Showing posts with label దేవతల స్థల పురాణం. Show all posts
Showing posts with label దేవతల స్థల పురాణం. Show all posts

Saturday, December 14, 2013

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం




శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం మోపిదేవి
దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. 
కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. 
స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణానదీ మహాత్మ్యము, 
ప్రముఖ క్షేత్రమైన మోపిదేవి క్షేత్ర విశేషాలు 



అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది. 
వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలో కి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించసా గింది. 
ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపో యాయి. 
ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమ హర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు 
అగస్త్యమ హర్షికి, విషయాన్ని వివరించారు. యోగదృష్టితో సర్వము నెరింగిన మహర్షి 
తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంత మైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా 
లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు. 
లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. 
దారిలో నున్న వింధ్య పర్వ తం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరిం చింది. 
తాను మరలి వచ్చేవరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.

పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. 
కనకదుర్గామాతను, శ్రీకాకుళాంద్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.

‘వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్‌ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్‌’ 

అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. 
లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. 
ఒకపుట్ట నుండి దివ్యతేజస్సుని గమనించి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని, ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. 
కుమారమూర్తికే సుబ్రమణ్యమనెడి పేరని మాండమ్యడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు.
కుమారస్వామి ఉరగ (పాము) రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరిం చారు అగస్య్త మహర్షి. 
సనక, సనకస, సనత్కుమా ర సన త్సు జాతులనెడి దేవ ర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారు గానే ఉంటారు, పైగా దిగంబరులు. 
వారు ఎల్లప్పుడూ భగ వదారాధనలోనే కాలం గడుపుతుంటారు. 



వారు ఒక పర్యా యం పరమేశ్వర దర్శ నానికి కైలాసం చేరుకున్నారు. 
ఆ సమయంలో పరమేశ్వ రుడు కైలాసంలో లేడు. 
లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. 
అదేసమ యంలో శచీ, స్వాహా మొదలైన దేవతాస్ర్తీలు, లక్ష్మీ సరస్వ తులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. 
ఇటు జడధారు లు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుంద రీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపో యాడు. 
‘‘కుమారా! ఏల నవ్వుచున్నావు? వారు నేనులా కన్పించలేదా? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా?’’ 
అని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చా త్తాప పడినాడు. 
తల్లి పాదాలపైబడి క్షమాపణ కోరుకున్నాడు. 
తల్లి కాదన్న వినకుండా పాపపరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. 
ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపంతో తపస్సు ప్రారంభించాడు.  

ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు 
మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. 
పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు.
 
‘అత్ర స్నానంతు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్‌’ 

అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్రతో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి.
కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. 
ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. 
వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఇతను మహాభక్తుడు. 
అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. 
పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. 

తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. 
మట్టి తో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, 
వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు.
అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమైపోగా 
మిగిలిన నంది, గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, 
భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, 
కాలక్రమే ణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.

క్షేత్ర విశిష్టత...
స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. 
ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. 
పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. 
అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగుతుంది. 
ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, 
ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. 
ఇక్కడ స్వామి వారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవగా భక్తులు భావిస్తారు. 
సంతానం లేనివారికి సంతానం కలిగించడం, చూపు మంద గించినవారికి దృష్టిని ప్రసాదించడం, 
శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, 
విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు. 
స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర్రమొక్కుబడి, 
ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. 
నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించు కుంటారు. 
పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.

విశేష పూజలు...
నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాల తోపా టు ఆదివారం, 
గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు. 
స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుదభ్రిషేకంతో పాటు ప్ర త్యేకఅర్చనలు జరుగుతాయి.

ఇలా వెళ్ళాలి...
కృష్ణాజిల్లాలో విజయవాడకు 70 కిలోమీటర్ల దూరం లోనూ, మచిలీపట్టణానికి 35 కి.మీ.ల దూరం లోనూ, 
గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కి.మీ.ల దూరం లోనూ మోపి దేవి క్షేత్రం ఉంది. అతి సమీపంలోని రైల్వేష్టేషన్‌ రేపల్లె.

Sunday, December 8, 2013

దత్త నవరాత్రులు

























దత్తప్రభువుల జన్మవృత్తాంతం :
------------------------------------
ఆధిభౌతికం,ఆధిదైవికం,ఆధ్యా త్మికం అనే తాపాలను తొలగించుకున్న అత్రి మహర్షుల వారికి,కామక్రోధాది దుర్గుణాలన్నింటికీ మూలమైన అసూయను జయించిన అనసూయ మాతకు, కృతయుగంలో ఇప్పుటి నేపాల్‌ ప్రాంతంలోని చిత్రకూట పర్వతం వద్దనున్న అనసూయా పహాడ్ అనేచోట ఒకానొక వైశాఖ బహుళ దశమీ గురువారంనాడు రేవతీ నక్షత్రయుక్త మీన లగ్నంలో మీనాంశయందు 'బ్రహ్మ అంశమున చంద్రుడు,విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసులుగా' దత్తాత్రేయులవారు జన్మించారు. తర్వాత చంద్రుడు,దుర్వాసుడు తమ తమ అంశములను దత్తునిలో నిక్షిప్తం చేసి తపస్సు చేయడానికి వెళ్లిపోయారు.

(బ్రహ్మ నా తండ్రి, మాయ(ప్రకృతి) నా తల్లి వారి ఐక్యం వల్లనే నాకీ దేహం వచ్చింది. నేనే దైవం,శిరిడీలోనూ సర్వత్రా నేనే వున్నాను, సర్వ జగత్తూ నాలోనే వుంది.నీవు చూస్తున్నదంతా కలిపి నేను..నేను శిరిడీలో మాత్రమే ఉన్నాననుకొనేవాడు నన్నసలు చూడనట్లే - అన్న సాయి వాక్కుని సదా స్మరించినట్లయితే ఆయనెవరో క్రమంగా అర్ధం అవుతుంది.)


బాల్య లీలలు :
--------------
ఈ బాలుడు సామాన్యుడు కాదని అఙ్ఞానులను ఙ్ఞానమార్గాన నడిపి కైవల్యము చేర్చే మార్గదర్శకుడని ఙ్ఞానులు ఆయన్ను ప్రసంశించేవారు. దత్తులవారు మాత్రం గురుశుశ్రూష చేయక బాలునిగా, ఉన్మత్తునిగా, పిశాచపీడితునిలా విహరిస్తుండేవారు, అది చూచి సంశయించేవారు ఆయన కృపకి దూరమయ్యేవారు. ఒకసారి ఆశ్రమవాసులు, వయోవృద్ధులు దత్తస్వామిని చేరి గురువై తమను అనుగ్రహించవలసిందని ఆయన్ను కోరారు. దత్తులవారు వారితో ఏమీ మాట్లాడకుండా ఏకాంత నిష్టలో ఉండటానికి బయలుదేరారు, ఆశ్రమవాసులు ఆయన్ను వెంబడించారు. అది గమనించిన దత్తప్రభువు దగ్గరలో వున్న సరోవరంలో దిగి అదృశ్యులయ్యారు.

ఆయన్ను వెంబడిస్తూ వచ్చినవారు ఆయన దర్శనంకోసం అక్కడే వేచివున్నారు. ఇలా 100 సంవత్సరాలు గడిచేవరకు వారి సహనాన్ని, వారి దృఢ సంకల్పాన్ని పరిక్షించిన పిదప దత్తస్వామి వారి నమ్మకాన్ని పరిక్షించదలచి, ఒక స్త్రీని ఎడమతొడపై కూర్చోబెట్టుకుని సరోవరంలోంచి బయటకు వచ్చారు. దత్తులవారు ఈ విధంగా దర్శనమిచ్చినప్పటికీ ఆశ్రమవాసులు దృఢచిత్తులై అక్కడనుండి కదలలేదు. అప్పుడు దత్తులవారు మద్యాన్ని సేవిస్తూ. వెంటతెచ్చిన స్త్రీతో సరసాలాడటం మొదలుపెట్టారు. ఈ ఘటన కొందరిలో చిత్తచాంచల్యాన్ని కలిగించింది, ఇలా చిత్తం చెదిరినవారు - ఇటువంటి దురాచారుడు, స్త్రీలోలుడు ఆశ్రితులనెలా ఉద్ధరిస్తాడు? అంటూ ఆయన్ని విడిచివెళ్లారు(ఇటువంటివారినే శ్రీసాయి బాబా రాలిపోయే పూతతో పోల్చారు). అక్కడే మిగిలిన అతి కొద్దిమంది మాత్రం అక్కడ జరుగుతున్న చర్యల్ని పట్టించుకోకుండా చిత్తాన్ని కేవలం దత్తప్రభువుపైనే నిలిపివుంచి ఆయన్ని ఇలా స్తుతించారు - ఓ మహానుభావా నీవు యోగీశ్వరుడివి, పూర్ణ పరబ్రహ్మ స్వరూపూడివి, నిర్గుణుడవైనప్పటికీ భక్తులనుద్ధరించడానికి ఇలా సగుణరూపంలో సంచరిస్తున్నావు. ఇకనైనా ఈ దీనులని పరిక్షించటంమాని, నీ ఆశ్రయం కోరివచ్చిన మమ్ము ఉద్ధరించు ప్రభూ అంటూ స్తుతించగా, వారి ప్రార్ధనను మన్నించిన దత్తప్రభువు ఆ మునులకు తన నిజరూపాన్ని చూపి అనుగ్రహించారు.

ఈ విధంగా ఆశ్రమవాసుల్ని అనుగ్రహించిన తర్వాత దత్తప్రభువు తన తల్లిదండ్రుల చెంతకు వచ్చి, భక్తులను అనుగ్రహించడానికి, ప్రజలను సన్మార్గవర్తనులను చేయడానికి నేను సహ్యాద్రికి వెళ్లాలి నన్ను ఆశీర్వదించమనగా, సర్వఙ్ఞురాలైన ఆ మాత కూడా పుత్రవ్యామోహముతో అంగీకరించక - నా వద్దనే ఉండు,నన్ను విడిచి వెళ్లకని బ్రతిమాలింది. దత్తుల వారు పట్టు విడవకపోవడంతో - నా వల్ల కలిగిన దేహాన్ని నాకు ఇచ్చి నీ ఇచ్ఛ ప్రకారం నడుచుకోమని నిష్టూరమాడింది. దత్తాత్రేయుల వారు నవ్వుతూ తన చర్మాన్ని గోళ్లతో చీల్చి తన దేహాన్ని తల్లికి ప్రసాదించారు. ఆ దృశ్యాన్ని చూచిన అనసూయమాతకు దేహం నాశనమయినప్పటికీ, ఆత్మ శాశ్వతమనే సత్యం స్ఫురించినదై - కుమారా తల్లికి సహజమైన మాతృవ్యామోహంతో నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను, అఙ్ఞానంతో అలమటించే మానవాళికి ఙ్ఞానాన్ని ప్రసాదించే మోక్షమార్గాన్ని అనుగ్రహించు అన్నది.

**వ్యామోహం సత్యాన్ని మరుగుపరుస్తుందనే విషయం తెలియజేయడానికే ఈ లీల జరిగిందని మనం గ్రహించాలి.

దత్తప్రభువు దినచర్య :
---------------------
దిగంబరుడూ,శరీమంతా భస్మం పులుముకొన్నవాడు,ఆత్మ ఙ్ఞానం కలిగించ గలవాడు, సర్వమతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారంలోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడూ, సదా బ్రహ్మనిష్టకలవాడూ,ప్రసన్నుడు,నిర్మానసుడు ఐన దత్త ప్రభువుల వారు -

ప్రతిరోజూ కాశీలో గంగాస్నానము, మాహురపురములో ధ్యానము, కొల్హాపురిలో (కరవీరపురం) భిక్ష, నిర్మలమైన,స్వచ్ఛమైన తుంగభద్రా నీటితో దాహం తీర్చుకుని, సహ్యాద్రి పర్వతములో నిద్ర చేస్తారు. సహ్యాద్రి కల్పవృక్షము కింద మణిపీఠం ఉంది, దానిపై దత్త ప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారం, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి మధుమతీదేవి, వెనుక కామధేనువు, నలుదిక్కులా నాల్గువేదాలూ నాలుగు కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా - ఆయన ముందు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులూ, నవనాధుల ఆదిగాగల మహ్మాతులు ఆయన్ను స్తుతిస్తూ వుంటారు.కేవలం భిక్షాన్నం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు,నవనిధులు దాస్యం చేస్తూ ఉంటాయి. ఎడమ చేతిలో త్రిశూలం, శంఖం, కమండలం ధరించి కుడి చేతిలో ఢమరుకం, చక్రం, జపమాల ధరించి ఉండగా గంధర్వుల గానం చేస్తూంటే. అప్సరసలు నృత్యం చేస్తూండగా దత్తప్రభువులు ప్రతిదినమూ దర్బార్ నిర్వహిస్తూవుంటారు. అట్టి ప్రభువు తనను దర్శించి, స్మరించినంత మాత్రానే ఇహ, పర సౌఖ్యాలు కలుగజేస్తుంటాడు.

**శ్రీ దత్తుల వారికి అవధూత అనే బిరుదువున్నది - అవదూతోపనిషత్తు ప్రకారం ఆ పదానికి అర్ధం.

శ్లో ఈఈ అక్షరద్వాద్వరేణ్యత్వాద్ధూత సంసార బంధనాత్
తత్వమస్యాది లక్ష్యత్వదవదూత ఇతీర్యతే ఈఈ

తా ఈఈ నాశరాహిత్యమూ,శ్రేష్టత్వమూ. విదిలించి వేయబడిన సంసారబంధము తత్త్వమసి అనే మహావాక్యానికి లక్షమవ్వడం వలన,అట్టి వారిని అవధూత అని చెబుతారు.


కార్త వీరార్జుని వృత్తాంతం :
-------------------------
త్రేతాయుగంలో ’హైహయ’ వంశానికి చెందిన కృతవీరుడనే చక్రవర్తి ’మహిష్మతి’ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవాడు. అతని భార్య శీలధారా దేవి. వీరికి ఎంతో మంది సంతానం కలిగినప్పటికీ, చ్యవన మహర్షి శాపం వల్ల ఒక్కరూ బ్రతకడంలేదు. సంతానం నిలబడటానికి ఎన్నో యాగాలు, పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో శీలధారా దేవి ఎంతో మనో వేదనకు గురైంది. ఒకరోజు వారికి యఙ్ఞవల్క్య మహర్షుల వారిని దర్శించే భాగ్యం కలిగింది. మహర్షుల వారి సతీమణి మైత్రేయి మాత వారి వ్యధ విని వారికి అనంత వ్రతం చేయమని చెప్పి, వ్రత విధానం తెలియజేసింది. ఆ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నప్పుడు, దేవగురువు బృహస్పతి వారి ఇంటికి విచ్చేసి వారిని సూర్యభగవానుణ్ని కూడా ఆరాధించమని చెప్పి ఆలా చేస్తే పాపాలు నశించి పుత్ర సంతానం కలుగుతుందని తెలియజేస్తాడు. వారు చెప్పినట్లే ఆచరించిన కొన్ని రోజుల తర్వాత శీలధారా దేవి గర్భం ధరించి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఐతే ఆ బాలుడు చూడ ముచ్చటగా వున్నప్పటికీ, అతని చేతులు వంకర తిరిగి సన్నగా బలహీనంగా వుండి వేలాడుతున్నాయి. అంగ వైకల్యం గల పిల్లవాడు పుట్టేసరికి వారు ఎంతో దుఃఖించారు. అయినప్పటికీ ఆ బాలుణ్ని వారు ఎంతో ముద్దుగా పెంచసాగారు. ఆ బాలుడికి అర్జునడనే పేరు పెట్టారు. కృతవీర్యుని కొడుకు కావడం వల్ల కార్తవీరార్జునుడయ్యాడు. కొంతకాలానికి కృతవీర్యుడు మరణించాడు. రాజ్యభారం వహించడానికి కార్తవీరునికి అంగవైకల్యం దృష్ట్యా అర్హత లేకపోవడం వల్ల మంత్రులకు రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సు ద్వారా శక్తులను పొంది రాజ్యానికి తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. గర్గ మహాముని కార్తవీరునికి శ్రీ దత్తాత్రేయుల వారే ఈ వైకల్యాన్ని నివారించగలరని చెప్పి వారిని దర్శించుకోడానికి సహ్యాద్రికి వెళ్లమని రాజుకి చెప్తాడు. దత్తాత్రేయుల వారిని దర్శించినప్పుడు వారు తమ భక్తుల భక్తి శ్రద్ధలను కఠినంగా పరిక్షించి, ఆ తర్వాతే అనుగ్రహిస్తారని చెప్పి దేవేంద్రుడు దత్తుల వారి అనుగ్రహం వల్ల జంభాసురుని ఏ విధంగా వధించాడో తెలియజేస్తారు.

జంభాసురుడు దేవతలని జయించినప్పుడు ఇంద్రుడు దేవ గురువు బృహస్పతిని మార్గం తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు బృహస్పతి సహ్యాద్రి పై కొలువై ఉన్న దత్త ప్రభువులే ఈ సమస్యని పరిష్కరించగలరని చెప్పి, ఆయన అనుగ్రహం పొందడంలో ఎదురయ్యే ఆటంకాలు జయించిన వారికే ఆయన తన నిజరూప దర్శనమిస్తాడని, దానికి ఎంతో భక్తి, శ్రద్ధలు అవసరమని చెప్తాడు. ఇంద్రుడు సహ్యాద్రికి చేరుకుని దత్తుల వారి దర్శనం కోసం వెళ్లినప్పుడు ఆయన మగువతో కలిసి మద్యాన్ని పానం చేస్తూ కనిపించారు. ఇలా ఎన్ని పరీక్షలు ఎదురయినా దేవేంద్రుడు ఆయన్ని విడువక సేవిస్తూనే వున్నాడు. కొన్ని రోజులకి ఇంద్రుని భక్తికి ప్రసన్నుడైన దత్త ప్రభువు తన నిజ రూపంలో దర్శనమిచ్చి జంభాసురుని సహ్యాద్రికి వచ్చేలా చెయ్యమని చెప్తాడు. ఇంద్రుడు జంభాసురుని కవ్వించి అతన్ని సహ్యాద్రికి వచ్చేలా చేస్తాడు. జంభాసురుడు తన సైన్యంతో సహా సహ్యాద్రికి రాగానే వాళ్లకి మహాసౌందర్యవతియైన అనఘా దేవి కనిపిస్తుంది. ఆమె సౌందర్యానికి మోహితులై యుద్ధాన్ని చేయడం మాని ఆమెను పల్లకీలో కూర్చోబెట్టారు. ఆమెను ముందుగా ఎవరు పొందాలని వారిలో వారు కలహించుకుంటున్నప్పుడు దత్తప్రభువు ఇంద్రున్ని పిలిచి రాక్షసులను ఓడించడానికి ఇదే సరైన సమయం అని తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వారిని సునాయాసంగా ఓడిస్తాడు. అలా ఇంద్రుడు దత్త ప్రభువుల కృపకు పాత్రుడై తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అని పై వృత్తాంతాన్ని గర్గముని, కార్తవీరునికి తెలియజేస్తారు.

కార్తవీరార్జునుడు సహ్యాద్రి చేరి దత్తప్రభువుని దర్శించి, భక్తి శ్రద్ధలతో వారిని సేవించిన తర్వాత కొంతకాలానికి ఆయన ప్రసన్నులై అతని వైకల్యాన్ని నివారించారు. అంతేగాక అతనికి వేయి బాహువులను, ఇతరుల మనసులను గ్రహించే శక్తిని అనుగ్రహించి, తనంత వాడి చేతిలో మరణం పొందే వరాన్ని ఇచ్చారు. దత్త ప్రభువు అనుగ్రహ బలం చేత కార్తవీరార్జునుడు రావణాసురుడ్ని యుద్ధంలో ఓడించాడు. అలా చాలా కాలం రాజ్య పాలన చేసిన తర్వాత రాజ్యభోగాల పట్ల విసుగు చెంది సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక తీవ్రంగా కలిగి దత్త ప్రభువుని ఆశ్రయించాడు. లౌకిక శాస్త్రాలు విషయాల పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి, తత్త్వ శాస్త్రానికి పండితులు తెలియజేసే అర్ధాలు పరస్పర విరుద్ధంగా వుండి సాధకులను గందరగోళానికి గురిచేస్తున్నాయి అని దత్త ప్రభువుతో చెప్పగా. దత్త ప్రభువు "కార్త వీర్యా ! కొన్ని అర్ధాల్లో బాహ్యంగా బేధాలు కనిపించినా, అవి ఒకే తత్త్వాన్ని భిన్నమైన కోణాల్లోంచి ప్రతిపాదించిన సూత్ర పరిశీలనలు మాత్రమే. ఉత్తమమైనది తత్త్వ శాస్త్రమే. అలా అని ఇతర శాస్త్రాలు లౌకికములు అని వాటిని నిరసించరాదు. శాస్త్రాలన్నీ మంచి మార్గానికి దారి చూపేవే. వాటి ద్వారా కూడా ముక్తి సాధించవచ్చు." అని చెప్పారు. ఆ తర్వాత అతనికి నిర్వికల్ప సమాధి స్థితి కలుగజేసి, ఆత్మ తత్త్వం విచారణ చేసే పద్ధతులను తెలియజేసి అతన్ని ఆశీర్వదించారు. చివరికి కార్త వీరార్జునుడు తాను పొందిన వరం వల్ల పరశురామ అవతారంగా వచ్చిన భగవంతుని చేతిలో మరణాన్ని పొందాడు.


ఙ్ఞానబోధ :
----------

**దత్తాత్రేయుల వారు అలర్కునికి, ప్రహ్లాదునికి, పరశురామునికి ఙ్ఞానబోధ చేసారు.

షోడశ అవతారాలు :
-------------------
1.యోగిరాజు 2.అత్రివరదుడు 3.శ్రీ దత్తాత్రేయుడు 4.కాలాగ్ని శమనుడు 5.యోగిజన వల్లభుడు 6.శ్రీ లీలా విశ్వంభరుడు 7.సిద్ధరాజు 8.ఙ్ఞాన సాగరుడు 9.విశ్వంభరావధూత 10.శ్రీ అవధూత 11.మాయాముక్తావధూత 12.ఆది గురువు 13.శివరూపుడు 14.శ్రీ దేవదేవ 15.దిగంబరుడు 16.శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు.

**శ్రీ దత్తాత్రేయ సంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి పదహారు అవతారాలని చెప్పబడింది.ఆయన పరతత్త్వంతో నిత్యం భూలోక నివాసం చేస్తాడు గనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన అవతారాలని కీర్తించారని మనం గమనించాలి.

ఈ దత్తప్రభువు మానవజాతి నిలిచివున్నంతవరకూ గురురూపంలో మానవాళిని ఉద్ధరించడమే తన కార్యంగా చేసుకుని, వివిధ గురుసంప్రదాయాల ద్వారా అన్నిమతాల్లో, ప్రతియుగంలో 1,25,000 మంది అవధూతలు, మహాత్ముల రూపంలో ఈ భూమిపై తన కార్యం నిర్వహిస్తూవుంటారు. అట్టి గురుపరంపరలో భాగంగా, కలియుగంలో ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి దగ్గరగా ఉన్న శ్రీ పీఠికాపురం (పిఠాపురం) అనే గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభులుగా దత్తప్రభువు తన ప్రపధమ అవతారాన్ని ప్రకటించారు.

శ్లో ఈఈ కృతే జనార్ధనో దేవః
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే రామకృష్ణాచ
కలౌ శ్రీపాద వల్లభః

తా ఈఈ కృత యుగములో జనార్ధనుడు,త్రేతా యుగములో రాముడు,ద్వాపర యుగములోకృష్ణుడు,కలి యుగములో శ్రీపాద శ్రీవల్లభుడు అవతార పురుషులని ఆది గురువు వేదవ్యాస మహర్షి తమ భవిష్యపురాణంలో తెలియజేసారు 

విజయ్ మహావాది నుంది సేకరణ 

Tuesday, March 5, 2013

ॐ రామసేతువు ॐ Rama Setu ॐ




1}

|| ॐ || RAMA SETHU'S CONSTRUCTION || ॐ || 

ॐ "NALA " of Ramayana is the Son of SRI VISHWAKARMA. He is the world's first "Hydraulic Engineer."During Tretayuga, they helped LORD RAMA to create a Way to Lanka.

ॐ They decided to construct a long SETHU(Bridge) on the Indian Ocean for Lord Sri Rama and his Warriors(VANARAS) to reach Lanka and to defeat RAVANA in the Battle.

ॐ They made a Bridge comprising the Length of 48 Kilometers, Width 2.5 to 3 Km and a depth of 22Feets (Inside the sea) by using the Cranes, Drilling Machines and other materials, with the help of experts(in Vanara sena). Use of machines is described in Valmiki Ramayana 6-22-59.

ॐ Let us see how that was designed and constructed by Our Ancient Engineers.

ॐ NASA released some photographs of Ram Setu in 2002. According to research, these images show a chained arrangement of rocks which was sub-merged in water on the stretch between Rameswaram in Tamil Nadu of India(Bharat) and Talaimannar on Sri Lanka.

ॐ A study of the Shuttel RADAR topographic machine data reveals that Ram setu is 48 Kms long with 7 openings allocated at equal intervals to drain out water.

ॐ The Bridge is slightly Curve/Arc shape, so it can withstand high currents of water.

ॐ It has been construced in shallow waters which cannot be a natural formation.

ॐ Another fact which proves it to be a man-made structure is its width, which is 2.5 kms to 3 kms and it increases gradually ad it advances towars Sri Lanka. This design is in accordance with the rules of Modern Architecture.

ॐ Trethayuga's age cycle is 12,96,000 years, then later Dwaparayuga of 8,64,000 years) and the Kaliyuga( 4,32,000 Years). 5113 years have elasped in kaliyug till now. Lord Sri Ram incarnated at the end of Tretayuga. And ruled for 11,000 years. If we calculate the time period, 11,000 years+ 864,000 years+ 432,000 years+ some more years ruled by Kusha(Son of Lord Rama), the count reaches nearly 9,00,000 years. And it reveals that We Hindus know such high Engineering Techniques at that time.

ॐ Mr.Rajeev Deekshit gave a presentation of photographs which prove that stones in Ram setu were attached by the Bolts which are made up of Non-Corrosive metal and also by lime stone and clay in some portions.

ॐ This shows that RAMA SETHU is not a Natural Formation. It was man-made structure and is the proof of Scientific Heritage of Ancient India (Bharat). And it is proof that Sri Ramayana is not a myth but a historical event and it is our Ancient History.

ॐ Say it with pride: We are Hindus.
ॐ Save RamSetu- Save India’s pride.
ॐ Jai Hind

|| ॐ || JAI SRI RAM - JAI JAI SRI RAM || ॐ ||

Eco vinayaka

|| ॐ || JAI SRI RAM - JAI JAI SRI RAM || ॐ ||

rachana::Eco vinayaka  


"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥



2}

|| ॐ || జై శ్రీ రామ || ॐ || 
|| ॐ || రామసేతువు-2 || ॐ || 


ॐ త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ రాముడిగా అవతరించారు కానీ ఎక్కడ మహిమలు చూపలేదు. ఒక మనిషి ఎలా ఆవేశపడతాడో, ఎలా భాధపడతాడో, కోపానికి, సంతోషానికి గురవుతాడో అచ్చం అలాగే రాముడు కూడా అనుభవించాడు. మనిషి ఎలా బ్రతకాలో, తాను తన దైవలీలలు చూపకుండా, మనిషిగా ధర్మాన్నీ ఆచరించి చుపించాడు. శ్రీ రామసేతువు నిర్మాణానికి సంబంధించి నలుడు, నీలుడికి రాముడికి మధ్య ఒక అద్భుతమైన సంవాదం రఘువంశంలో కనిపిస్తుంది. 

ॐ రావణాసురుడు చేత అపహరించబడిన సీతమ్మ లంకలో ఉందన్న విషయం హనుమంతుని ద్వారా తెలుసుకున్న శ్రీ రాముడు సముద్రం దాటి లంకకు ఎలా చేరాలా అని చింతిస్తున్నాడు. అప్పుడు వానరసేనలో ఉన్న నలుడు, నీలుడు రాముడి వద్దకు వచ్చారు. వీళ్ళిద్దరు ఈ ప్రపంచ చరిత్రలో తొలి Hydraulic Engineerలు.

ॐ వాళ్ళు రాముడిని సమీపించి "మీరేం భాధపడకండి. రాళ్ళ సహాయంతో సముద్రంలో మేము వంతెన నిర్మిస్తాము".

ॐ సముద్రంలో రాళ్ళు ఎలా నిలబడతాయి? అని రాముడు ప్రశ్నిస్తే, మీకు ఆందోళన ఎందుకు? అది మాకు సంబంధించిన విషయం. Hydraulics మాకు అర్దమవుతాయి కానీ మీకు కాదు. ఎందుకంటే మాకు Hydraulic Engineeringలో మంచి నైపుణ్యం ఉంది.

ॐ పడవల సహాయంతో సముద్రంలో రాళ్ళను పడేసి, ఒకదానిపై ఒకటి పేరుస్తాము. అవి పైవరకు వచ్చాక అప్పుడు సేతువు నిర్మాణం మొదలుపెడతామన్నారు నలుడు, నీలుడు. ఈ వంతెన నిర్మాణానికి ఎన్ని రోజుల పడుతుంది అని రాముడు అడుగగా, ఎన్ని రోజులైనా పట్టనివ్వండి, వంతెన పూర్తి చేస్తాం అన్నారు.

ॐ వారధి పూర్తిచేస్తారు, మనం లంకకు వెళ్తాం, వెళ్ళిన వాళ్ళం తిరిగివస్తామా? వంతెన మధ్యలోనే కూలిపోతే? అని రాముడు తన సందేహాలను వ్యక్తం చేశాడు. మీకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, ఈ వంతెన మీద వెళ్ళిన మన సేన ఖచ్చితంగా తిరిగివస్తుంది. కాని రావణాసురిడి సైన్యం వస్తే మాత్రం ఈ వంతెన కూలిపోతుంది. ఇదెలా జరుగుతుందంటే, మేము ముందే ప్లాన్ వేసి, కొలతలు తీసుకున్నాం. మన సేనలో అన్ని వానరాలే(కోతులు) ఉన్నాయి. కోతులు నడిచే సమయంలో భూమి మీద అతితక్కువ ఒత్తిడి(pressure) మాత్రమే పెడతాయి.

ॐ పరమాత్ముడు వాటి శరీరాన్ని ఏ విధంగా రూపొందించాడంటే, అవి తమ చేతులు, కాళ్ళను అతి తక్కువ సమయం నేలపై పెడతాయి, ఒక వేళ వాటి చేతులు, కాళ్ళను భూమి పై పెట్టిన వెంటనే అక్కడి నుండి దూకి వేరే ప్రదేశానికి వెళతాయి. అలా చాలాదూరం అవి దూకుతూ(jump) వెళ్ళగలవు. 1, 2 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం అవి అలాగే వెళ్ళగలవు. 

ॐ ఈ వంతెన డిజైన్ ఏ విధంగా చేసామంటే, దాని మీద వానరాలుదూకుతూ దాటగలవు, కానీ రావణ సైన్యం వచ్చిదంటే ఈ వంతెన కుప్పకూలిపోతుంది. ఎందుకంటే రావణసైన్యంలో అందరూ రాక్షసులే ఉన్నారు. వారి శరీరం చాలా పెద్దగా, బలంగా ఉంటుంది. వారూ నేలమీద తమ శరీరం ద్వారా అధిక భారం/ ఒత్తిడి(pressure) వేస్తారు. అందువల్ల ఈ సేతువు తెగిపోతుంది. వాళ్ళు మునిగిపోతారు. మనమే గెలుస్తాము. ఓడిపోయే అవకాశమే లేదు అన్నారు నలుడు, నీలుడు.

ॐ సేకరణ-
Ram Setu A Construction Engineering Wonder 
రాజీవ్ దీక్షిత్ ఉపన్యాసం(హిందీ)

ॐ రామసేతువు నిర్మాణం ఎలా చేశారు? 
To be continued...............
|| ॐ || జై శ్రీ రామ || ॐ || 



rachana::Eco vinayaka  


"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥

3}


















జై శ్రీ రామ
శ్రీ రామసేతువు-3

రామసేతువును ఎలా నిర్మిచారు? 
వాల్మీకి రామాయణం : (6-22-51 TO 6-22-71) 
సమర్ధచాపి సేతుం కర్తుంవై వరుణాలయే ||6-22-51
తస్మాతథైవ బంధంతు సేతుం వానర పుంగవః


నేను సేతువును నిర్మించడంలో సమర్ధుడను. వానరులలో బలవంతులు ముందుకు వస్తే ఇప్పుడె నిర్మిస్తాను అన్నాడు నలుడు. రాముడూ ఆజ్ఞతో కొన్ని వందల వానరాలు అన్ని వైపులా వ్యాపించి ఉన్న అడవులపైకి ఆనందంతో గంతులు వేస్తూ పరిగెత్తాయి. పర్వతాల వంటి శరీరం సౌష్టవం కలిగిన వానరసేనాధిపతులు పెద్ద పెద్ద రాళ్ళను, కొండలను, చెట్లను విరగ్గొట్టి సుంద్రం వద్దకు తీసుకువచ్చారు. అశ్వకర్ణ, ధావ, అర్జున, మామిడి, అశోక, బిల్వ, శతపర్ణ మొదలైన చెట్లను సందురంలో పడేస్తున్నారు. మంచివానరాలు కొన్ని చెట్లను వ్రేళ్ళతో సహా , కొన్నిటికి వ్రేళ్ళు లేకుండానూ భూమిని నుంచి పెల్లగించి, ద్వజస్థంభాలను ఎత్తుకొస్తున్నారా అన్నట్టుగా తీసుకువచ్చారు. ప్రక్కన ఉన్న ప్రదేశాల నుండి వేప, కొబ్బరి, దానిమ్మ మొదలైన చెట్లను కొన్ని వానరాలు తీసుకువస్తున్నాయి.

హస్తిమాత్రన్ మహాకాయః పాశానాంచ మహాబలః ||6-22-58
పర్వతాంశ్చ సముత్పట్యా యంత్రైః పరివహంతి చ 
ప్రక్షిప్యామాణైర్ అచలైః సహసా జలం ఉద్దతం ||6-22-59


కొండలవంటి శరీరంతో, ఏనుగులవలే ఉన్న కొండలను పెల్లగించి యంత్రాల(Machines/cranes) సహాయంతో తరలించి, ఒక్కసారిగా అన్ని వైపుల నుండి సముద్రంలో రాళ్ళను పడేయడంతో సముద్రంలో నీరు ఒక్కసారిగా పైకి లేచి క్రింద పడుతోందట.(యంత్రాలంటే క్రేన్లు మొదలైనవి. ఇవి ఆ కాలానికే ఉన్నాయి).

"సూత్రాణ్యయే ప్రగృణంతి హ్యాయతం శతయోజనం" అంటే ఈ సమయంలో కొందరు రామసేతువును సరైన ఆకారంలో ఉందా, కొలత సరిగ్గా ఉందా అని కొలవడానికి వందయోజనాల stringను సిద్ధం చేస్తున్నారట. నలుడు, తన బాధ్యతగా సముద్రం మధ్యలో సేతువును నిర్మాణాన్ని ఇతర వానరాల సహాయంతో ప్రారంభించాడు. కొందరు వంతెన కొలవడానికి పొడవైన కర్రలనూ, ఇంకొందరు నిర్మాణానికి సంబంధించిన ఇతరవస్తువులను(సున్నం మొదలైనవి) దగ్గరపెట్టుకున్నారు. రెల్లుగడ్డి, పెద్ద పెద్ద దుంగలను కొన్ని వందల వానరాలు తీసుకువచ్చి, రాముడి ఆజ్ఞతో సేతువు నిర్మాణాన్ని వేగవంతం చేశాయి. మంచి సువాసన కలిగిన చెట్లను ఉపయోగించి, కొన్ని రకాల చేట్ల వ్రేళ్ళు, సున్నమూ, ఊడలతో బండలను ఒకదానికి ఒకటి దగ్గరగా,గట్టిగా కడుతూ అటూ, ఇటు వేగంగా పరుగులుపెడుతున్నాయి.

ఈ విధంగా మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, 3వ రోజు 21 యోజనాలు, 4వ రోజు 22 యోజనాలు, 5వ రోజు 23 యోజనాలతో మహాసేతువును, ప్రపంచంలో మానవనిర్మిత వంతెనను నలుడు ఆధ్వర్యంలో వానరసేన పూర్తిచేసింది. 

ఆధునిక ఇంజనీరింగ్ నిపుణులే ఆశ్చర్యపడేంతగా రామసేతువు నిర్మాణంలో ఉన్న నైపుణ్యం, ప్రత్యేకత ఏమిటి? అది ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిలిచి ఉంది? 

To be continued............ 

జై శ్రీ రామ 

rachana::Eco vinayaka  


"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥

4}





















జై శ్రీ రామ

శ్రీ రామసేతువు - 4


నలుడి ఆధ్వర్యంలో క్రేనులు, డ్రిల్లింగ్ మెషీన్లు, నైపుణ్యం కలిగిన వానరుల సహాయంతో 48 కిలోమీటర్ల పోదవు, 2.5-3 కిలోమీటర్ల వెడల్పుతో, సముద్రగర్భంలో 22 అడుగుల లోతు వరకు ఉండేలా సేతువును నిర్మించారు. అసలే సముద్రం మీద నిర్మిస్తున్న వంతెన. Straight గా నిర్మిస్తే పెద్దపెద్ద సముద్రపు అలల తాకిడి వలన ఒత్తిడికి గురై నిర్మాణానికి ప్రమాదం సంభవిస్తుందని, వంతెన మధ్యలోనే తెగిపోయే ప్రమాదం ఉందని, Arc Shape వచ్చేలా వారధిని డిజైన్ చేశారు. సునామీ(ఉప్పెన) వంటి ఉత్పాతాలు సంభవించినా సేతువుకు ఎటువంటి నష్టం వాటిల్లకపోవడానికి కారణం సెతువు ' Arc'shape ఉండడమే. 

సముద్రం మీద కడుతున్న వారధి, సముద్రం యొక్క ప్రవహానికి అడ్డురాకూడదని, అక్కడున్న జలచరాలకు ఇబ్బంది కలగకూడదని, అలాగే సముద్ర ప్రవాహానికి అడ్డుగా ఒక గోడలాగా కడితే, వంతెన life ఎక్కువకాలం ఉండదని, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నిర్మాణం చేయరాదని భావించినా నలుడు, సముద్రపు నీరు వెళ్ళేందుకు వీలుగా 7 equal intervalsలో రామసేతువు క్రింది భాగంలో openings వచ్చేలా డిజైన్ చేశారు. ఇవి నీటిని బయటకు drain చేస్తాయి.
సేతువు వెడల్పు(width) మొదట 2.5 కిలోమీటర్లు ఉండగా, మెల్లమెల్లగా పెరుగుతూ శ్రీ లంక చేరేసరికి 3 కిలోమీటర్లు అవుతుంది. ఇది ఈరోజు ప్రపంచంలో ఆధునిక నిర్మాణరంగంలో(Modern Architecture) అమలుచేస్తున్న డిజైన్.

త్రేతాయుగం అంటే 12,96,000 సంవత్సరాల కాలం.ఈ యుగంలోనే శ్రీ రామచంద్రుడు ఈ భూమిపై అవతరించాడు. తరువాత ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఇప్పటికి కలియుగంలో 5113 సంవత్సరములు గడిచాయి. రామసేతువు నిర్మాణం త్రేతాయుగం చివరలో జరిగినది. అంటే దాదాపు 9,00,000 ఏళ్ళ క్రితం.

ఈ రోజు మనం చెప్పుకుంటున్న అత్యాధునిక పరిజ్ఞానం మన హిందువులకు కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఋజువేం కావాలి చెప్పండి. హిందువైనందుకు గర్వించండి. Say it with pride : We are Hindus. 

కొన్ని లక్షల సంవత్సరాలు నీటిలో ఉన్నా, చెడిపోని లోహం(Metal)తో చేసిన bolts వాడి బండలను జతపరిచారని, మధమధ్యలో సున్నం, బంకమట్టి మొదలైనవి వాడారని సేతువును పరీశీలించిన రాజీవ్ దీక్షిత్ మొదలైనవారు పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ప్రదర్శించారు. 

పైన చెప్పిన వాటితో పాటు ఈ సేతువు సముద్రపు లోతు తక్కువగా(3-30 అడుగులు) ఉన్న ప్రదేశంలో ఉంది. అందువల్ల ఇది సహజంగా ఏర్పడినది కాదనడానికి అనేక ఆధారాలు దొరుకుతున్నాయి. 

రామసేతువును కాపాడుకుందాం. రామాయణం మనదేశ చరిత్రలో భాగం అని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పుకుందాం.

జై శ్రీ రామ 



rachana::Eco vinayaka  


"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥






5}

|| ॐ || జై శ్రీ రామ || ॐ ||

700 సంవత్సరాల ఇస్లాం దండయాత్రలు, 300 సంవత్సరాల (బ్రిటిష్)క్రైస్తవ ఆక్రమణ, దాడుల తరువాత కూడా ఈ ప్రపంచంలో అనాది కాలం నుండి కొనసాగుతూ వస్తున్నది ఒక్క హిందూ ధర్మమే. మన సంస్కృతి ఎవరు వేలెత్తి చూపలేరు. గత 200 సంవత్సరాలలో కొనుగొన్నామని చెప్తున్న సాంకేతిక పరిజ్ఞానమంతా కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన తాళ్ళపత్ర గ్రందాల్లో రాయబడి ఉన్నాయి. మనకు అనేక పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, స్మృతులు, సంహితలు ఉన్నాయి. రామాయణ, మహభారతాలు ఇతిహాసాలు. ఇతిహాసం అంటే 'ఇలాగే జరిగింది ' అని అర్దం. ఇవి ఈ సృష్టి వయసు కొన్ని కోట్ల సంవత్సరాలని ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పడానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే చెప్పాయి.

భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు ఈ దేశాన్ని ఆక్రమించాలి అంటే ఈ దేశ సంస్కృతిని, ధర్మాన్ని, విలువలను నాశనం చేయాలని భావించారు. దానికి ఆద్యుడు మోకాలె. ఈయన భారతదేశం మొత్తం పర్యటించి బ్రిటిష్ పార్లమెంట్లో 2-2-1835 న ఒక ప్రసంగం చేశాడు.

Lord Macaulay’s address to the British Parliament in 2 February, 1835:

"I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation."
ఈ దేశాన్ని ఆక్రమించాలన్నా, భారతదేశాన్ని ఎప్పటికి బానిస దేశం గా మార్చాలన్నా ముందు ఈ దేశస్థులకు తమ ధర్మం, తమ విద్యావిధానం కంటే, ఇంగ్లీష్ మరియు విదేశీ విద్యావిధానం మంచిది, వారి సంస్కృతే గొప్పదనే భావన రావాలి, అందుకు భారతదేశాంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాలని చెప్పడమే ఆ ప్రసంగ సారాంశం. దాని అమలు పరిచి Geometry వంటి 18 సబ్జెక్టులతో ఉన్న హిందూ విద్యావిధానాన్ని సర్వనాశనం చేశారు. 

దానికి తోడు వారి బైబిలు ఈ సృష్టి వయసు 5000 సంవత్సరాలని చెప్పింది. దాని వాదనను బలపరచడం కోసం, తమ మతాన్ని ప్రచారం చేయడం కోసం మన దేశ చరిత్రను తారుమారు చేసి కల్పితమైన చరిత్రను మనకు ఇచ్చారు. దాదాపు 2000 సంవత్సరాల చరిత్రను తొక్కేశారు (ఆధారాలు రాబోయే రోజుల్లో తెలియపరుస్తాం). ఇప్పుడు మనం పాఠశాలలో చదివినది, వారు వ్రాసిన చరిత్రే. దానితో పాటు అనేక చారిత్రిక ఆధారాలను నాశనం చేశారు. అప్పుడే వారు హిందువుల పురాణాలు కల్పితాలు, అవన్ని అబద్దాలంటూ, పుక్కిటి పురాణాలు హిందువులవి అంటూ ప్రచారం చేశారు. ఎందుకంటే మన దేశ చరిత్ర అంతా మన పురాణాల్లో సుస్పష్టంగా లిఖించబడి ఉంది. అవి తప్పని ప్రచారం జరిగితే కానీ తమూ వ్రాసిన చరిత్రను భారతీయులు నమ్మరన్నది వారి ఆలోచన. 

వారి విద్యావిధానంలో చదువుకున్న మనం కూడా మన పురాణ, ఇతిహాసాలు కల్పితాలంటూ, మన సంస్కృతి వ్యర్ధమంటూ, పదేపదే మనల్ని మన నిందించుకుంటూ మోకాలే వారస పుత్రులం అయ్యాం.

విషయంలోకి వస్తే రాముడే లేడంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో 2002 లో నాసా తమ ఉపగ్రహం(satellite) ద్వారా తీసిన కొన్ని ఫోటోలను విడుదల చేసింది. భారత్-శ్రీలంకల మధ్య ఒక వారాధి/వంతెన ఉందన్న విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచింది. శ్రీ రాముడు లంకను చేరి, రావణ సంహారం చేయడానికి, వానరసేన నిర్మించిన వంతెన అది. దాని పేరే రామ సేతువు. ఈనాటికి హిందూ మహసముద్రంలో ఉన్నది ఈ 'శ్రీ రామ సేతువు '. దీని కూల్చడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చిన నేపధ్యంలో శ్రీ రామసేతువు గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం. 

to be continued............... 

rachana::Eco vinayaka  


|| ॐ || జై శ్రీ రామ || ॐ || 



"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥


జై శ్రీ రామ
హిందువులందరూ ఏకం కావలసిన సమయం వచ్చింది. కేంద్రప్రభుత్వం త్రేతాయుగంలో శ్రీ రాముడు లంకను చేరుకోవడానికి నలుడు, నీలుడనే Hydraulic Engineers గొప్ప ప్రణాళికతో, వానరజాతి సహకారంతో నిర్మించబడిన 'రామసేతువు ' కూల్చడానికి నిర్ణయించుకుంది
. ప్రపంచంలో ఆధునిక ఇంజనీరులను కూడా విస్మయానికి గురిచేసే విధంగా ఉంది రామసేతు నిర్మాణం.

జై శ్రీ రామ 


http://indiatoday.intoday.in/story/setusamudram-project-will-be-made-says-centre/1/251414.html


















"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥


|| ॐ || RAMA SETHU'S CONSTRUCTION || ॐ || 

The Centre has decided to reject the R. K. Pachauri report and go ahead with the Setusamudram shipping channel project cutting through the sacred Ram Setu - a decision that could once again make it the target of multipronged attack from environmentalists, religious groups and political parties.

In an affidavit filed before the Supreme Cour t on Friday, the government submitted that it had decided to reject the conclusions and recommendations of the Pachauri committee which found the project to be "unviable both from the economic as well as ecological angles".

The government's decision is certain to bring it in confrontation with the Sangh parivar and the AIADMK, which is presently in the saddle in Tamil Nadu. Environmentalists, too, are up in arms against the project, arguing that it will destroy the ecology of the area.

The Pachauri committee was formed in 2008 to honour observations in this regard by then Chief Justice K. G. Balakrishnan in midst of a controversy over the government ignoring environmental concerns and religious sentiments.

- http://indiatoday.intoday.in/story/setusamudram-project-will-be-made-says-centre/1/251414.html

rachana::Eco vinayaka .... The real India  





















"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥



Thursday, June 21, 2012

పూరీ జగన్నాథ రథోత్సవం

పూరీ జగన్నాథ రథోత్సవం

సర్వవ్యాపి నారాయణుడి విశిష్టతను యావత్ ప్రపంచానికీ చాటుతూ ఉత్తరాదిన బదరీనాథ్, ద్వారక, దక్షిణాదిన రామేశ్వరం, మధ్య తూర్పున పూరీధామాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. 'శ్రీ పీఠం'గా పిలిచే పూరీఆలయం 214 అడుగుల ఎతైన గోపురంతో, 68 అనుబంధ ఆలయాలతో భక్తజనులను ఆకర్షిస్తున్నది. ఇక్కడ కొలువు దీరిన బలభద్ర, జగన్నాథ, సుభద్రలను సృష్టి (బ్రహ్మ), స్థితి (విష్ణు), లయ (మహేశ్వరుడు)లకు ప్రతీకగానూ; రుద్ర, విష్ణు, ఆదిపరాశక్తి రూపాలుగానూ భావిస్తుంటారు.

సాధారణంగా ఆలయాల్లో స్వామి మూలరూపం స్వయంభూవుగానో, లేదా ప్రతిష్ఠించో ఉంటుది. కానీ, పూరీనాథుడి రూపం 'దైవం చెక్కిన దారు శిల్పం'. అంగవైకల్యం కలిగిన విచిత్ర రూపం. సోదరి సుభద్రతో పాటు అన్నదమ్ములిద్దరు మొండిచేతులు, నడుం వరకు ఆకృతితోనే దర్శనం ఇస్తారు. అవయవ లోపంగల విగ్రహాలు అర్చనకు అనర్హమంటారు.కానీ 'నీలాచలం' క్ష్తేత్రంలో అదే ప్రత్యేకత. ఇందుకు సంబంధించి వాడుకలో ఉన్న కథల్లో ఒకటి- 'సముద్రంలో కొట్టుకు వచ్చే కలపదుంగతో తన మూర్తిని చెక్కించవలసిందిగా శ్రీమహావిష్ణువు ఇంద్రద్యుమ్నుడనే రాజును స్వప్నంలో కోరతాడు.

అయితే, ఆ పని ఎవరి వల్ల కాని పరిస్థితుల్లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ముందుకు వస్తాడు. 21 రోజలు వరకు తన పనికి ఆటంకం కల్పించ రాదంటూ గదిలోకి వెళి తలుపులు మూస్తాడు. అయితే, ఉత్సుకతను ఆపుకోలేని రాజదంపతులు పక్షం రోజులకే గది తలుపులు తెరవగా, మూడు ప్రతిమలు అసంపూర్తిగా కనిపించాయట. కానీ బ్రాహ్మణుడి జాడ లేదు. దాంతో ఆయనను సాక్షాత్తు శ్రీమన్నారాయుణుడిగా భావించిన రాజు తమ పొరపాటుకు చితించి, ఆ మూర్తులను అలాగే ప్రతిష్ఠించి మందిరం కట్టించారు. ఆ తరువాత క్రీ.శ. 1140లో అప్పటి రాజు అనంతవర్మ చోడగంగాదేవ్ నూతన మందిరం నిర్మించగా, అనంతరకాలంలో శిథిలమైనదానిని ఆయన మనువడు అనంగ మహాదేవుడు పునర్నిర్మించారు.

'విశ్వ'రథయాత్ర
ప్రపంచ రథయాత్రల్లో పూరీక్షేత్రం రథయాత్రకు పెట్టింది పేరు. అన్ని క్షేత్రాల్లో రథయాత్రలు జరుగుతున్నా, జాతిమతకులవర్గలింగ భేదాలకు అతీతంగా సర్వులూ పాల్గొనడం, స్వయంగా రథం లాగడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు దీనిని పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. జగముల నేలే దేవదేవుడే తన నివాసం 'శ్రీపీఠం' వీడి జనం మధ్యకు రావడం, రోజుల తరబడి ఆలయం వెలుపలే ఉండడం మరో ప్రత్యేకత. ఆయనను చేరలేని తమ కోసం తానే తరలివస్తారని భక్తకోటి విశ్వాసం. ధర్మరక్షణ, పతితోద్ధరణకు జగన్నాథుడు అలా రథయాత్ర చేస్తారని చెబుతారు. ఆలయ నియమం ప్రకారం 'యాత్ర' ప్రారంభమైన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ రథం పురోగమనమే తప్ప తిరోగమించదు.

ఏటా ఆషా«ఢ శుద్ధ విదియనాడు ప్రారంభమై ఏకాదశి వరకు సాగే రథయాత్రలో బలభద్ర, సుభద్ర, జగన్నాథులు వేర్వేరు రథాలు అధిరోహించి భక్తులకు దర్శనం ఇస్తారు. గజపతుల ప్రథమ హారతితోనే రథయాత్ర ఆరంభమవుతుంది. తరువాత, ఆ ముగ్గురు దేవతలు జన్మించిన ప్రాంతంగా భావించే 'అడప మండపం' వద్ద బసచేసి, తొమ్మిదవ నాడు తిరుగు ప్రయాణం (బహుదా యాత్ర) అవుతారు. ఆలయానికి చేరిన దేవతలకు 'పన' మధుర పదార్థాన్ని అందిస్తారు. అనంతరం జగన్నాథ స్వామి బంగారు జలతారు వస్త్రాలు ధరించి భక్తులకు పునర్దర్శనం ఇస్తారు. ఆలయ నియమం ప్రకారం 'యాత్ర' ప్రారంభమైన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ రథం తిరోగమించకూడదు.

మూలవిరాట్‌లు కదులుతాయి!
ఇతర క్షేత్రాల్లో ఉత్సవమూర్తులు ఆలయవీధుల్లో విహరిస్తే, ఇక్కడ 'మూల విగ్రహాలే' తరలి వెళతాయి. సాధారణంగా ఆలయాల్లో మూలవిరాట్‌లు శిలారూపాలుగా, ఉత్సవ విగ్రహాలు పంచలోహాలతో రూపొందించినవిగా ఉంటాయి. పూరీ క్షేత్రంలో అన్ని విగ్రహాలు 'దారు' (కొయ్య) నిర్మితాలే. అన్ని ఆలయాల్లో స్వామివారు దేవేరులతో కొలువు దీరితే, ఇక్కడ జగన్నాథుడు అన్నాచెల్లెళ్ల (బలరాముడు, సుభద్ర)తో కలసి ఉండడం ఇంకో ప్రత్యేకత. ఈ రథయాత్రను సోదరి పట్ల ప్రేమకు ప్రతీకగా చెప్పవచ్చు.

ముందు భాగంలో బలభ«ద్రుడి రథం, దాని వెంట సోదరి రథం వెళుతుంటే జగన్నా««థుడి తేరు వారినియ అనుసరిస్తూ చెల్లెలిని సు'భద్రం'గా చూసుకునే తీరు అవగతమవుతుంది. శ్రీవారు తనను మరచి అన్నాచెల్లెళ్లతో రథయాత్ర సాగించారన్న కినుకతో శ్రీమహాలక్ష్మి జగన్నాథుడు మందిరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని, స్వామి కొన్ని మధుల పదార్ధాలు తెచ్చి ఆమను ప్రసన్నం చేసుకుని మందిర ప్రవేశం చేస్తారని కథనం. పూజారులు పాటలతో ఆ దృశ్యాన్ని అభినయించడం ఆకట్టుకునే దృశ్యం.

సమానత్వం జగన్నాథ తత్త్వం
లౌకికవాదం, సమానత్వం జగన్నాథుని సిద్ధాంతమని ఆయన పూజాదికాలు, దర్శనంలో బోధపడుతుంది. దర్శనం, ఆ«రాధనల్లో హెచ్చుతగ్గులు-స్థాయీభేదాలు కానీ, 'మహాప్రసాదం' స్వీకరణలో 'అంటూసొంటూ' కానీ ఉండవు. 'సర్వం జగన్నాథం'నానుడి అలానే పుట్టిందేమో! జగన్నాథ ఆరాధన శైలి మానవ జీవితచక్రాన్ని పోలి ఉంటుంది. ఆకలి దప్పులు, అనారోగ్యం, మమతలు, అభిమానాలు, అలకలు గోచరిస్తాయి.

రథోత్సవ ప్రారంభానికి ముందు జ్యేష్ఠ పూర్ణిమ నాడు 108 బిందెలతో దేవతామూర్తులకు స్నానం చేయిస్తారు ఈ 'సుదీర్ఘ' స్నానంతో వారు మానవ సహజమైన అనారోగ్యం బారినపడి, తిరిగి కోలుకునే వరకు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. 56 రకాల ప్రసాదాలు ఆరగించే స్వామికి, ఆ సమయంలో 'పథ్యం'గా కందమూలాలు, పండ్లు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. మళ్లీఆలయ ప్రవేశంతో 'నేత్రోత్సవం' జరిపి, యథాప్రకారం నైవేద్యం సమర్పిస్తారు.



'భాగ్యనగరి' లో ఉత్కళ 'నాథుడు'
భాగ్యనగరిలో 'ఉత్కళ నాథుడు' కొలువుదీరాడు. పూరీ ఆలయ శిల్ప సౌందర్యానికి ప్రతీకగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 'కళింగ కల్చరల్ ట్రస్టు' ఆధ్వర్యంలో ఎకరంన్నర విస్తీర్ణంలో జగన్నాథ మందిరం రూపుదిద్దుకుంది. 74 అడుగుల ఎత్తు గోపురంతో, ఆలయ ప్రాంగణంలో శ్రీమహాలక్ష్మి, కాశీవిశ్వనాథ,విమల (దుర్గాదేవి), గణపతి, హనుమాన్, నవగ్రహ ఉప ఆలయాలు ఉన్నాయి.

ప్రాకారాలపై రామాయణ, భాగవత, భారత పురాణాల ప్రధాన ఘట్టాలు, దశావతర ఘట్టాలు కన్నుల విందు చేస్తాయి. పూరీ తరహాలోనే ఇక్కడ ్డ అర్చనలు నిర్వహిస్తున్నారు. ఆలయం నిర్మించాక జరిగిన తొలియాత్ర మాదిరిగానే జూలై 3వ తేదీన జరిగే రెండవ రథయాత్రను కూడా గవర్నర్ ఇ.ఎస్ఎల్. నరసింహన్ ప్రారంభిస్తారు. 'ర థస్తం వామనమ్ దృష్ట్వా పునర్జన్మ న విద్యతే'... అని ఆర్యోక్తి. వామనుడు జగన్నాథుని అవతారమని, రథంపై ఉన్న ఆయన దర్శనంతో పాపవిమోచనం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఆ శోభాయాత్ర కోసం వారి నిరీక్షణ...

'నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే!
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్!!

మహేందర్ భొద్దు గారి ప్రేరణ..వీరి ప్రేరణలు నాకు బాగా నచ్చుతాయి
వీరు రాసిన ఈ వ్యాసం మీరందరు చదివి కామెంటు రాస్తారని ఆశిస్తూ...



Wednesday, June 20, 2012

సుదర్శన చక్రం మహత్యము























శ్రీ మహావిష్ణువు ఆయుధం. మహావిష్ణువు కుడి చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకొంటాడు. మిగిలిన మూడు చేతులతో శంఖం, గద, పద్మాన్ని ధరిస్తాడు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం తో అనేక మంది రాక్షసులను సంహరించాడు. సుదర్శన చక్రం తేజస్సు కి చిహ్నం. శ్రీరంగం మొదలైన క్షేత్రాలలో సుదర్శనచక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు కలవు. తిరుమల బ్రహ్మోత్సవాలలో చివరిదినాన స్వామి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది.


వామన పురాణం లోని కథ


వెలుగులతో వెలువడుతున్న సుదర్శనచక్ర దర్శనం
సుదర్శన చక్రం వృత్తాంతం వివిధ పురాణాలలొ చెప్పబడింది. వామన పురాణం ఆధారిత వృత్తాంతం ప్రకారం సుదర్శన చక్ర ప్రాప్తి కథ. ఇది శ్రీదాముడు అనే రాక్షసుడు లక్ష్మీ దేవిని వశపరచుకొంటాదు. శ్రీమహావిష్ణువు వద్ద ఉన్న శ్రీవత్సం కూడా వశపరచుకొందాం అని అనుకొంటుండగా శ్రీమహావైష్ణువు చింతా క్రాంతుడై పరమశివుడి నివాస స్థానం అయిన కైలాసం కి వెళ్ళి శివుని ప్రార్థిస్తాడు. శివుడు యోగ తపస్సు ఉండడం చూసి శివుడి కోసం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు. శివుడికి మహావిష్ణువు జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తాడు.శ్రీదాముడిని చంపడానికి అస్త్రాన్ని ప్రసాదించమంటాడు. శివుడు ప్రీతి చెంది సుదర్శన చక్రం అనే చక్రాయుధాన్ని ఇస్తాడు. విష్ణువు తన నేత్రాన్ని సమర్పించుకొంటాడు. పరమ శివుడు ప్రసన్నుడై మహావిష్ణువు కి అత్యంత శక్తి వంతమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఆ చక్రం లొ 12 ఆకులు, 6 నాభులు, 2 యుగాలు ఉంటాయి, అవి సకలదేవతలను, రాశులని, ఋతువులను,అగ్ని ని, సోముడు,మిత్రవరుణులు,ఇంద్రుడు, విశ్వ దేవతలు, ప్రజాపతి, హనుమంతుడు,ధన్వంతరి, తపస్సు, చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతిష్ఠమై ఉంటాయి అని చెబుతాడు పరమశివుడు. విష్ణువు ఆ సుదర్శన చక్రం యొక్క శక్తిని శివుడి మీదనే ప్రయోగం చేయవలేననినున్నదని శివునితో ప్లుతాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు, పరమ శక్తి వంతమైన ఆ సుదర్శన చక్రం శివుడిని విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడు అనే 3 భాగాలుగా ఖండిస్తుంది, ఆ విధంగా ఖండింపడిన శివుని చూసి విష్ణువు ఖిన్నుడౌతాడు. అప్పుడు శివుడు కనిపించి సుదర్శన చక్రం తన పాకృత, వికృత రూపాలను ఖండించింది కాని తన తన స్వాభవమైన తత్వాన్ని ఏమి చేయలేక పోయిందని, ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని శ్రీదాముడి సంహరించమని చెబుతాడు. ఆ మూడు ఖండాలుగా హిరణ్యాక్ష, సువర్ణాక్ష, విరుపాక్ష గా పూజింపడుతాయని చెబుతాడు.

మరో ఇతిహాసం లోని కథ

సుదర్శనోపనిషత్తు ప్రకారం, సుదర్శన చక్రం దేవశిల్పి అయిన విశ్వకర్మచే తయారుచేయబడినది. విశ్వకర్మ కూతుర్ని సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఆమె సూర్యుని తేజస్సు మూలంగా అతన్ని చేరలేకపోతుంది. విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపట్టాడు. అప్పుడు రాలిన పొడితో మూడింటిని తయారుచేశాడు. ఒకటి పుష్పక విమానం, రెండవది పరమశివుని త్రిశూలం మరియు మూడవది విష్ణుముర్తి సుదర్శన చక్రం.

Sunday, June 10, 2012

చాణక్య నీతి





సంస్కృతిలో తండ్రి గొప్పతనం ! పురాణాలలో తండ్రినిలా వర్ణించారు.

న తో ధర్మచరణం కించిదస్తి మహత్తరమ్ I
యథా పితరి శుశ్రూషా తస్య వా వచనక్రిపా II

-వాల్మీకి (రామాయణం, అయోధ్యకాండ)

తండ్రికి సేవలు చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడంకన్నా మించిన మరో ధర్మాచరణ లేదని ఈ శ్లోకం అర్థం

జ్యేష్ఠో భ్రాతా పితా వాపి యశ్చ విద్యాం ప్రయచ్ఛతి I
త్రయస్తే పితరో జ్ఞేయా ధర్మే చ పథి వర్తిన: II
-వాల్మీకి (రామాయణం, కిష్కింధకాండ)

పెద్దన్నయ్య, తండ్రి మరియు విద్యను ప్రసాదించే గురువు- వీరు ముగ్గురుకూడా ధర్మ మార్గాన్ననుసరించే తండ్రిలాంటి వారు. వీరినికూడా తండ్రితో సమానంగా గౌరవించాలంటోంది మన హిందూ ధర్మం.

దారుణే చ పితా పుత్రే నైవ దారుణతాం వ్రజేత్ I
పుత్రార్థే పద:కష్టా: పితర: ప్రాప్నువన్తి హి II
-హరివంశ్ పురాణం(విష్ణు పర్వం)

పుత్రుడు క్రూర స్వభావం కలవాడైనాకూడా తండ్రి అతనిపట్ల ప్రేమగానే చూస్తుంటాడు. ఎందుకంటే తన పుత్రుడికొరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొనేది తండ్రేనని పురాణాలు చెపుతున్నాయి.

జనితా చోపనేతా చ, యస్తు విద్యాం ప్రయచ్ఛతి I
అన్నదాతా భయత్రాతా, పంచైతే పితర: స్మృతా: II
-చాణక్య నీతి
ఈ ఐదుగురుకూడా తండ్రితో సమానమని చాణక్య నీతి చెపుతోంది. (జన్మనిచ్చేవాడు, ఉపనయనం చేసేవాడు, చదువు చెప్పేవాడు, అన్నదాత, భయాన్ని పోగొట్టేవాడు

Sunday, November 28, 2010

మల్లికార్జునుడనే పేరు ఎలా వచ్చింది?





















శ్రీశైలక్షేత్రంలో స్వామి వారిని 'మల్లికార్జున భ్రమరాంబగా' ఎందుకు పిలుస్తారు?
క్షేత్రస్వామి మల్లికార్జునుడనే పేరు రావడానికి గల కారణాలు గూర్చి చెప్పే కథ-
.............................
యుగాల పూర్వము చంద్రవంశపురాజు చంద్రగుప్తుడనే వాని కుమార్తె చంద్రవతి ఈ స్వామిని సేవిస్తున్న తరుణంలో పార్వతీపరమేశ్వరులు ఆనంద సముద్రంలో తేలియాడుచూ చంద్రవతి భక్తికి మెచ్చి వరమడుగగా ఆమె స్వామి వారి శిరస్సుపై నుంచిన మల్లెపూల దండ ఎన్నడూ వాడకూడదని కోరగా, స్వామివారు తధాస్తు అని అనెను. నాటి నుండి మల్లె పూలతో పూజించబడిన స్వామి గనుక మల్లికార్జునుడైనాడు. పార్వతి అమ్మ వారిని ఈ ప్రాంతంలో భ్రమరరూపాన్ని ధరించి 'అరుణ' డనే రాక్షసుని సంహరించినందున భ్రమరాంబగా పిలుస్తారు