Friday, May 4, 2012

శ్రీ సరస్వతి అష్టోత్తర శత నామావళి--Sri Saraswati Astottara Sata Namavali
























సరస్వతి నమస్తుభ్యంవరదే కమరుపిని
విద్యరంబం కరిష్యామి
సిద్ధిర్ భవతు మే సద
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసర వర్ణి నీనిత్యం పద్మాలయా దేవి సాం మాం పాతు సరస్వతీ




ఓం సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహమాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మా క్ష్రైయ నమః
ఓం పద్మవక్త్రాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్త కధ్రతే నమః
ఓం ఙ్ఞాన సముద్రాయై నమః ||10 ||

ఓం రమాయై నమః
ఓం పరాయై నమః
ఓం కామర రూపాయై నమః
ఓం మహా విద్యాయై నమః
ఓం మహాపాత కనాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగ్యాయై నమః || 20 ||

ఓం మహొత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం సీతాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః || 30 ||

ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయ్యై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్ర లేఖావిభూషితాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకార భూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః || 40 ||

ఓం వసుధాయ్యై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహా బలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిందాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం శివాయై నమః||50||

ఓం జటిలాయై నమః
ఓం వింధ్యవాసాయై నమః
ఓం వింధ్యాచల విరాజితాయై నమః
ఓం చండి కాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మఙ్ఞా నైకసాధనాయై నమః
ఓం సౌదామాన్యై నమః
ఓం సుధా మూర్త్యై నమః
ఓం సుభద్రాయై నమః || 60 ||

ఓం సుర పూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సునాసాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం విద్యా రూపాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం బ్రహ్మాజాయాయై నమః
ఓం మహా ఫలాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః || 70 ||

ఓం త్రికాలఙ్ఞాయే నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం శాస్త్ర రూపిణ్యై నమః
ఓం శుంభా సురప్రమదిన్యై నమః
ఓం శుభదాయై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం రక్త బీజనిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం మాన్ణాకాయ ప్రహరణాయై నమః || 80 ||

ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః
ఓం సర్వదే వస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురా సుర నమస్క్రతాయై నమః
ఓం కాళ రాత్ర్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వారాహ్యై నమః || 90 ||

ఓం వారి జాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్ర గంధా యై నమః
ఓం చిత్ర మాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః
ఓం వంద్యాయై నమః
ఓం విద్యాధర సుపూజితాయై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం నీలభుజాయై నమః || 100 ||

ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్యై నమః
ఓం రక్త మధ్యాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం నీలంజంఘాయై నమః
ఓం శ్రీ ప్రదాయై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః || 108 ||

శ్రీ సరస్వతి అష్టోత్తర శత నామావళి సంపూర్ణమ్






Sri Saraswati Astottara Sata Namavali 

sarasvati namastubhyaMvaradae kamarupini
vidyaraMbaM karishyaami
siddhir^ bhavatu mae sada
padmapatra viSaalaakshee padmakaesara varNi neenityaM padmaalayaa daevi saaM maaM paatu sarasvatee



OM sarasvatyai nama@h
OM mahaabhadraayai nama@h
OM mahamaayaayai nama@h
OM varapradaayai nama@h
OM padmanilayaayai nama@h
OM padmaa kshraiya nama@h
OM padmavaktraayai nama@h
OM Sivaanujaayai nama@h
OM pusta kadhratae nama@h
OM ~m~naana samudraayai nama@h ||10 ||

OM ramaayai nama@h
OM paraayai nama@h
OM kaamara roopaayai nama@h
OM mahaa vidyaayai nama@h
OM mahaapaata kanaaSinyai nama@h
OM mahaaSrayaayai nama@h
OM maalinyai nama@h
OM mahaabhOgaayai nama@h
OM mahaabhujaayai nama@h
OM mahaabhaagyaayai nama@h || 20 ||

OM mahotsaahaayai nama@h
OM divyaaMgaayai nama@h
OM suravaMditaayai nama@h
OM mahaakaaLyai nama@h
OM mahaapaaSaayai nama@h
OM mahaakaaraayai nama@h
OM mahaaMkuSaay

Thursday, April 26, 2012

శంకర జయంతి శుభాకాంక్షలతో



































Adi Shankaracharya- An Introduction
by Sesha Sai Sharma garu

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం||

పరమశివుని మొదలు, ఆది శంకరుల మధ్యగా, నా గురువులు ఋషి ప్రభాకర్ గారి వరకు ఉన్న గురు పరంపరకు వందనములు.
కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.

ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్బములో ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

మూడవ యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదవ యేట ఉపనయన సంస్కారము జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని యింటి యిల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందిట.

దిన దిన ప్రవర్థమాన మవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారత దేశ యాత్ర మొదలు పెడుతారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదానదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు.

శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలా మంది శిష్యులు ఏర్పడుతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళుతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతిచోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగ కుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు.

ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.

బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరిద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచ్చి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్బుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేసారు.
హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారు. ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడు. ఆ సందర్భముగా ఆది శంకరులు ఆ నరహరిని స్తుతిస్తూ కరుణారస పూరితమైన, శరణాగతితో నిండిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించారు.

తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.
తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు.

ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు, చార్ ధామ్ మొదలైన పుణ్య క్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి, సమాజము భాసిల్లుతున్నాయి.
శంకరుల రచనలు:
ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పై మెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి మొదలైనవి, ఇంకొక పై మెట్టుపై భాష్యాలు.

ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి - ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. కొన్ని స్తోత్రాల వివరాలు.

విష్ణు షట్పది:
మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.

సాధనా పంచకము:
శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.

దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము.

శివ సువర్ణమాలా స్తుతి:
యాభై శ్లోకాలలో లయ బద్ధమైన పదాలు, భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనము తో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు ఆది శంకరులు రచించారు. సాంబ = స+ అంబ - నిరంతరం ఆ జగదంబ అయిన పార్వతితో కూడి అర్థనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమ శివుడు సాంబుడు అయినాడు. పార్వతీ సమేతుడవైన శివా! శంభో! నీ పాదములకు నమస్కారములు. నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి, అగణిత గుణ గణములను ఆది శంకరులు నుతించారు. స్తోత్రము ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన, కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు. యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడై, దైవ సాక్షాత్కారము కలిగి, ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే, ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడ గలుగుతుంది.

ఆయన మహిమను తెలిపే ఒక స్తుతి - తోటకాష్టకము:
ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది.

శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు. గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో 'వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం' అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు.

మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు.

ముగింపు:
ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినది. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్గారువులకు శత సహస్ర పాదాభివందనములు.

శ్రీలక్ష్మీ నృసింహ స్తోత్రము





















శ్రీ శంకర భగవత్పాదులు శిష్యులతో దేశ సంచారము చేయుచూ శ్రీశైలమునకు వచ్చినపుడు శ్రీ సంకరులను ఒక కాపాలికుడు చంప నిశ్చయించెను. ఒక గొప్ప రాజును గాని, యోగిని గాని బలి యిచ్చినచో కపాలి (ఈశ్వరుడు) తనకు కోరిన వరములిచ్చునని కాపాలికుని విశ్వాసము. శ్రీ శంకరులు దీనికి అంగీకరించి, నాశిష్యులవలన నీకు అపాయము కలుగకుండా చూచుకొనుము అని చెప్పిరి. కాపాలికుడు కత్తి నెత్తిన పెట్టు సమయమున శ్రీ శంకరులు అంగరక్షకులైన పద్మపాదు అను శిష్యునకు తమ గురువు ఆపదలో ఉన్నట్లు స్పురించి, అతడు నృసింహ మంత్రమును జపించుచూ గురుసన్నిధికి రాసాగెను. ఇంతలో భగవంతుడు నృసింహరూపమున వచ్చి ఆ కాపలికుని చీల్చి చంపి, శంకరులను కాపాడెను. ప్రత్యక్షమైన శంకరుని చూచి పరవశులై శ్రీ శంకరులవారు స్తుతించుచూ ఈ స్తోత్రమును చెప్పిరి. ఈ స్తోత్రమును పటించువారికి ఎట్టి ఆపదలు కలుగవని భక్తుల విశ్వాసము.

శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రమ్

1||శ్లో|| శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే! భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే !
యోగీ శ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత! లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||

తా: పాలసముద్రము నివాసముగాగల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దేహము కలవాడా! యోగులకు ప్రభువైన వాడా! శాశ్వతుడా! సంసార సాగరమునకు నావ యగువాడా! లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.

2||శ్లో || బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క కిరీటకోటి - సంఘటి తాఘ్రి కమలామల కాంతికాంత
లక్ష్మీ ల సత్కుచ న రో రు హరాజహంస - లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలమ్బమ్ ||

తా: బ్రహ్మ, దేవేంద్రుడు, శివుడు, వాయుదేవుడు, సూర్యుడు అను దేవతల కిరీటముల అంచులచే తాకబడిన పాదపద్మముల కాంతిచే ప్రకాశించు వాడా! లక్ష్మీ దేవి యొక్క అందమైన స్తనములనెడి తామర మొగ్గలకు రాజహంస యైన వాడా! ఓ లక్ష్మీ నృసింహాదేవా! నాకు చీయూత నొసగుము.

3||శ్లో || సంసార సాగర విశాలాక రాళ కాల - నక్ర గ్ర హగ్ర సన నిగ్ర హ విగ్ర హాస్య |
వ్యగ్ర స్య రాగర సనో ర్మి నిపీడిత స్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ దేవా నేను సంసారమనెడి సముద్రములో మునిగి, భయంకరములై, పెద్ద వైన కోరికలనెడి మొసళ్ళు మున్నగు క్రూర జల చరములచే మ్రింగ బడుచున్నాను. రాగ మనెడి ధ్వనించు అలలచే బాదింపబడుచున్నాను. ఓ నృసింహ దేవా! అట్టి నాకు చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.

4||శ్లో || సంసార ఘోర గహనే చరతో మురారే ! మారో గ్రభీ కర మృగ ప్రచురార్ధి తస్య |
ఆర్తస్య మత్సర నిదాఘుణి పీడితస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ మురారీ! నేను సంసార మనెడి ఘోరమైన అరణ్యములో సంచరించుచున్నాను. అందు మన్మథుడనెడి భయంకరమైన క్రూర మృగము నన్ను పట్టి మిక్కిలి పీడించుచున్నది. మత్సరమను మండువేసవి బాధింపగా మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ నృసింహ దేవా! ఆర్తుడైన నాకు రావలంబన మిచ్చి కాపాడుము.

5||శ్లో|| సంసార కూప మటి ఘోర మగాధ మూలం - సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య ,
దీన స్య దేవ కృపాయా పద మాగాతస్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ నరసింహస్వామీ! సంసారమనునది భయంకరమును, మిక్కిలి లోతైనదియును అగు పాడునుయ్యి . నేను ఆ కూపములో పడిపోయితిని. వందల కొలదిగా ఉన్న దుఃఖములనెడి సర్పములు నన్ను చుట్టుముట్టినవి. గొప్ప ఆపదలో ఉన్నాను. ఓ నృసింహదేవా! దీనుడనైన నాకు చేయూతనిచ్చి యుద్ధరింపుము.

6||శ్లో|| సంసార భీకర కరీన్ద్ర కరాభి ఘూత - నిష్పిష్ట మర్మవ వపుషః సకలార్తి నాశః
ప్రాణ ప్రయాణ భవ భీతి సమాకులస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: దుఃఖములన్నింటిని నశింపజేయునట్టి దేవా! నేను సంసారమనెడి భయంకరమగు ఏనుగునకు చిక్కితిని. అది తొండముతో కొట్టి నా శరీరమును మిక్కిలి పీడించుచున్నది. ప్రాణములు పోవునేమో యను భయముతో మిక్కిలి తల్లడిల్లుచున్నాను. ఓ లక్ష్మీ నరసింహస్వామీ కరావలంబన మొసగి, ఈ సంసార గజబాద నుండి తప్పించుము.

7||శ్లో || సంసార సర్ప ఘనవక్త్ర భాయోగ్ర తీవ్ర - దంష్ట్రా కరాళ విష దగ్ధ వినష్ట మూర్తే :
నాగారి వాహన! సుదాబ్ది నివాస! శౌరే ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: గరుడవాహనుడవు, పాలకడలి నివాసముగా కలవాడవు, అగు ఓ శౌరీ, సంసారము క్రూరమై, కోరలయందు విషము నిండి యున్న సర్పమువంటిది. దాని కాటువలన విషము శరీరము వ్యాపించి ప్రాణము పోవుచున్నది. నీవు నా ప్రాణములు కాపాడి నన్నుద్దరింపుము.

8||శ్లో|| సంసార జాలపతిత స్య జగన్నివాస - సర్వేంద్రి యార్ధ బడి శాగ్ర ఝుషోపమస్య |
ప్రోత్ఖండిత ప్రాచుర తాలిక మస్తకస్య - లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: సర్వలోకములు నివాసముగా కల ఓ ప్రభూ! నేను సంసారమనెడు వలలో పడితిని. ఇంద్రియార్ధములనెడు గాలమునకు చిక్కిన చేపవంటివాడును. గాలమున చిక్కిన చేప దవడలు విచ్చి తలపై కెగసి యుండునట్లు - నేనునూ బయటకు రాలేక తపించుచున్నాను. నన్నీ సంసార బాధ నుండి తొలగించి యుద్ధరింపుము.

9||శ్లో|| సంసార వృక్ష మఘబీజ మనంత కర్మ- శాఖాయుతం కరణ పత్ర మనజ్గ పుష్పమ్ ||
ఆరుహ్య దుఃఖ ఫలినం పతితో దయాళో - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: సంసార వృక్షమునకు పాపమే బీజము. సమస్త కర్మలును శాఖలు, ఇంద్రియము లే ఆకులు. మన్మథుడే పూవులు. దుఃఖములే ఫలములు. అట్టి వృక్షము నెక్కి క్రింద పడిపోయితిని. దయాళువగు ఓ నృసింహదేవా! చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.

10||శ్లో || సంసార దావద హనాతురభి కరోరు - జ్వాలావలీ భి రాతి దగ్ధ తనూరు హాస్య,
త్వత్పాద పద్మ సరసీం శరణాగతస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: సంసారమనెడి కారుచిచ్చు భయంకరములగు గొప్ప జ్వాలలతో నిండి పోయినది. నేను దాని నడుమ చిక్కుకొంటిని. ఆ మంటలు నా శరీర మందలి రోమములను కాల్చి వేయుచున్నవి. ఇక నా శరీరము కూడా దహింపబడును. కాన నిన్ను శరణు జొచ్చితిని. నీ పాద పద్మములనెడి సరస్సు తప్ప తాపము నేదియు చల్లార్చజాలదు. ఓ నృసింహ దేవా! కరుణించి చేయూత నొసగి, ఆ దావాగ్ని నుండి రక్షింపుము.

11||శ్లో|| సంసార సాగర నిమజ్జన ముహ్య మానం దీనం విలోకయ విభో! కరుణానిదే! మామ్|
ప్రహ్లాద భేద పరిహార పరావతారః లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: దయానిధి వైన ఓ ప్రభూ! ప్రహ్లాదుని దుఃఖము పోగొట్టుటకు నరహరి రూపమును ధరించిన దేవా! నేను సంసార సముద్రమున పడి, మునిగి పోయి, ఉక్కిరి బిక్కిరి యగుచున్నాను. దీనావస్థలో నున్న నన్నుద్ధరింపుము.

12||శ్లో|| సంసార యూద గజ సంహతి సింహదంష్ట్రా - భీత స్య దుష్ట మతి దైత్య భయంకరేణ |
ప్రాణ ప్రయాణ భవభీ తినివారణే న లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ నృసింహ మూర్తీ! నీ స్వరూపము దుష్ట బుద్ధులగు రాక్షసులకు మిగుల భయము కల్గించుచున్నది. సంసార సమూహములనెడి భయమును పోగొట్టునది. అట్టి రూపము ధరించి నాప్రాణములు కాపాడుమ

13||శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -
సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.

14||శ్లో|| బద్ద్వాగళే యమ భటా హుతర్జయన్తః కర్షంతి యత్ర భవపాశశ తైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో | లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: దయాళువైన ఓ పభూ! యమ భటులు పెక్కు పాశములతో నా మెడను బంధించి, బెదరించుచూ, ఏదారిలోనో నన్నీడ్చుకొని పోవుదురు. అపుడు పరులకు లొంగి, ఒంటరినై, దిగులుపడుచుండు నాకు దిక్కెవ్వరు? నీవే నాకు చేయూత నిచ్చి రక్షింపవలయును.

15||శ్లో|| అన్దస్యమే హృత వివేక మహాధన స్య చొ రైర్మ హ బలిభి రిన్ద్రియ నామ దే యై:
మోహన్ద కారకుహరే వినిపాతిత స్య లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ నరసింహ ప్రభూ! మహాబలవంతులగు ఇంద్రియములనెడి దొంగలు నా వివేక ధనమును దొంగిలించుకొని, అజ్ఞానమును అంధకారపు గుహలో త్రోసివేసిరి. కన్నులు కాన రాకున్నవి. నాకు చేయూత నిచ్చి, ఆ గుహ నుండి బయటకు తీసి నన్నుద్ధరింపుము.

16||శ్లో|| లక్ష్మీ పతే! కమలనాభ! సురేశ! విష్ణో ! యజ్ఞేశ ! యజ్ఞ! మధు సూదన! విశ్వరూప
బ్రహ్మణ్య ! కేశవ! జనార్ధన! వాసుదేవ! లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా: ఓ లక్ష్మీ పతీ ! నీవు పద్మమును నాభి యందు కలవాడవు. దేవతలకు నాయకుడవు. సర్వవ్యాపకుడవు. యజ్ఞములకు అధిపతివి. యజ్ఞ రూపుడవు. మధువను రాక్షసుని శిక్షించినవాడవు. విశ్వరూపుడవు. బ్రాహ్మణ ప్రియుడవు. బ్రహ్మ, రుద్రుల అంశలు కలవాడవు. జన్మము లేకుండ చేయువాడవు. వసుదేవునకు పుత్రుడవై అవతరించినవాడవు. ఓ నృసింహదేవా! నాకు చేయూత నిమ్ము.

17||శ్లో || ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక వ్యాసాది భాగవత పుంగవ వృన్నివాస|
భక్తా సురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా: ఓ దేవా ! నీవు ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, అనువారి హృదయములందు నివసించుచుందువు. భక్తులను, నీపై ప్రేమ కలవారిని కాపాడుటలో కల్పవృక్షము వంటివాడవు. ఓ నరసింహస్వామీ, నాకు చేయూత నొసగి కాపాడుము.

18||శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడు చేతితో అభయము నిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము.

19||శ్లో|| ఆద్యన్త శూన్య మజమవ్యయ మప్రమేయ - షూదిత్య రుద్రా నిగమాది నుత ప్రభావమ్|
త్వామ్భోది జాన్య మధులోలుప మత్త భ్రుజ్గం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ దేవా! నీవు మొదలు, తుది లేనివాడవు, పుటకయు, నాశనమును లేనివాడవు ఇంతవాడని ఊహింప సాధ్యము సనివాడవు. వేదములు, సూర్యుడు, రుద్రుడు, మున్నగువారు నీ ప్రభావమును కీరించుచుందురు. నీవు లక్ష్మీ దేవి ముఖ పద్మము నందలి మధువు నందు ఆసక్తి గల కొదమ తుమ్మెదవు. నరసింహ స్వరూపుడవగు నీవు నాకు చేయూత నొసగి రక్షింపుము.

20||శ్లో|| వారాహరామ నరసింహమాది కాన్తా - క్రీడా విలోల శూలి ప్రవన్ద్య
హంసాత్మకం పత్పరమ హంస విహార లీలం - లక్ష్మి నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||

తా: ఓ దేవా! నీవు వరాహ, వామన, నృసింహావ తారముల నెత్తినవాడవు. లక్ష్మీదేవి మున్నగు కాంతలతో క్రీడించుట యందు ఆసక్తి కలవాడవు. బ్రహ్మ, రుద్రాది దేవతలు నీ కేప్పుడునూ నమస్క రించుచుందురు. నీవు పరమహంస రూపుడవు. ఉత్తములగు యోగుల హృదయములందు విహరించుచుందువు. ఓ లక్ష్మీ నృసింహస్వామీ! నాకు చేయూత నిమ్ము.

21||శ్లో|| ప్రహ్లాద మానస సరో జవిహార భ్రుజ్గ - గాజ్గ తర జ్గ ధవళాజ్గ రామా స్థితాజ్గ |
శ్రుజ్గర సజ్గర సకిరీట ల సద్వరాజ్గ - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా: ఓ నరసింహదేవా! నీవు ప్రహ్లాదుని మనస్సనెడు కమలమున విహరించు తుమ్మెదయైన వాడవు. గంగాతరంగములవలె తెల్లని దేహము కలవాడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షః స్థలము కలవాడవు. శ్రుంగారము కలవాడవు. మేలైన కిరీటముతో ప్రకాశించు శిరస్శు కలవాడవు. నీవు నాకు చేయూత నిమ్ము.

22||శ్లో|| మాతా నృశింహశ్చ పితా నృసింహః - భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః |
విద్యా నృసింహొ ద్రవిణం నృసింహః - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా: నాకు నృసింహుడే తల్లి, నృసింహుడే తండ్రి, నృసింహుడే సోదరుడు, నృసింహుడే మిత్రుడు, నృసింహుడే విద్య, నృసింహుడే ధనము, నృసింహుడే ప్రభువు నాకు సమస్తమును ఆ నృసింహుడే !

23||శ్లో|| శ్రీ శజ్కరార్యర చితం సతతం మనుష్యః - స్సోత్రం పటేది హతు సర్వగుణ ప్రసన్నమ్ |
సద్యో విముక్త కలుషో మునివర్య గన్యో - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||

తా: సమస్త గుణములతో కూడి, శంకర భాగవత్పాదులచే రచింపబడిన యీ స్తోత్రమును ఎ మనుష్యుడు ఎల్లప్పుడునూ పటించుచుండునో అతడు వెంటనే పాపములు నశించి పరిశుద్ధుడై, మునులచే పొగడబడు విష్ణులోకమగు వైకుంటమును పొందును.

24||శ్లో|| యన్మాయార్జిత భవ ప్రచుర ప్రవాహా - మగ్నార్త మర్త్యనివ హేషు కరావలమ్బమ్,
లక్ష్మీ నృసింహ చరనాబ్జ మధువ్రతేనా - లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలమ్బమ్ ||

తా: మాయా ప్రభావమున అజ్ఞానమునందు పడి, పెక్కు జన్మములను పొందుచూ, బాధల ననుభవించుచూ మనుష్యులకు ఈ స్తోత్రము తరించుటకు చేయూత అయినది. దీనిని లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మములకు తుమ్మెద వంటి వారగు శ్రీ శంకరాచార్యులు రచించిరి.

25||శ్లో|| శ్రీమాన్న్రుసింహ విభవే గరుడ ధ్వజాయ - తాపత్ర యో పశామనాయ భావౌషదాయ |
త్రుష్ణారి వృశ్చిక జలాగ్నిభుజ జ్గరోగ - లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||

తా: ఓ లక్ష్మీ నరసింహస్వామీ ! నీవు సమస్త లోకములకు ప్రభువువు. గరుడధ్వజుడవు. తాపత్రయమును నశింపజేయువాడవు. సంసారములనెడి రోగములకు ఓషదము వంటివాడవు. ఆకలి దప్పులు, తేళ్ళు, అగ్ని, జలము, పాములు, రోగములు మున్నగు వానివలన కలుగు బాధలను నశింపజేయువాడవు. పాపములు హరించు వాడవు. గురువైన వాడవు. అట్టి నీకివే మా నమస్కారములు.

ఇతి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణమ్

Lord Lakshmi Narasimha Swamy at Sri Hari Vaikunta Kshetra, Bangalore.......

.••.¸•.••.¸•...••.¸•..••.¸•..••.¸•..••.¸•.••.¸•...••.¸•..••.¸•..••.¸•..••.¸•.••.¸•...••.¸•..••.¸•..••.¸•.

Sri Lakshmi Narasimha Karavalamba Stotram


Sri Lakshmi Narasimha Karavalamba Stotra by Adi Sankara Bhagawat Pada. Lakshmi Nrsimha Karavalamba Stotram, also known as Lakshmi Narasimha Karunarasa Stotram is a 17-verse Stotram in praise of Lakshmi Narasimha. The Stotram is so called because each of these verses ends with the same refrain “Lakshmi Narasimha, Mama Dehi Karavalambam” which means "Oh Lord Narasimha, please lend me your helping hand".

We have added the English Translation and Meaning of Lakshmi Narsimha Karavalamba stotram. The English Meaning is added after each stanza in italics. We are indebted to Mr P.R.Ramachander Sir, who have provided the English translation of the stotra.

Lakshmi Narasimha Karavalamba Stotram dedicated to the feet of Lord Lakshmi Nrsimha.

Sri Lakshmi Narasimha Karavalamba Stotram Lyrics - Lakshmi Nrsimha Prayer

Srimat Payonidhi Nikethana Chakra Pane,
Bhogeendra Bhoga Mani Rajitha Punya Moorthe,
Yogeesa Saswatha Saranya Bhabdhi Potha,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 1

Oh Great God Lakshmi Nrsimha,
Who lives in the ocean of milk,
Who holds the holy wheel as weapon,
Who wears the gems of the head,
Of Adhisesha as ornaments,
Who has the form of good and holy deeds,
Who is the permanent protection of sages,
And who is the boat which helps us cross,
This ocean of misery called life,
Please give me the protection of your hands.

Brahmendra, Rudra Arka Kireeta Koti,
Sangattithangri Kamala Mala Kanthi Kantha,
Lakshmi Lasath Kucha Saroruha Raja Hamsa,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 2

Oh Great God Lakshmi Nrsimha,
Whose feet is touched by the crowns,
Of Brahma, Indra, Shiva and Sun,
Whose shining feet adds to his effulgence,
And who is the royal swan playing,
Near the breasts of Goddess Lakshmi,
Please give me the protection of your hands.

Samsara Gora Gahane Charathe Murare,
Marogra Bheekara Mruga Pravardhithasya,
Aarthasya Mathsara Nidha Chain Peedithasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 3

Oh Great God Lakshmi Narsimha,
Oh Lord who killed the Asura called Mura,
I have been traveling in the dark forests of day to day life,
Where I have been terrified by the lion called desire,
And scorched by the heat called competition, and so,
Please give me the protection of your hands.

Samsara Koopam Adhi Ghora Magadha Moolam,
Samprapya Dukha Satha Sarpa Samakulasya,
Dheenasya Deva Krupana Padamagadasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 4

Oh Great God Lakshmi Narasimha,
I have reached the very dangerous and deep,
Bottom of the well of day to day life,
And also being troubled by hundreds,
Of miseries which are like serpents,
And am really miserable and have,
Reached the state of wretchedness and so,
Please give me the protection of your hands.

Samsara Sagara Vishala Karala Kala,
Nakra Graham Grasana Nigraha Vigrahasya,
Vyagrasya Raga Rasanormini Peedithasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 5

Oh Great God Lakshmi Nrsimha,
I have reached this wide unfathomable ocean of day to day life,
And I have been caught by black deadly,
Crocodiles called time which are killing me
And I am also afflicted by waves of passion,
And attachments to pleasures like taste and so,
Please give me the protection of your hands.

Samasra Vrukshamagha Bheeja Manantha Karma,
Sakha Satham Karana Pathramananga Pushpam,
Aroohasya Dukha Phalitham Pathatho Dayalo,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 6

Oh Great God Lakshmi Nrsimha,
I have climbed the tree of worldly life,
Which grew from the seed of great sin,
Which has hundreds of branches of past karmas,
Which has leaves which are parts of my body,
Which has flowers which are the result of Venus,
And which has fruits called sorrow,
But I am falling down from it fast and so,
Please give me the protection of your hands.

Samsara Sarpa Ghana Vakthra Bhyogra Theevra,
Damshtra Karala Visha Daghdha Vinashta Murthe,
Naagari Vahana Sudhabhdhi Nivasa Soure,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 7

Oh Great God Lakshmi Nrsimha,
Oh, Lord who rides on the enemy of snakes,
Oh, Lord who lives in the ocean of nectar,
The serpent of family life has opened,
Its fearful mouth with very dangerous,
Fangs filled with terrible venom,
Which has destroyed me and so,
Please give me the protection of your hands.

Samsara Dava Dahanathura Bheekaroru,
Jwala Valee Birathi Dhighdha Nooruhasya,
Thwat Pada Padma Sarasi Saranagathasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 8

Oh Great God Lakshmi Nrsimha,
I have been scarred badly by the fire of daily life,
And even every single hair of my body,
Has been singed by its fearful flames,
And I have taken refuge in the lake of your lotus feet, and so,
Please give me the protection of your hands.

Samsara Jala Pathithasya Jagan Nivasa,
Sarvendriyartha Badisartha Jashopamasya,
Proth Ganditha Prachoora Thaluka Masthakasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 9

Oh Great God Lakshmi Nrsimha,
I have been caught in this net of daily life,
And all my organs are caught in that web,
And the five senses which is the hook,
Tears apart my head from me, and so,
Please give me the protection of your hands.

Samsara Bheekara Kareeendra Karabhigatha,
Nishpishta Marmma Vapusha Sakalarthi Nasa,
Prana Prayana Bhava Bhhethi Samakulasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 10

Oh Great God Lakshmi Nrsimha,
I have been struck by the fearful king of elephants,
Which is the worldly illusion, and my vital parts,
Have been completely crushed, and I suffer,
From thoughts of life and death, and so,
Please give me the protection of your hands.

Andhasya Me Viveka Maha Danasya,
Chorai Prabho Bhalibhi Rindriya Nama Deyai,
Mohanda Koopa Kuhare Vinipathathasya,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 11

Oh Great God Lakshmi Nrsimha,
I have become blind because, the sense of discrimination,
Has been stolen from me by the thieves of ‘senses’,
And I who am blind, have fallen in to the deep well of passion, and so,
Please give me the protection of your hands.

Baddhvaa Gale Yamabhataa Bahutarjayantah,
Karshhanti Yatra Bhavapaashashatairyutam Maam.
Ekaakinam Paravasham Chakitam Dayaalo
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 12

Oh Great God Lakshmi Nrsimha,
I have been tied by the soldiers of the God of death,
By numerous ropes of worldly attachments,
And they are dragging me along by the noose around the neck,
And I am alone, tired and afraid, and so Oh merciful one,
Please give me the protection of your hands.

Lakshmi Pathe Kamala Nabha Suresa Vishno,
Vaikunta Krishna Madhu Soodhana Vishwaroopa,
Brahmanya Kesava Janardhana Chakrapane,
Devesa Dehi Krupanasya Karavalambam 13

Oh King of Devas,
Who is the Lord of Lakshmi, who has a lotus on his belly,
Who is Vishnu, the lord of all heavenly beings, who is Vaikunta,
Who is Krishna , who is the slayer of Madhu,
Who is one with lotus eyes, Who is the knower of Brahman,
Who is Kesava, Janardhana, Vasudeva,
Please give me the protection of your hands.

Ekena Chakramaparena Karena Shamkha-
Manyena Sindhutanyaaamavalambya Tishhthan,
Vaame Karena Varadaabhayapadmachihnam,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 14

Oh Great God Lakshmi Nrsimha,
Who holds Sudarshana, the holy wheel in one hand,
Who holds the conch in the other hand,
Who embraces the daughter of ocean by one hand,
And the fourth hand signifies protection and boons, and so,
Please give me the protection of your hands.

Samsaara Saagara Nimajjana Muhyamaanam
Diinam Vilokaya Vibho Karunaanidhe Maam,
Prahlaada Kheda Parihaara Paraavataara
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 15

Oh Great God Lakshmi Nrsimha,
I am drowned in the ocean of day to day life,
Please protect this poor one, oh, Lord, Oh treasure of compassion,
Just as you took a form to remove the sorrows of Prahlada, and so,
Please give me the protection of your hands.

Prahlaada Naarada Paraashara Pundariika-
Vyaasaadi Bhaagavata Pungavah Rinnivaasa ,
Bhaktaanurakta Paripaalana Paarijaata,
Lakshmi Nrsimha Mama Dehi Karavalambam 16

Oh Great God Lakshmi Nrsimha,
Who dwells in the hearts of great sages like Prahlada,
Narada, Parashara, Pundarika and Vyasa,
Who loves his devotees and is the wish giving tree,
That protects them, and so,
Please give me the protection of your hands.

Lakshminrisimha Charana Abja Madhuvratena
Stotram Kritam Shubhakaram Bhuvi Shankarena
Ye Tatpathanti Manujaa Haribhakti Yuktaa-
Ste Yaanti Tatpada Saroja Makhandaruupam 17

This prayer which blesses earth with good things,
Is composed by Sankara who is a bee,
Drinking deeply the honey from the lotus feet of Lakshmi Nrsimha,
And those humans who are blessed with devotion to Hari,
Will attain the lotus feet of the Brahman.

Sri Lakshmi Nrsimha Padarpanamasthu

Dedicated to the feet of Lord Lakshmi Nrsimha.

ఆది శంకరాచార్యుల జయంతి శుభాకాంక్షలు






ఆది శంకరాచర్య

బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పున రుద్ధరించడం. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగిం చి, వారిని ఒప్పించి, నెగ్గి, తన సిద్ధాంతాన్ని మెప్పించాడు.
ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహ స్ర నామాలకు భాష్యాలు రచించారు. తరువాత శంకరుని అనుస రించిన వారికీ, విభేదించిన వారికీ ఇవి మౌలికమయ్యాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠా లను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివా నందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్త మవుతు న్నాయి.

వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మా నికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పున రుద్ధరించడా నికి ఆది శంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంక రాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని బలీయ శక్తిగా మలచ గలిగారు.

బాల్యం
కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతు లైన ఆర్యమాంబ, శివగురువులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడి (త్రిచూర్‌ సమీపంలో)లో శంకరులు జన్మించారు.

శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించారు. శంకరులు ఏ సం థాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు అభ్యసించారు. బాలబ్రహ్మచారి గా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమిం చడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికా యలు వర్షింప జేస్తుంది.ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు శంక రులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. తల్లిని ఒప్పించి సన్యాసం స్వీకరంచారు.

గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులను ఆశ్రయించారు. ఒక ఛండాలుడి మాటలలో అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరునికి పరమశివుడు కర్తవ్యవబోధ చేశారు. అలా భారతదేశంలో శంకరాచార్య చేపట్టిన హిందూ ధర్మ పునరుద్ధరణ ఆరంభమైంది. మండన మిశ్రునితో తర్క గోష్ఠిలో పాల్గొని ఆయనను ఓడించారు. అలా ఎందరో ఉద్ధండ పండితులను ఓడించి అదె్వైత ప్రచారం చేశారు. నాలుగు పదుల వయస్సు రాకముందే పరమాత్మను చేరుకున్నారు. నేడు హిందూ సమాజం ఈ విధంగా ఉన్నదంటే అందుకు కారణం ఆదిశంకరాచార్యులనే చెప్పవచ్చు.

శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం



















శ్రీరామ
జయ హనుమాన్

జగద్గురు శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం
[ఈ శంకరాచార్య కృతమగు స్తోత్రము నిత్యము పఠించిన చిరకాలము ఐహిక సుఖములనుభవించి పరమున ముక్తినందగలరు.]

వీతాఖిల విషయేచ్ఛం – జాతానం దాశ్రుపులక మత్యచ్ఛమ్
సీతాపతి దూతాద్యం – వాతాత్మజ మధ్య భావయే హృద్యమ్ ||

తరుణారుణ ముఖకమలం – కరుణారసపూర పరితాపాంగం
సంజీవన మాశాసే – మంజుల మహిమాన మంజనా భాగ్యమ్ ||

శంబరవైరి శరాతిగ – మంబుజదల విపుల లోచనోదారం
కంబుగళ మనిలదిష్టం – బింబజ్వలితోష్ట మేక మవలంబే ||

దూరీకృత సీతార్తిః – ప్రకటీకృత రామవైభవ స్పూర్తిః
దారిత దశముఖకీర్తిః – పురతో మమ భాతు హనుమతో మూర్తి ||

వానర నికరాధ్యక్షం – దానవకుల కుముద రవికర సదృక్షం
దీనజనావన దీక్షం – పవన తపఃపాక పుంజ మద్రాక్షం ||

ఏత త్పవనసుతస్య – స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం
చిర మిహ నిఖిలాన్ భోగాన్ – భుక్త్వా శ్రీరామభక్తి భాగవతః ||

శుభం భూయాత్

శ్రీ నృసింహాష్టకం


౧::శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి
శ్రీధర మనోహర సటాపటల కాంత
పాలయ కృపాలయ భవాంబుధి-నిమగ్నం
దైత్యవరకాల నరసింహ నరసింహ 

౨::పాదకమలావనత పాతకి-జనానాం
పాతకదవానల పతత్రివర-కేతో
భావన పరాయణ భవార్తిహరయా మాం
పాహి కృపయైవ నరసింహ నరసింహ  

౩::తుంగనఖ-పంక్తి-దలితాసుర-వరాసృక్
పంక-నవకుంకుమ-విపంకిల-మహోరః 
పండితనిధాన-కమలాలయ నమస్తే
పంకజనిషణ్ణ నరసింహ నరసింహ 

౪::మౌలిషు విభూషణమివామర వరాణాం
యోగిహృదయేషు చ శిరస్సునిగమానామ్ 
రాజదరవింద-రుచిరం పదయుగం తే
దేహి మమ మూర్ధ్ని నరసింహ నరసింహ 

౫::వారిజవిలోచన మదంతిమ-దశాయాం
క్లేశ-వివశీకృత-సమస్త-కరణాయామ్ 
ఏహి రమయా సహ శరణ్య విహగానాం
నాథమధిరుహ్య నరసింహ నరసింహ 

౬::హాటక-కిరీట-వరహార-వనమాలా
ధారరశనా-మకరకుండల-మణీంద్రైః 
భూషితమశేష-నిలయం తవ వపుర్మే
చేతసి చకాస్తు నరసింహ నరసింహ 

౭::ఇందు రవి పావక విలోచన రమాయాః
మందిర మహాభుజ-లసద్వర-రథాంగ
సుందర చిరాయ రమతాం త్వయి మనో మే
నందిత సురేశ నరసింహ నరసింహ 

౮::మాధవ ముకుంద మధుసూదన మురారే
వామన నృసింహ శరణం భవ నతానామ్ 
కామద ఘృణిన్ నిఖిలకారణ నయేయం
కాలమమరేశ నరసింహ నరసింహ 

౯::అష్టకమిదం సకల-పాతక-భయఘ్నం
కామదం అశేష-దురితామయ-రిపుఘ్నమ్ 
యః పఠతి సంతతమశేష-నిలయం తే
గచ్ఛతి పదం స నరసింహ నరసింహ 

శ్రీమచ్చంకరాచార్య కృత శివమానస పూజ:

శ్రీమచ్చంకరాచార్య కృత శివమానస పూజ:

౧.రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం
జాతీచంపకబిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం!

౨.సౌవర్ణే మణిరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభా ఫలం పానకం
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు!

౩.ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగకాహళకలా గీతం చ నృత్యం తథా
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధాః ఏతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో!

౪.ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ రచనా నిద్రాసమాధి స్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవారాధనమ్!

౫.కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో!