించాడు.

దేవతలకు, యోగులకు కూడా సాధ్యం కాని ఆ కఠినమైన తపస్సుకు శ్రీ మహా విష్ణువు మురిసిపోయి, ధృవుని వద్దకు వచ్చి, వరం కోరుకోమన్నాడు. తనకు, తన తల్లికి ఉన్నత స్థానం కావాలన్నాడు ధృవుడు. 

అతని మాతృభక్తికి సంతోషించి, ‘‘చాలా కాలం భూమిని పాలించి, 
తరువాత విష్ణు లోకం చుట్టూ తిరిగే నక్షత్ర మండలంలో శాశ్వత స్థానం పొందుతా’’వని వరమిచ్చి, అదృశ్యమయ్యాడు.

జనరంజకంగా చిరకాలం పాలించిన ధృవుడిని నక్షత్ర మండలానికి తీసుకు వెళ్లడానికి విమానం తీసుకువచ్చిన 
విష్ణు కింకరులతో తల్లిని విడిచి రాలేనన్నాడు. 

వారు సంతోషించి, అంతకన్నా ముందే విమానంలో ఉన్న అతని తల్లిని చూపారు. 
అది చూసిన తరువాతనే ధృవుడు విమానం ఎక్కాడు. 

నక్షత్ర మండలాన్ని చేరుకుని, ధృవతారగా శాశ్వతంగా వెలుగుతూ, 
ప్రతి రోజూ సూర్యుని కంటే ముందుగా తన కాంతిని లోకానికి ప్రసాదిస్తూ, 
తల్లిని పూజించిన వారికి లభించే ఉన్నత పదవికి సాక్షిగా ప్రకాశిస్తున్నాడు.

ప్రత్యూష కిరణాలు::రచన వెంకట మధు 

Saturday, December 14, 2013

శనివారం హనుమంతుని పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి






శనివారం హనుమంతుని పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి , సకల శ్రేయస్సును ఇస్తుంది. ఎందుచేత?
.................................

శనివారము నాడు హనుమంతుడిని పూజించడం చాల శ్రేయస్కరము. 
అని పురాణాలు చెబుతున్నాయి. 
ఎందుకంటే, హనుమంతుడు శనివారము పుట్టడం వలన అంత ప్రాధాన్యత కూడా లభించింది.

"సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః''

(అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం)
హనుమంతుని శనివారం వ్రతానికి ఒక కారణం కూడా ఉంది. 
శని గ్రహం ఎంత క్రూర స్వభావం కలవాడో, అంత సౌమ్యం కూడా కలవాడు.
ఒకానొక రోజు శనీశ్వరుడు హనుమంతుడిని సమీపించి, మారుతీ! నేను శనీస్వరుడిని. 
నేను అందరినీ పట్టి బాధించాను. కానీ, ఇప్పటి వరకు నిన్ను పట్టుకోలేకపోయాను. 
ఇప్పుడు నా చేతికి చిక్కావు. అని అంటాడు. 
అప్పుడు, హనుమంతుడు శనీస్వరుడా! నువ్వు నన్ను పట్టుకుంటావా? 
లేకా నాలో ఉంటావా? నువ్వు నాలో ఎక్కడ ఉండదలుచుకున్నావు? అని అడుగుతాడు. 
అప్పుడు శనీశ్వరుడు, నేను నీ నెత్తి మీద కుర్చుంటాను అని అంటాడు.
హనుమంతుడు, శనీశ్వరుడు కోరిక మేరకు నెత్తి మీద కూర్చుండ పెట్టుకొని, 
శనీస్వరుడిని బాధించాలని మారుతీ కి మనస్సులోని కోరిక కలిగింది. 
ఒక మహా పర్వతాన్ని పెకలించి నెత్తిమీదకు ఎత్తు కొన్నాడు హనుమంతుడు.
కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిల తన్నుకొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు. 
జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు. 
ఊపిరాడక శని వలవల ఏడ్చేశాడు. 
తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ, ఏడుస్తూ ప్రార్ధించాడు. 
శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి "మందా! నన్ను పట్టుకొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .
అప్పుడే గిజ గిజలాడి పోతున్నావే?'' అని ప్రశ్నించాడు.
"ప్రజలను బాధించటమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు. 
అందుకని నిన్ను ఒక రకంగా శాశించి వదిలి పెడతాను'' అన్నాడు. గత్యంతరం లేక శని సరేనన్నాడు.
హనుమ "శనీశ్వరా! నా భక్తులను బాధించ రాదు, నన్ను పూజించే వారిని, నా మంత్రాన్ని జపించేవారిని, 
నా నామస్మరణ చేసే వారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసే వారిని ఏ కాలంలోనైనా ముట్టుకోకూడదు, బాధించ రాదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను'' అని చెప్పి, శనితో వాగ్దానం చేయించుకొని వదిలి పెట్టాడు. 

అందుకే శనివారానికి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. 
శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శనీశ్వరుడి శరీరమంతా గాయాలై బాధించాయి. 
ఆ బాధా నివృత్తికే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించడు.

"మంద వారేషు సంప్రాప్తే హనూమంతం ప్రపూజయేత్ –సర్వేశ్వాపిచ వారేషు మంద వారః ప్రశాస్యతే|
హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా||''

శని వారం రాగానే హనుమంతుని పూజించాలి. 
ఆయన శనివారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. 
అందుకే శనివారం చేసే హనుమంతుని పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది.
rachana::Venkata madhu

Sunday, December 1, 2013

దీపం లక్ష్మీదేవి రూపం






















దీపం లక్ష్మీదేవి రూపం

దీపం జ్యోతి పరబ్రహ్మమ్ దీపం జ్యోతి పరాయణమ్ 
దీపేన హారతే పాపమ్ దీప దేవి నమోనమః

దీపం పరబ్రహ్మ స్వరూపం. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ కాంతి వలయం అందరిదీ. 
దీపం పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే..అంధకారాన్ని పటాపంచలు చేయడం. 
అంధకారమంటే కేవలం చీకటిగా ఉండడమే కాదు..మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! 
ఈ అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే మాత లక్ష్మీదేవి. ఈ అద్భుతశక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. 
కాబట్టే దీపానికి మనం నమస్కరిస్తున్నాము. దీపానికి నమస్కరించడమే కాదు. 
నమస్కరించి ప్రదక్షిణలు చేసి, పండుగలు చేసుకుంటున్నాం. దీపావళి ఇటువంటి పండుగేకదా!

ఈ దృష్టితో చూస్తే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టే..ఏ పని ప్రారంభించాలన్నా దీపం వెలిగించి ప్రారంభిస్తాం. 
దైవారాధననూ దీపం వెలిగించే ప్రారంభిస్తాం. దీపారాధన చేయకుండా అసలు ఏ పుణ్యకార్యం చేయరు. 
దీపానిది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టే. అధో దృష్టి దానికిలేదు. అంటే కిందకి చూడదు. ఎప్పుడూ పైకే చూస్తూ వెలుగుతుంది. 
మన మనసు ఊర్ధ్వ జగత్తుపైనే లగ్నం కావాలని చెబుతుంటుంది దీపం. 
ఇక్కడ ఊర్ధ్వ జగత్తు అంటే కేవలం స్వర్గ లోకం మాత్రమే కాదు. జీవితంలో ఎదుగుదల అని. 
ఎన్ని కష్టాలు వచ్చినా, ఆశావాదంతో జీవిస్తూ, 
శక్తివంతమైన దీపాన్ని దైవారాధన చేసే సమయంలో కొన్ని సూత్రాలు పాటిస్తూ దేవుని వద్ద ఉంచాలి. 
అమ్మవారి పూజలో నూనె దీపాన్ని ఎడంవైపు, ఆవు నెయ్యి దీపాన్ని కుడివైపు వెలిగించాలి. 
జపం చేసేటప్పుడు జపమాలపై వస్త్రం కప్పి ఉంచాలి. మాల బయటకు కనిపించకూడదు. 
దీపం శివునికి ఎడంవైపు, విష్ణువుకు కుడివైపు ఉండాలి. ఏ దైవానికైనా దీపం ఎదురుగా మాత్రం ఉంచరాదు.
teluguone nundi sekarinchinadi
SunderPriya

Wednesday, November 27, 2013

పంచ దేవతలు ఎవరు?


















"మన హిందూ దేవాలయాలు,మరియు వాటి విశిష్టతలు''
పంచ దేవతలు ఎవరు? "పంచాయతనము" గురించి క్లుప్తంగా తెలుసుకుందాము:-
...........................................

ఆదిత్య మంబికా విష్ణుం గణనాథ మహేశ్వరమ్ 
సర్వేష్టం సారభూతం చ పంచదేవాయ సేవనమ్!! 
తాత్పర్యం:- 
................

సూర్యుడు, అంబిక , విష్ణు, గణపతి, ఈశ్వరుడు వీరినే పంచ దేవతలు అంటారు. వీరు కలియుగ పాపకర్మలు భరించలేక కొన్ని ప్రత్యేక శిలల్లో ఉన్నట్లు 'సిద్ధాంత శేఖరంలో' చెప్పబడినది. ఆ శిలలో మాత్రమే ఆ దేవతా విగ్రహాలను మలచి పూజలు సల్పిన సత్ఫలితము లొసంగును. దేవతా పూజా నిరాటంకముగా (ఆటంకం లేకుండా) సాగగలదు. పంచదేవతా పూజ చాలా ప్రశస్తమని 'దేవీ భాగవతము' నందు కలదు. కలియుగ ధర్మాన్ని అనుసరించి ఈ అయిదుగురు దేవతలు ఆయా సాల గ్రామ శిలలోనే ఉంటారట. 
1) సాల గ్రామ లింగం (విష్ణువు):-
............................................ 

ఈ శిలలు నేపాలులో ముక్తినాథ దగ్గర గండకీ నది యందు లభించును. ఈ శిలలు చిన్న చిన్న రంధ్రములు కలిగి ఉంటాయి. నీటిలో రాయి వేసి తులసీ దళం వేసిన ఆ రంధ్రానికి దగ్గరగా తులసి చేరునట. విష్ణువుని మధ్యలో పెట్టి మిగతా దేవతా విగ్రహాలు శాస్త్ర ప్రకారము పెట్టిన, అది విష్ణు పంచాయతన మందురు. అట్లు పూజించిన వారికి విష్ణు సాయుజ్యము కలుగునని పద్మ పురాణంలో గలదు. 
2)బాణ లింగం(శివుడు):- 
.................................

మధ్యప్రదేశ్ లో ఓంకారేశ్వర్ దగ్గర నర్మదానదిలో లభించును. బాణలింగ సహిత రుద్రుని పూజించుట వల్ల ఆత్మజ్ఞానం లభించును. బాణలింగ సహిత రుద్రుణ్ణి మధ్యలో పెట్టి పూజించిన శివాపంచాయతనమందురు.
3)స్ఫటిక లింగం (సూర్యుడు):- 
.......................................

ఈ స్ఫటికలింగాలు తంజావూరు దగ్గర కావేరీ నదిలో లభించును. ఆదిత్యం ఆరోగ్యం అన్నట్లు సూర్య పూజ వల్ల ఆరోగ్యం లభించును. సూర్యుని మధ్యలో పెట్టి పూజించిన సూర్య పంచాయతనమందురు. 
4)అంబికా లింగం (అంబిక):- 
....................................

ఈ లింగములు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాళహస్తి దగ్గర గల సువర్ల ముఖీనదిలో దొరుకును. అంబికాలింగ సహిత పూజసల్పిన భోగం లభించునని సిద్ధాంత శేఖరంలో గలదు. దేవీస్తానమందు దుర్గనుగాని, లక్ష్మినిగాని, సరస్వతిని గాని, శక్తి శ్రయాన్ని అర్చించవచ్చు. 
5)శోణలింగం (గణపతి):-
................................

ఉత్తరప్రదేశ్ లోని శోణభద్ర జిల్లాలో యున్న నదిలో కల శిలలు మైనాక పర్వతం నుండి ఉత్తరంగా వచ్చి గంగలో కలియుచున్నది.(పాట్నా వద్ద) ఈ శోణలింగ సహిత గణపతి పూజ వల్ల కార్యములు నిర్విఘ్నముగా నెరవేరును. గణపతిని మధ్యలో పెట్టి ఉంచిన గణపతిపంచాయతన మందురు.

Monday, November 18, 2013

బిల్వ వృక్షం భూలోకంలో ఉద్భవించడానికి గల కారణం?






బిల్వ వృక్షం భూలోకంలో ఉద్భవించడానికి గల కారణం?
.......................................................................

ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. 
అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. 
మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?" అని చెప్పింది. 
ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. 
తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు. 
అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, 
అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, 
ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది.  



అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. 
అందుకు కోపగించుకున్న వినాయకుడు, 
లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు 
గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. 
లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. 
ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి. 
అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. 
ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. 
ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.  




వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!!' అని కేకలు వేయసాగింది. 
అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి. శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. 
అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది. 
అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, "తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు. 
నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. 
నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. 
మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి" అని దీవించాడు. 
ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది. 

Visraja













భక్త కన్నప్ప--1976

శివ శివ శంకర..భక్తవశంకర
శంభో  హర హర..నమో నమో
శివ శివ శంకర..భక్తవ శంకర
శంభో  హర హర..నమో నమో

పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను

ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల చేయాలి నీ సేవలు

శివ శివ శంకర..భక్తవశంకర
శంభో  హర హర..నమో నమో

మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు

గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేనా నీ సేవకు

శివ శివ శంకర..భక్తవశంకర 
శంభో  హర హర..నమో నమో 

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!























శ్రీ మంజునాథ--2001

ఓం మహా ప్రాణ దీపం శివం శివం
మహోంకార  రూపం శివం శివం
మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం

మహా కాంతి భీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం భజే మంజునాథం
ఓం ఓం ఓం నమ: శంకరాయచ
మయస్కరాయచ నమ: శివాయచ
శివతరాయచ భవహరాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం అర్ఠనారీశ్వరం
త్రిదశ హృదయంగమం చతుర్దతిసంగమం
పంచభూతాత్మకం శత్చత్రునాశకం
సప్త స్వరేశ్వరం అష్ట సిద్దిశ్వరం
నవరస మనోహరం  దశ దిశా సువిమలం

ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం
ప్రస్తుతివశంకరం ప్రనదగణ కింకరం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
ప్రాణి భవతారకం ప్రకృతి హిత కారకం
భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం  రక్షకం

ఈశమ్..సురేశం..ఋషేశం..పరేశం
నటేశం..గౌరీశం..గణేశం..భూతేశం
మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్శమ్

ఓం నమోహరాయచ స్మర హరాయచ 
పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ 
ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిద్రాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

డండండ డండండ డండండ డండండ
డక్కానినాధ నవ తాండవాడంబరం
తద్దిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమిదిమ్మి
సంగీత సాహిత్య సుమ కమల భంబరం

ఓంకార హ్రీంకార  శ్రీంకార  ఐంకార
మంత్రభీజాక్షరం మంజునాదేశ్వరం
రుగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం
సామ ప్రగీతమ్ అధర్మ ప్రగాతం
పురణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచైక సూత్రం విబుద్దం సుసిద్దం

నకారం మకారం శికారం వకారం యకారం
నిరాకార సాకార సారం
మహా కాల కాలం మహా నీలకంఠం
మహానందనందం మహాటాట్టహాసం

జటాజూటరంగైకగంగాసుచిత్రం
జ్వలద్వుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాసం మహా భానులింగం
మహా వత్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరష్ట్ర సుందరం సౌమనాదేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం
బైద్యనాదేశ్వరం మహాభీమేశ్వరమ్
అమరలింగేశ్వరం రామలింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం  పరంఘ్రుష్మేశ్వరం
త్ర్యమ్బకాదీశ్వరమ్ నాగలింగేశ్వరం
శ్రీ కేదారలింగేశ్వరం

అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం
వాయులింగాత్మకం అత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం
అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం

అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం..ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం

ఓం నమ: సోమయచ సౌమ్యయచ
భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ
యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ
రమ్యాయచ  గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వయచా

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


















శ్రీ కాళహస్తి మహాత్మ్యం--1954

ఓం నమశ్శివాయా 
నవనీత హృదయా సమప్రకాశా  
కరునేందుభూషా నమో శంకరా దేవ దేవా  

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా..దేవా
మహేశా పాప వనాశా కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా 

భక్తి యేదో పూజ లేవో తెలియనైతినే 
పాపమేదో పుణ్యమేదో కాననైతినే..దేవా
పాపమేదో పుణ్యమేదో కాననైతినే..దేవా

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా

మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా 
మంత్ర యుక్త పూజచేయ మనసు కరుగునా
మంత్రమో తంత్రమో యెరుగ నైతినే 
మంత్రమో తంత్రమో యెరుగ నైతినే

నాదమేదో వేదమేదో తెలియనైతినే 
నాదమేదో వేదమేదో తెలియనైతినే
వాదమేల పేద బాధా..తీర్చరావయా..స్వామీ
వాదమేల పేద బాధా..తీర్చరావయా..స్వామీ

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా


!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

























భుకైలాస్--1958
సంగీతం::R.సుదర్శనం, R.గోవర్ధనం
రచన::సముద్రాల రాఘవాచార్య
గానం::ఘంటసాల


దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

దురిత విమోచనా..ఆఅ..ఆఅ..ఆఆఅ..ఆఅ..అ.అ 
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

నమో నమో నమో నమో నమో నమో

నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో 
నారద హృదయ విహారి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
పంకజ నయనా పన్నగ శయనా..ఆ ఆ ఆఆఆఅ...
పంకజనయనా పన్నగ శయనా
పంకజనయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో

నారాయణ హరి నమో నమో 
నారాయణ హరి నారాయణ హరి
నారా..యణ హరి నమో నమో

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!





















తిలంగ్:::రాగం
{హిందుస్తానీ-కర్నాటక


సంగీతం::C.సముద్రాల
రచన::C.రాఘవాచార్య
గానం::ఘంటసాల

జయజయ మహాదేవా శంభో సదాశివా
ఆశ్రిత మందార శృతిశిఖర సంచారా..ఆ ఆఆ

నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా
నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా
సత్యసుందరా స్వామి..నిత్య నిర్మల పాహి
సత్యసుందరా స్వామి..నిత్య నిర్మల పాహి
నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా

చరణం::1

అన్యదైవము గొలువా
ఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆ
అన్యదైవము గొలువా
నీదుపాదము విడువా
అన్యదైవము..ఉ ఉ..గొలువా
నీదుపాదము విడువా
దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా
దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా
నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా

చరణం::2

దేహి అన వరములిడు దానగుణసీమ
పాహియన్నను మ్రొక్కి నిన్ను పరంధామా
నీమమున నీ దివ్య నామ సంస్మరణ
ఏమరక చేయుదును భవతాప హరణ
నీ దయామయ దృష్టి సురితమ్ములార
వరసుభావృత్తి నా వాంఛ నీవేరా
కరుణించు పరమేశ దరహాస భాసా
హరహర మహాదేవ కైలాసవాసా కైలాసవాసా

చరణం::3

ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
కన్నులవిందుగా భక్తవత్సల కానగ రావయ్యా
కన్నులవిందుగా భక్తవత్సల కానగ రావయ్యా
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
శంకర శివశంకరా అభయంకరా విజయంకరా
శంకర శివశంకరా అభయంకరా విజయంకరా
శంకర శివశంకరా అభయంకరా విజయంకరా


!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!



Wednesday, November 13, 2013

అంజన పుట్టుక ( హనుమంతుడి తల్లి )























అంజన పుట్టుక ( హనుమంతుడి తల్లి )
...............................................

ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరిన సమయాన "పుంజికస్థల" అను అప్సరస బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగం చేయసాగింది, ఆమె యొక్క హావ భావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానర స్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపం పెట్టాడు. అంత ఆ "పుంజికస్థల" తన తప్పిదాన్ని మన్నించి శాపవిమోచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మనిచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించే. ఇది కంబ రామాయణ గాధలో గల వృత్తాంతము.

ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భము దాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మనిచ్చింది. ఆ బాలుడు శుక్ల పక్ష చంద్రునిలా దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకసంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగా కోరెను.అందువల్లనే హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగే. 

విచిత్ర రామాయణంలో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది.
అంజన --(అహల్య, గౌతమ ముని కుమార్తె)

వృక్షవ్రజస్సు (కుంజరుడు) అనే గొప్ప వానరరాజు ఉండేవాడు. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలో స్నానం చేస్తాడు, ఆ తటాకమునకు ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు. అప్పుడు ఆ ప్రదేశంలొ సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహిస్తారు. స్త్రీగా మారిన వ్రుక్షవ్రజస్సు ...అహల్యగా గౌతమమునిని వివాహమాడే. కొంతకాలానికి గౌతమముని వలన అంజన (శాపగ్రస్తురాలైన "పుంజికస్థలి" అనే అప్సరస), సూర్యుని వలన వాలి, ఇంద్రుని వలన సుగ్రీవులు జన్మిస్తారు. ఈ విషయాన్ని కుంభకర్ణుడు సుగ్రీవుడితో పలికిన మాటలు.
కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని, కూతురిని నడిపించుకుని, సముద్రతీరంలో తిరుగుతూ ఉంటే అంజన "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రంలోకి తోశాడు. ఆ పిల్లలే వాలి, సుగ్రీవులైనారని, తన గుట్టు బయటపెట్టినది, కనుక అహల్య, అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణంలో ఉంది.
హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రధాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతునిని ఆరాధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.
హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాధే క్లుప్తంగా చెప్పబడింది.
rachana::venkata madhu

Monday, October 21, 2013

అట్లతద్ది ఎలా జరుపుకోవాలి?


















అట్లతద్ది ఎలా జరుపుకోవాలి?

..................................


ఈరోజు అట్లతద్ది. ఇది ఆధ్యాత్మికతనే కాదు వినోదాన్నీ అందించే పండుగ. ఆశ్వయుజ పౌర్ణమి వెళ్ళిన మూడవ 


రోజు అట్లతద్ది. సాధారణంగా సెప్టెంబరు ఆఖరులో లేదా అక్టోబరు మొదటి వారంలో వస్తుందీ పండుగ. 

ఆంధ్రదేశంలో పెళ్ళయిన స్త్రీలు అట్లతద్ది జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పండుగ ఉద్దేశం ఏమిటో, ఎలా 
జరుపుకుంటారో ఒకసారి గుర్తుచేసుకుందాం.

అట్లతద్ది జరుపుకునే ఆడవాళ్ళు తెల్లవారుజామున స్నానం చేసి, అన్నం తిని ఇక రోజంతా అభోజనంగా ఉంటారు. సాయంత్రం గౌరీదేవికి పూజ చేసుకుని, చంద్రుని దర్శించుకుంటారు. ఆ తర్వాత అట్లు తిని, ఉపవాసం విరమిస్తారు. అప్పుడు 11 రకాల కూరలతో పసందైన భోజనం చేస్తారు.

అట్లతద్దికి ముందురోజు కాళ్ళు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు.

గుమ్మాలకు తోరణాలు కడతారు. తెల్లవారుజామున నిద్ర లేచి, స్నానపానాదులు ముగించి పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగులతో అన్నం తింటారు. ఆ తర్వాత సాయంత్రం వరకూ ఏమీ తినరు. ఆఖరికి మంచినీళ్ళు కూడా తాగరు.

అట్లతద్దినాడు పిల్లలు, స్త్రీలు ఉయ్యాల ఊగుతారు. పరవశంగా ఊయల ఊగుతూ

''అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్...''

లాంటి సరదా పాటలు పాడుకుంటారు.

గౌరీదేవికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.

అట్లతద్ది నోము నోచుకునే ఆడవాళ్ళు 11 మంది ముత్తయిదువలను ఆహ్వానిస్తారు.

అట్లతద్ది నోము నోచుకునే స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు.

పూజలో చేతులకు చేమంతి, తులసిదళం, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టిన తోరాలు కట్టుకుంటారు.

పూజలో కలశం పెడతారు. పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి ఉంచుతారు.

ఒక పళ్ళెంలో బియ్యం పోసి, మధ్యమధ్యలో డిప్పలు మాదిరిగా చేసిన కుడుములు ఉంచి, అందులో పసుపు కుంకుమలు వేస్తారు. మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. దాన్ని కైలాసంగా భావిస్తారు.

పూజలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం పూర్తయిన తర్వాత అట్లతద్ది కథ చదువుతారు.

ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున పెట్టి, పైన గౌరీదేవివద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొకటి పెట్టి, తాంబూలంతో వాయనం ఇస్తారు.

అట్లతద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు, ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి. వాయనంలో జాకెటు బట్ట ఇస్తారు. శక్తి ఉన్నవారు చీరలు పెడతారు.

వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి, అందులో వాయనం ఉంచి ఇస్తారు. 


అందుకునే స్త్రీలు కూడా అంతే.

వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు.

''ఇస్తినమ్మ వాయనం''

''పుచ్చుకుంటినమ్మ వాయనం''

''అందించానమ్మా వాయనం''

''అందుకున్నానమ్మా వాయనం''

''ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం''

''ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం''

ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ''అట్లతద్ది'' జరుపుకోవడం ఒకటి. మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ''కార్వా చౌత్'' వేడుకతో సమానం. చిత్రమేమిటంటే రోమ్ లో కూడా ఇలాంటి ఆచారం ఉంది. జనవరి 21వ తేదీన వచ్చే ''సెయింట్ ఆగ్నెస్ ఈవ్'' మన అట్లతద్ది పండుగలాగే ఉంటుంది.

ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు. పశ్చిమ దేశాల ప్రభావంతో ''అట్లతద్ది'' లాంటి సంప్రదాయ పండుగలు జరుపుకునే ఆచారం సన్నగిల్లుతున్నప్పటికీ ఇంకా ఈ సంప్రదాయం మరుగున పడలేదు. ఇప్పటికీ చాలామంది పెళ్ళయిన స్త్రీలు ''అట్లతద్ది'' జరుపుకుంటున్నారు.

Wednesday, August 21, 2013

హయగ్రీవ స్వామి


















!! హయగ్రీవ స్వామి  !!

శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు . హయగ్రీవుడు విష్ణువు యొక్క అవతారము , ఈయన అశ్వము వంటి తల కలిగినవాడు . హయ అంటే గుర్రము గ్రీవ అంటే మెడ అని అర్ధం . హయగ్రీవుడు ని పూజించినచో విద్య, తెలివి ప్రసాదింపబడతాయి . హయగ్రీవుడు మనిషి యొక్క శరీరము మరియు అశ్వము వంటి తల,తెల్లని రంగు ,తెల్లని దుస్తులు దరించి కమలం మీద కూర్చిని దర్శనమిస్తాడు . 

హయగ్రీవుని స్తుతి :

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం !
ఆధారం సర్వవిధ్యానం హయగ్రీవమ్ ఉపాస్మహే !!

పూర్వము శ్రీవదిరాజతీర్థ అనే భక్తుడు ఉడిపి శ్రీకృష్ణ మటము లో రోజు ఉలవలు (నవ ధాన్యాలలో ఒకటి) వండి హయగ్రీవునకు నైవేద్యం పెట్టేవాడు హయగ్రీవుడు స్వయంగా తెల్లని అశ్వము వంటి రూపముతో వచ్చి తినేవాడు అని ప్రసిద్ది . శ్రీవదిరాజతీర్థ 1480-1600 మధ్య కాలములో జీవించి ఉన్నట్టు తెలుస్తుంది . ఈయన కుమ్బాక్షి అనే గ్రామము ఉడిపి జిల్లా ,కర్నాటక రాష్రములో రామాచార్య ,గౌరి అనే దంపతులకు జన్మించారు . 

శ్రీవదిరాజతీర్థ ఈ విధముగా కవితా గానము చేసేవారు

న హయగ్రీవాత్ పరం అస్థి మంగలమ్ 
న హయగ్రీవత్ పరమ్ అస్థి పావనమ్ 
న హయగ్రీవమ్ పరమ్ అస్థి ధైవథమ్ 
న హయగ్రీవమ్ ప్రనిపథ్య సీధాతి !

హయగ్రీవునికన్నా మంగలప్రదమైనది మరొకటి లేదు . హయగ్రీవ ఉపాసన జన్మజన్మల పాపనాసనం . హయగ్రీవుడు అందరి దేవుల్లలోకి మొదటి వాడు . హయగ్రీవుని శరనానుగతి చేస్తే దుః ఖాలన్నీ తొలగిపోతాయి . 

500 సంవత్సరములకు ముందు దైవజ్ఞ బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన భక్తుడు విఘ్నేశ్వరుడిని పోత పోశాడు అయితే అది దానికదే హయగ్రీవునిగా మార్పు చెందింది . సార్వభౌమ శ్రీ వదిరాజ గురు స్వామీజీ కి స్వప్నములో హయగ్రీవుడు కనిపించి ఆ విగ్రహాన్ని తీసుకోమని చెప్పారు . తరువాత ఈయన దానిని శ్రీ సోదే వదిరాజ మటంలో ప్రతిష్టించారు . అప్పటి నుంచి దీనిని దైవజ్ఞ బ్రాహ్మణ కుటుంబీకులు పూజిస్తారు .

Friday, March 1, 2013

అస్టాదశ శక్తిపీఠాలు ఏవి ?







అస్టాదశ శక్తిపీఠాలు ఏవి ? 

1. శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.


2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.



3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.


4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.


5. జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.


6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.


7. మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. 
ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.


8. ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.


9. మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.


10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.


11. గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.


12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.


13. కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.


14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.


15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.


16. మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.


17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.


18. సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.

ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.నుండి సేకరించినవి 

పురాణాలలో విశిస్టమైన త్రియాలు ఏవి?







పురాణాలలో విశిస్టమైన త్రియాలు ఏవి?


బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు ----------------- త్రిమూర్తులు ,
సరస్వతి , లక్ష్మి , పార్వతి ---------------------త్రిమాతలు ,
భూలోకము , స్వర్గలోకం ,పాతాళలోకం ----------త్రిలోకాలు ,
భూత , వర్త , భవిష్యత్ కాలము ----------------త్రికాలాలు ,
సత్వ, రజో , తమో గుణము -------------------త్రిగుణాలు ,
పిత్రు ఋణము , ఋషి ఋణము , దేవ ఋణము---త్రిఋణాలు ,
ఉదయము , మధ్యాహ్నము , సాయంత్రము ------త్రిసమయాలు ,
కీర్తి -కాంత-కనకం--------------------------'తాప -త్రయాలు'



కర్మత్రయం::-

ఎండ,వర్షం,చలి-----------------వాతావరణం అనే విషయాన్ని సూచించే కర్మత్రయం,
అదుపు,స్వేచ్ఛ,ఉపేక్ష------------మన అధీనుల యెడల మనం అవలంబించవలసిన వైఖరి కి సంబంధించిన కర్మత్రయం,
నిజం,అబద్దం,రహస్యం-----------మనం ఇతరులకు ఏదైనా సమాచారం చెప్పవలసి వచ్చిన సందర్భంలో కర్మత్రయం,
రాజ్యం,సమాజం,వ్యక్తి------------రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కర్మత్రయం,
విశ్వాసం,శాస్త్రీయత,హేతుబద్ధత----ఆలోచనా విధానానికి సంబంధించిన కర్మత్రయం

enduku emiti elaa blog nundi sekarinchinadi 

Sunday, October 21, 2012

అష్టదిక్పాలకులు ఎవరు?
















అష్టదిక్పాలకులు ఎవరు?
వారి భార్యల పేర్లు చాలా మందికి తెలియవు.
అసలు అష్టదిక్పాలకులు అంటే ఏంటి?
నాలుగు ప్రధాన దిక్కులతో పాటు.. నాలుగు దిక్కుల మూలలకు కాపలాగా ఉండే వారినే-అధిపతులుగా ఉండే వారినే అష్టదిక్పాలకులు అంటారు.
ఒక హిందూ మతములోనే ఈ దేవతా మూర్తులను మనము చదువ గలుగూ ఉన్నాము . మిగతా మతాలలో ఈ నమ్మకము లేదు. ఆత్యాధ్మికముగా ఇది ఒక నమ్మకము మాత్రమే. ఉన్నారా? లేరా? అనేది ప్రక్కన పెడితే ... దేవుళ్లే మనకి కపాలా ఉన్నార్ననే నమ్మకము మనోబలాన్ని ఇస్తుంది.

అష్టదిక్పాలకులు..వారి సతీమణులు --వీరిలో-------->
..................................................................>
తూర్పు దిక్కుకు ఇంద్రుడు --భార్య : శచీదేవి,

పడమర దిక్కుకు వరుణుడు--భార్య : కాళికాదేవి,

ఉత్తర దిక్కుకు కుబేరుడు --భార్య : చిత్రరేఖాదేవి,

దక్షిణ దిక్కుకు యముడు--భార్య : శ్యామలాదేవి,

ఆగ్నేయానికి అధిపతిగా అగ్నిదేవుడు--భార్య స్వాహాదేవి:

నైరుతి దిక్కుకు అధిపతిగా నిర్భతి--భార్య : దీర్ఘాదేవి,

వాయువ్య దిక్కుకు వాయుదేవుడు--భార్య : అంజనాదేవి,

ఈశాన్య దిక్కుకు ఈశానుడు--భార్య : పార్వతీదేవి . . . .వీరినే అష్టదిక్పాలకులు అంటారు.

(rachana Venkata madhu)


Saturday, August 25, 2012

శిష్టజన రక్షణి దుర్గామాత



















శిష్టజన రక్షణి దుర్గామాత

సుమారు అన్ని వతారాలు దానవ సంహారము కొరకే అన్నట్లు కథలు ఉన్నాయి . తపస్సు చేసిన వారికి ... బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు వరాలివ్వడము ముందు వెనక ఆలోచించక -- వాటి ప్రభావమువలన దేవదానవ సోదర యుద్ధము ... తత్ఫలితము సురులు అతీత శక్తులుగా అవతారాలు ఎత్తడమే మన పురాణాల కథలు అన్నీ. ఆకోవకు చెందినదే దుర్గామాత అవతారము :

చిద్రూపి అయిన జగన్మాత శిష్టజన రక్షణార్థం దుష్ట శిక్షణకై భూమిపై అవతారాలు ఎత్తవలసి వచ్చింది. దుర్గగా పిలవబడటానికి ముందు ‘శతాక్షి’ పేరుతో స్తుతింపబడింది. హిరణ్యాక్షుని వంశంలో ‘రురుడు’ అనే రాక్షసునికి దుర్గముడు అనే కొడుకు పుట్టాడు. దుష్టుల హృదయాలు దురాలోచనలతోనే నిండి ఉంటాయి కదా! వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత, గర్తింపు, ఏదో సాధించాలనే తపన ఉంటుంది. వాళ్ళు అనుకున్నది సాధించటానికి ఎంత వక్రమార్గమైనా, ఎంత దుర్మార్గంతో నిండినదైనా మానరు. రాక్షసాంశతో పుట్టిన ఈ దుర్గముడికి వేదాలు దొంగిలించాలనే దుర్బుద్ధి పుట్టింది. వాటిని అపహరిస్తే దేవతల బలం తగ్గుతుందని అతని ఆలోచన. వేదాలను పొందాలంటే ఏం చెయ్యాలి? అని ఆలోచించాడు. బ్రహ్మ ద్వారా పొందటం తేలిక అని నిర్ణయించుకున్నాడు.

బ్రహ్మను గూర్చి హిమాలయాల్లో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు. గాలిని మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. అతని ఘోర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దుర్గముడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ‘‘దుర్గమా! ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు బ్రహ్మ, ‘‘వేదాలు, వేదమంత్రాలు నా ఆధీనంలో ఉండాలి’’ అన్నాడు దుర్గముడు. బ్రహ్మ ‘‘తథాస్తు’’ అన్నాడు. ఇక ఏముంది! వేదాలు, వేద మంత్రాలు అపాత్రుని ఆధీనంలోకి వచ్చాయి. భూమిపైన రుషులు స్నాన, సంధ్య, జపాదులు మరిచిపోయారు. యజ్ఞయాగాదులను మానేశారు. దేవతలకు హవిర్భాగాలు చెందక వాళ్ళు శక్తి హీనులయ్యారు. ఆదను చూసుకొని దుర్గముడు అమరావతిపై దండెత్తాడు. మంత్రశక్తి పొందిన దుర్గముడు దేవతలపైనా దండెత్తాడు. దేవతలు వాడి ధాటికి తట్టుకోలేక పారిపోయి కొండ గుహల్లో తలదాచుకున్నారు.జగజ్జననిని ప్రార్థిస్తూ జీవించారు.

అదిశక్తిని, ఆ శ్రీలత కల్పవల్లిని ఆదరించమని అనేక విధాల ప్రార్థించారు, ప్రాధేయపడ్డారు. జగదంబ కరుణించి వారి ముందు ప్రత్యక్షమయ్యింది.

చైత్రమాసం, నవమి, భృగువాసరాన దేవతల ఎదుట ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. దానికి నాలుగు వైపులా నాలుగు వేదాలూ స్తుతించాయి. కోటి సూర్య ప్రకాశంగా ఉండి, కోటి చంద్ర ప్రకాశంగా చల్లదనం విరజిమ్ముతోంది. కోటి మెరుపులు ఒక్కసారి మెరిసినట్టుగా అరుణకాంతులను వెదజల్లుతోంది. పైన గానీ ప్రక్కన గానీ మధ్య లో గానీ పల్చబారలేదు. ఆద్యంతాలు లేవు. కరచరణాద్యవయవాలు లేవు. స్ర్తీ రూపం కాదు. పురుషరూపం కాదు. ఉభయమూ కాదు. ఆ దీప్తికి దేవతల కన్నులు మసకబడ్డాయి. కళ్ళు నులుముకుని, ధైర్యం తెచ్చుకుని తేరిపార చూశారు.

అప్పటికి ఆ దివ్య తేజస్సు స్ర్తీ మూర్తిగా రూపు ధరించింది. రాశీభూత సౌందర్యం. తామర మొగ్గలను పరిహసిస్తున్న పీనకుచ ద్వంద్వం. చిరుమువ్వల సవ్వడి చేస్తున్న మొలనులు (మేఖల), మంజీరాలు, బంగారు కేయూరాలు, అంగదాలు, కంఠాభరణాలు, రత్నరాశులు పొదిగిన కంఠపట్టిక. చిన్న మొగలిరేకును ముడుచుకున్న కొప్పు. విశా లమైన కటిప్రదేశం. పొట్టమీద సన్నని నూగారు. కర్పూర తాంబూలంతో ఎరుపెక్కి, సువాస నలు విరజిమ్ముతున్న నోరు.

మెరిసిపోతున్న బంగారు లోలాకులతో తళకులీనుతున్న నున్నని చెక్కిళ్ళు. అష్టమినాటి చంద్రరేఖలాంటి నుదురు. దట్టమైన కనుబొమ్మలు. ఎర్ర కలువల్లాంట నేత్రాలు. కొనదేరిన ఎత్తయిన ముక్కు, మధురాధరం. మల్లె మొగ్గల్లాంటి పలువరుస, మెడలో ముత్యాల దండలు. రత్నకిరీటం, చెవికి అలంకరించుకున్న ఇంద్రరేఖ. జడలో మల్లికామాలతీ పుష్పాల దండ. నుదుట మూడవ కన్నులా ఎర్రని కుంకుమ బొట్టు. పాశాంకుశ వరదాభయహ స్తాలు. ఎర్రని చీరకట్టుకుని దానిమ్మపువ్వు రంగులో ధగధగలాడుతున్న జగన్మాత... సర్వ శృంగారవేషాఢ్య, సర్వదేవనమస్క్టృత, సర్వాశాపూరిక సర్వమత సర్వమోహినీ ప్రసన్నురాలై చిరునవ్వులు చిందిస్తోంది.

దేవతాకృత దేవీస్తుతి...
జగన్మాత రూపం దర్శించిన దేవతలందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ సాష్టాంగపడ్డారు. ఆనందబాష్పాలు అడ్డుపడి చూడలేకపోతు న్నారు. కొంతసేపటికి తేరుకుని మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని జగదంబికను స్తుతించారు.

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్‌
తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషూ జుష్టాం
ఓం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే! ఓం సుతరసి తరసే నమః
దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి
సానో మంత్రేషమూర్జం దుహానాం ధేనుర్వాగస్మానుపసుష్టూతైతు
కాళరాత్రీ! బ్రహ్మసుతా! వైష్ణవీ! స్కందజననీ! సరస్వతీ! అదితీ! దక్షదుహితా! పావనా! శివా! నమోనమః, మహాలక్ష్మీ! సర్వశక్తి! నిన్ను తెలు సుకుంటున్నాం, మమ్మల్ని నడిపించు. విరాట్‌స్వరూపిణీ! సూత్రాత్మమూర్తి! అవ్యాకృతరూపిణీ! శ్రీబ్రహ్మమూర్తి! నమోనమః
మహాలక్షై్మచ విద్మహే సర్వశక్యై చ ధీమహి
తన్నో దేవీ ప్రచోదయాత్‌

దేవీ! నిన్ను తెలుసుకుంటే ఈ జగత్తు, ఈ సంసారం అదృశ్యమైపోతుంది. తెలుసుకోక పోతే రజ్జు సర్పభ్రాంతిలాగా ఏడిపిస్తూ ఉంటుంది. చిదేకస్వరూపిణీ! అఖండానంద రూపా! వేదతాత్పర్యభూమికా! పంచకోశా తిక్తా! అవస్తాత్రయసాక్షిణీ! త్వంపదలక్ష్యార్థా! ప్రత్యగాత్మ స్వరూపిణీ! ప్రణవరూపా!హ్రీంకారమూర్తీ! నానామంత్రాత్మికా! కృపాసింధూ! నమోనమః.దేవతలు గద్గద స్వరాలతో చేసిన స్తుతులకు మహాదేవి సంతృప్తి చెందింది. మత్తకోకిల కంఠాన్ని సవరించి... ‘‘నేను భక్తులపాలిటి కల్పవృక్షాన్ని కదా! అడగండి ఏమి కావాలో నేనుండగా మీకు, నా భక్తులకు, దిగులు ఏమిటి? దుఃఖ సంసార సాగరం నుంచి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. దేవతలారా! తెలుసుకోండి, ఏమి కావాలో అడగండి’’ అని పలికింది.
వేదాలు తిరిగి మాకు వచ్చేలా అనుగ్రహించమన్నారు.వారందరికీి తన చేతుల్లో వున్న ఆహార పదార్థాలు శాకములు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అనాటి నుండి ‘శతాక్షి’, ‘శాకంబరి’ పేర్లతో విరాజిల్లుతోంది. వేగుల ద్వారా దుర్గముడికి ఈ సమాచారం మొత్తం తెలిసింది. అప్పుడు అతడు సేనా సమేతుడై హిమాలయాలు చేరుకున్నాడు. అక్కడ వున్న రుషులు, దేవతలను బాధించసాగాడు. వారిపై శస్త్రాస్త్రాలను వేసి బాధించాడు. వారు ‘‘మాతా! జననీ! రక్షించు!రక్షించు’’ అని అంటూ ‘శతాక్షి’ని వేడుకున్నారు.

దుర్గముడు దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. జగజ్జనని ‘భయపడకండని’ వారికి అభయమిచ్చింది. ఒక చక్రమును పైన ప్రయోగించి, అందరికీ గొడుగు అయ్యేలా చేసింది. అప్పుడు దుర్గముడు విడిచిన ఏ బాణమూ వారిమీద పడలేదు, వారిని బాధించలేదు. దుర్గముడికి, దేవికి భీకర సంగ్రామం జరిగింది.సూర్యమండలం బాణాల పంజరంలో మూసినట్లయింది. బాణాల రాపిడివల్ల అగ్ని పుట్టింది. ఆ ప్రాంతం విద్యుల్లతలా మిణుగురు పురుగులు తిరుగుతున్నట్లుగా అయ్యింది. అలా పది రోజులు ఆ సంగ్రామం కొనసాగింది. అందరూ చనిపోయినా దుర్గముడు ఒక్కడే మిగిలాడు. పదకొండవ రోజున దుర్గముడు శతాక్షీిదేవి రథానికి ముందు నిలిచి అస్త్రాలను ప్రయోగించటం మొదలు పెట్టాడు. రెండు జాముల యుద్ధం భయంకరంగా సాగింది.

శతాక్షి తీవ్రమైన పదిహేను అస్త్రాలను తీసింది. రెండు బాణాలతో దుర్గముడి కళ్ళను, నాలుగు శరాలతో గుర్రాలను, ఒక కోలతో జెండాను, వెండితో దుర్గముడి భుజాలను, ఒక శరంతో సారథిని పడగొట్టింది.నిప్పులు కురుస్తున్నట్లు వున్న వాడియైన చూపులతో ఐదు బాణాలను దుర్గమునిపై వేసింది.ఆ ధాటికి తట్టుకోలేక దుర్గముడు తూలి, కూలి రక్తం కక్కుతూ శతాక్షి ముందు పడిపోయాడు. ఆ రాక్షసుని ముందు నిలుచున్న శతాక్షీ దేవి శరీరంలోకి ఆ రాక్షసుని శరీరం నుండి పుట్టిన తేజస్సు కలిసిపోయింది.ఆ రాక్షసుని తేజస్సు అమ్మలో లీనమయ్యింది. పగ, ద్వేషంతో... ఆ పరమేశ్వరి, జగన్మాతను ఎదిరించిన దుర్గముడు ముక్తి పొందాడు.
--------------------------------------

‘‘జగన్మాతా! ముల్లోకాల్లో నీకు తెలియని దంటూ ఏమైనా ఉన్నదా? నువ్వు సర్వజ్ఞవు, సర్వసాక్షివి. తారకాసురుడు మమ్మల్ని రేయిం బవళ్ళు హింసిస్తున్నాడు. శివుడికి వారసుడుగా పుట్టిన పుత్రుడొక్కడే తారకుడిని చంప గలడని బ్రహ్మ దేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఆ శివుడికి అసలు ఇల్లాలే లేదు. నీకు తెలుసుగదా! ఇంతకన్నా మేము చెప్పగలిగింది ఏమీ లేదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించి మా కు దారి చూపించు. నీ పాదపద్మాలను నిరంతరం ధ్యానించే భక్తులం మేము. ప్రాణ రక్షణ కోసం నిన్ను ప్రార్ధిస్తున్నాం. ఇంతకన్నా మాకు కోరదగినది ఇంకొకటి లేదు’’ అని వేడుకున్నారు.

పార్వతిగా అవతరణ...
‘‘దేవతలారా! భయపడకండి. నా శక్తి త్వరలోనే గౌరిగా హిమ వంతుడి ఇంట జన్మించబోతోంది. ఆ గౌరిని శివుడికి ఇచ్చి వివాహం జరిపిం చండి. హిమగిరీంద్రుడు ఎప్పుడూ మనస్సులో నన్నే ధ్యానిస్తుంటాడు. మీలాగానే నా భక్తుడు. అతడి ఇంట్లో కూతు రుగా జన్మించడం నాకు చాలా ఆనందదా యకం’’ అని పలికింది. జగదీశ్వరి మాటలను హిమవంతుడు విన్నా డు. అనుగ్రహానికి మురిసిపోయాడు. కళ్ళల్లో ఆనందబాష్పాలు. గొంతు జీరవోయింది. ‘‘హే సచ్చిత్‌ స్వరూపిణి! ధన్యోస్మి. అనుగ్రహ విశే షం ఎంతటి మహత్తునైనా కలిగిస్తుంది.

లేక పోతే స్థాణువునూ, జడము నూ అయిన నేనే మిటి, నీకు తండ్రిని కావడ మేమిటి! మరో నూరు జన్మలు ఎత్తితే మాత్రం ఈ భాగ్యం నా కు లభిస్తుందా? నూరు అశ్వ మేధాలు చేసి నా, వేల సంవత్సరాలు తపస్సు చేసినా, ఇంత టి మహావైభవం నాకు దక్కేనా? ఆహా! జగన్మా త నాకు కన్నకూతురు అయ్యిం దంటే ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో నా కీర్తికి తిరు గులేదు.అహో!హిమాలయుడా! ఎంతటి ధన్యుడవు అంటూ అందరూ ప్రశంసలు కురి పిస్తారు. ఏ తల్లి చల్లని కడుపులో బ్రహ్మాండ కోటలున్నాయో ఆ తల్లి నీకు చిట్టి తల్లిగా జన్మి ంచిందని కీర్తిస్తారు. నా తల్లిదండ్రులెవరో ఈ పర్వతరూపంగా నన్ను ఎందుకు నిర్మించారో తెలియదుగానీ ఇటువంటి దేవతలూ మహా తపస్వులూ నివసించడానికి నేను కారణమవు తున్నాను. ఇది చాలు ఈ జన్మకు అని మురిసి పోతున్న నాకు ఎంతటి గొప్పవరం ఇచ్చావు తల్లీ! ధన్యుణ్ణి, ధన్యుణ్ణి, ఇది నా అర్హత కాదు. కేవలం నీ కృప’’ అని మురిసిపోయాడు.

vEndaanta sangrahamunundi::
raasinavaaru::Suneel Kumar KotaVedanta