Showing posts with label నిత్య మానవ ధర్మాలు. Show all posts
Showing posts with label నిత్య మానవ ధర్మాలు. Show all posts

Monday, December 24, 2012

ఆధ్యాత్మికం













నిత్య మానవ ధర్మాలు - పార్ట్ 5

ఇంతకు క్రితం వరకు స్నానం చేయడం వరకు పాటించాల్సిన 

నియమాలను గురించి తెలుసుకున్నాం... ఇప్పుడు స్నానం 
తర్వాత 

చేయాల్సిన విధులను గురించి తెలుసుకుందాం....

21. స్నానం తర్వాత ముందుగా ముకం, తర్వాత వక్షస్థలం, 

ఆ తర్వాత శిరస్సు... ఆపైన మిగతా శరీర భాగాలను 

తుడుచుకోవాలి. 

పొడి వస్త్ర్రంతోనే తుడుచుకోవాలి. తడిబట్టను వాడకూడదు.

22. స్త్ర్రీలు సాధారణంగా కంఠస్నానం చేసేప్పుడు జుట్టు చివర 

తప్పనిసరిగా ముడి వేసుకోవాలి. లేనట్లయితే దేహం 

పిశాచగ్రస్తమవుతుంది. తలంటు చేసేప్పుడు ఆ అవసరం 

లేదు. అయితే... స్నానం పూర్తయిన వెంటనే జుట్టుకు ముడి 

వేయాలి.


23. స్నానం చేసేందుకు కట్టుకుని, తడిపిన బట్టను కిందకు 


వదలాలి. ఈ బట్టను తానైనా ఉతికి ఆరవేయాలి. లేదా భార్య, 

పిల్లలు 

ఆరవేయాలి. ఇతరులకు దాన్ని ఉతకడానికి గానీ, 

ఆరవేయడానికి గానీ ఇవ్వకూడదు.

24. బట్టలు మార్చుకునేప్పుడు పొడిబట్టలు పైకి తీయాలి. 

కిందకు విడవకూడదు.


25. స్నానం ఎక్కువ సేపు చేయాలి. గోడపై నీళ్లు చల్లినట్లు 

మమ అనిపించుకోకూడదు.




26. స్నానాలు ప్రధానంగా మూడు రకాలు:

అ) అభ్యంగన స్నానం (తలంటు పోసుకోవడం)

ఆ) అవబృద స్నానం (దీక్ష చివర చేసేది)

ఇ) అఘమర్షణ స్నానం (తడి బట్టలతో దేహాన్ని 

రుద్దుకోవడం. ఈ తర్వా స్నానం వల్ల బుద్దిజ్నానాలు 

పెరుగుతాయి)


27. తలంటు స్నానాలు ఏయేరోజుల్లో ఏ ఫలితాన్నిస్తాయి?

ఆదివారం - తాపం

సోమవారం - కాంతి

మంగళవారం - మంచిదికాదు

బుధవారం - లక్ష్మీ

గురువారం - ధననాశం

శుక్రవారం - విపత్తు

శనివారం - భోగం

(ఇవి పురుషులకు మాత్రమే. స్త్ర్రీలు రోజూప తలంటు 

చేసుకోవచ్చు. పురుషులు ప్రత్యేక దీక్షల్లో ఉన్నప్పుడు, 

వ్రతాలు చేసేప్పుడు ఈ 

నిబంధన అడ్డురాదు)


28. శిరస్సు స్నానం చేసినప్పుడు మాత్రమే తడి విభూతి 

నుదుటన పెట్టుకోవాలి. కంఠ స్నానం చేసినప్పుడు పొడి 

విభూపతిని మాత్రమే 

పెట్టుకోవాలి.


29. విభూతిని ముందుగా బొటన వేలితో కుడి నుంచి 

ఎడమకు పెట్టుకోవాలి. మధ్యవేలితో సరిచేసుకోవాలి. తర్వాత 

మధ్యమూడు 

వేళ్లతో అడ్డంగా విభూతి పెట్టుకోవాలి.



30. విభూతిని మూడు గీతులగా పెట్టుకోవడం అంటే... 

సత్వ, రజ, తమో గుణాలకు అతీతుడు అని అర్థం.



నోట్: ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు... మనుధర్మశాస్త్ర్రాల 

సారాలు. కాబట్టి.. ఎందుకు, ఏమిటి?? అని 

ప్రశ్నించకుండా... 

హిందూమతాభిమానం ఉన్నవారు పాటించగలరు. ప్రతిరోజూ 

కొన్ని ధర్మాలను మీ ముందు పెడతాను. దయచేసి 

అన్యమతస్తులు 

మీరు ఇష్యూ చేయడానికి నా వాల్ ను, నా పోస్టులను 

వేదికగా చేసుకోకండి. ఇక మనుధర్మశాస్త్ర్రాలను 

వ్యతిరేకించేవారున్నారు. 

అయితే... అందరికీ ఆమోదయోగ్యమైన ధర్మసూత్రాలను 

మాత్రమే ఇక్కడ నేను పోస్టు చేస్తున్నాను.

Sunday, December 23, 2012

మన సంస్కృతి















మన సంస్కృతిలో దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపారాధన పూజామందిరమందు, దేవాలయములో 


గృహప్రాంగణములలో, తులసీ బృందావనమందు, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల వద్ద, పుణ్య 


నదీతీరములందు ప్రాతః కాలమందు, మరియు సంధ్యా సమయమందు వెలిగించుట అత్యంత పుణ్యప్రదమని 


పురాణాలు వర్ణించి చెబుతున్నాయి.




కార్తీకే తిలతైలేన సాయంకాలే సమాగతే, ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం హరిం ప్రతి,మహతీం 

శ్రియమాప్నోతి రూప సౌభాగ్య సంపదం(నిర్ణయ సింధు)



సంకల్పం: అహం సకల పాపక్షయపుర్వకం శ్రీ రాధా దామోదర ప్రీతయే అద్య ఆరంభ కార్తీక అమావాస్యా పర్యంతం 


యథా శక్తి ఆకాశ దీపదానం కరిష్యే.

అని దీపం వెలిగించిన తరువాత ఈక్రింది శ్లోకం చదువుతూ నమస్కారం చేయాలి.

దామోదరాయ నభసి తులాయాం లోలయా సహా,

ప్రదీపం తే ప్రయచ్చామి నమో అనంతాయ వేధసే (నిర్ణయ సింధు)

ఇలా రోజూ చేయడం కుదరని పక్షంలో మాసాంతంలోని చివరి మూడు రోజులు చేసిననూ ఆయురారోగ్య ఐశ్వర్య 


అభివృద్ది కలుగుతుంది

నిత్య మానవ ధర్మాలు ,















కార్తీక స్నాన విధి


కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్ధన!


ప్రీత్యర్ధం దేవ దేవేశ దావెూదర మయా సహా!!



అని శ్లోకాన్ని జపిస్తూ ప్రతి రోజూ ఉదయాన్నే చన్నీటి స్నాన మాచరించాలి.


ఆ తరువాత ఈ క్రింది మంత్రములు చదువుతూ సూర్యునికి అర్ఘ్యమును 


ఈయవలెను. 


మయా కృత కార్తీక స్నానాంగం అర్ఘ్య ప్రాదానం కరిష్యే  


వ్రతినః కార్తికే మాసి స్నానస్య విదివన్మమ, ఘ్రుహానార్ఘ్యం మయా దత్తం 


దనుజేంద్ర నిషూదన - శ్రీ కృష్ణాయ నమః ఇదం అర్ఘ్యం


నిత్య నైమిత్తికే కృష్ణు కార్తికే పాపనాశనే, ఘ్రుహానార్ఘ్యం మయా దత్తం 

రాధాయా సహితో హరే - శ్రీ హరయే నమః ఇదం అర్ఘ్యం

అనేన అర్ఘ్య ప్రదానేన శ్రీ హరిః ప్రీయతాం"










నిత్య మానవ ధర్మాలు (17.12.2012)

5. తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవస్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి... ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం...

6. ఇక స్నానాల్లోకెల్లా... చన్నీటి స్నానం ఉత్తమమైనది.
ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం. చెరువులో స్నానం మధ్యమం. నూతివద్ద స్నానం చేయడం అధమం. మిగతా స్నానాలకు పేర్లులేవు. అయితే... హైదరాబాద్ నగర వాసులు అదృష్టవంతులు... నదివరకు వెళ్లి ప్రవాహ ఉదక స్నానం చేయకున్నా... రోజూ కృష్ణా, మంజీరా నదుల నీటితో స్నానం చేస్తుంటారు. అది ఉత్తమోత్తమం. ఇక హైదరాబాద్ లోని మరో భాగం ప్రజలు గండిపేట జలాశయం నీటితో స్నానం చేస్తుంటారు. ఇదీ మంచిదే. వేయిపనులున్నా... వాటిని వదిలి... సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

7. నదీస్నానం, కాలవల్లో స్నానం చేసేప్పుడు ప్రవాహానికి ఎదురుగా మగవారు, వాలుగా ఆడవారు స్నానం చేయాలి. మగవారు ఎదురుగా కాకుండా, వాలుగా స్నానం చేస్తే వారి మగతనం నషిస్తుంది. అదేవిధంగా ఆడవారు ప్రవాహానికి ఎదురుగా స్నానం చేస్తే... వారి స్త్ర్రీత్వం నశిస్తుంది. (ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లే... నేడు సంతానలేమికి కారణమవుతున్నాయి)

8. ఒక నదిలో స్నానం చేసేప్పుడు మరో నదిని దూషించకూడదు.

నోట్: ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు... మనుధర్మశాస్త్ర్రాల సారాలు. కాబట్టి.. ఎందుకు, ఏమిటి?? అని ప్రశ్నించకుండా... హిందూమతాభిమానం ఉన్నవారు పాటించగలరు. ప్రతిరోజూ కొన్ని ధర్మాలను మీ ముందు పెడతాను. దయచేసి అన్యమతస్తులు మీరు ఇష్యూ చేయడానికి నా వాల్ ను, నా పోస్టులను వేదికగా చేసుకోకండి. ఇక మనుధర్మశాస్త్ర్రాలను వ్యతిరేకించేవారున్నారు. అయితే... అందరికీ ఆమోదయోగ్యమైన ధర్మసూత్రాలను మాత్రమే ఇక్కడ నేను పోస్టు చేస్తున్నాను.

Friday, January 7, 2011

మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు ఏమిటి?





















మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు ఏమిటి?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

జీవి ఈ భూమ్మీదకు వచ్చేప్పుడు సూర్యుడు ఏనక్షత్రానికి దగ్గరలో వున్నాడో అది మన జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే దివ్య శాస్త్రము జ్యోతిష్యము. ఇక జీవితములో మనిషికి దు:ఖాన్ని కష్టాలు ఎలాసంభవిస్తాయో వాటికి ఏ గ్రహాలకుకు శాంతులు చెయ్యాలో ఈ శాస్త్రంలో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు జరిపించుకుంటూ ఉంటాము. మన నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈసూత్రాన్ని ఆచరించి ఎంతో మేలు పొందవచ్చు. మీరు పుట్టిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్నిపెంచితే అది పెరిగి పెద్దయ్యేకొద్దీ శుభాలను కురిపిస్తుంది.

మీరునాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, వీథి పక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటండి. అది పెరిగేలా శ్రద్ద చూపించండి. మీరు మొక్క నాటాక వాటి పోషణకు సమయం చాలదనుకుంటే మీస్వంత డబ్బుతో దానిని పెరిగేదాకా సంరక్షించే ఏర్పాటు చేయండి. మీ నక్షత్రం చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆవృక్షాన్ని దర్శించి నమస్కరించాలి. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆవృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసిపిల్లలచేత కూడా ఇలా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలో శుభాలు వెల్లివిరుస్తాయి.

ఏ నక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి...

అశ్వని - - జీడిమామిడి
భరణి - - దేవదారు
కృత్తిక - - అత్తి [మేడి]
రోహిణి - - నేరేడు
మృగశిర - - మారేడు
ఆరుద్ర - - చింత
పునర్వసు -  - గన్నేరు
పుష్యమి - -  పిప్పలి
ఆశ్లేష - - బొప్పాయి
మఖ - - మర్రి
పుబ్బ - - మోదుగ
ఉత్తర - - జువ్వి
హస్త - - కుంకుడు
చిత్త - - తాడి
స్వాతి - - మద్ది
విశాఖ - - మొగలి
అనూరాధ - - పొగడ
జ్యేష్ఠ - - కొబ్బరి
మూల - - వేగి
పూర్వాషాఢ - - నిమ్మ
ఉత్తరాషాఢ - - పనస
శ్రవణం - - జిల్లేడు [తెల్లజిల్లేడు మరీ శ్రేష్ఠం]
ధనిష్ఠ - - జమ్మి
శతభిషం -  - అరటి
పూర్వాభద్ర -  - మామిడి
ఉత్తరాభాద్ర -  - వేప
రేవతి -  -  విప్ప