Thursday, June 16, 2011

గంగావతరణం



















సగర పుత్రులకు స్వర్గ ప్రాప్తికై భగీరుథుడు గంగను భువికి రప్పించాడు. ఇది మనకు తెలిసిందే. కాని, అసలు ఏమి జరిగింది అన్న విషయం కొంత తెలుసుకుందాము.

శ్రీమద్వాల్మీకి రామాయణంలో బాలకాండ 38 - 44 సర్గలలో ఈ గంగావతరణాన్ని విశ్వామిత్ర-రామలక్ష్మణ సంవాదంలో వివరించారు. కాళిదాసు రఘువంశం కావ్యంలో రమణీయంగా, విపులంగా ఈ విషయాన్ని రచించారు. నేను ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరంలో (రెండవ భాష సంస్కృతం) రఘువంశంలోని ఈ అంశాన్ని చదువుకున్నాను. ఇటీవల రామాయణ పారాయణంలో మళ్లీ పఠించాను.

ఇక్ష్వాకు వంశంలో జన్మించిన సగరునికి ఇద్దరు భార్యలు - కేశిని, సుమతి. వీరికి సంతతి కలుగక, హిమాలయాలకు వెళ్లి భృగుప్రవర్శన మనే చోట తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి భృగు మహర్షి సగరుడి భార్యలలో ఒకరికి వంశాభివృద్ధి కలిగించే ఒక పుత్రుడు, ఇంకొకరికి అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాద ఫలంతో కేశినికి అసమంజుడు, సుమతికి అరవైవేలమంది సగర పుత్రులు జన్మిస్తారు. వీరిలో అసమంజుడు దుష్ట చేష్టలు చేస్తూ ఉంటే సగరుడు అతడిని రాజ్య బహిష్కారం చేస్తాడు. అసమంజుని కుమారుడు అంశుమానుడు యోగ్యుడు.

ఈ సమయంలో సగరుడు యాగం తలపెడతాడు. యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించి కపిల మహర్షి ఆశ్రమంలో దాచుతాడు. దీని వలన యాగం అసంపూర్ణంగా ఉంటుంది. అది తనకు అరిష్టమని గ్రహించిన సగరుడు తన అరవైవేలమంది పుత్రులను అశ్వాన్ని వెదకమని పంపిస్తాడు. భూనభోంతరాళములలో ఎక్కడ ఉన్నా వెదికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. సగర పుత్రులు భూమి అంతటా వెదికి, భూమిలో తవ్వి, సర్పలోకాన్ని వెదికి ఎక్కడ అశ్వం కనిపించక రసాతాలానికి వెళ్తారు. అన్ని దిక్కులు వెదికినా అశ్వం కనిపించదు. ఈశాన్య దిక్కులో శివస్థానంలో భూమిని తవ్వి వెదుకుతారు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో వారికి అశ్వం కనిపిస్తుంది. 'ఓరీ దుష్టుడా! నీవే మా తండ్రి గారి యాగాశ్వాన్నిఅపహరించావు' అని ఆ మహర్షిని దూషిస్తారు. అప్పుడు ఆ మహర్షి ఆగ్రహంతో వారిని ఒక్క చూపుతో భస్మీపటలం చేస్తాడు. ఆ మహర్షి క్రోధాగ్నికి భస్మపు కుప్పగా మారుతారు సగర పుత్రులు.

ఎన్నాళ్ళైనా పుత్రులు తిరిగి రాకపోయేసరికి సగరుడు మనుమడైన అంశుమానుడిని యాగాశ్వాన్ని, పిన తండ్రులను వెదకమని పంపిస్తాడు. కపిల మహర్షి ఆశ్రమము వద్దకు వచ్చి వారు దగ్ధమై ఉండటం చూసి దుఃఖితుడవుతాడు. వారికి ఉత్తరక్రియలు జరుపుదామని నిశ్చయిస్తాడు. కానీ, ఆ ప్రాంతంలో ఎక్కడ నీరు అనేది కనిపించదు. అప్పుడు సగర పుత్రుల మేనమామ (సుమతి సోదరుడు) అయిన గరుత్మంతుడు ప్రత్యక్షమై అంశుమానుడితో - 'నాయనా, ఇలా దగ్ధమైన నీ పిన తండ్రులకు స్వర్గ ప్రాప్తి జరగాలంటే మామూలు జలం చాలదు. దేవలోకంలో ఉన్న గంగానది వచ్చి వీరి భస్మంపై ప్రవహిస్తే వీరికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది' - అని చెప్తాడు. అంశుమానుడు యాగాశ్వాన్ని తీసుకొని సగరుడి దగ్గరకు తిరిగి వచ్చి జరిగింది వివరిస్తాడు. సగరుడు యాగాన్ని పరిసమాప్తి చేస్తాడు.

సగరుడు గంగను భువికి ఎలా తీసుకురావాలి అన్న దానిమీద నిర్ణయం తీసుకోలేకపోతాడు. తరువాత ముప్ఫై వేల సంవత్సరాలు పాలించి తనువు చాలిస్తాడు. అంశుమానుడు రాజ్యం పాలిస్తాడు. అతనికి దిలీపుడు అని ఒక సుపుత్రుడు జన్మిస్తాడు. అంశుమానుడు కొడుకుకి రాజ్యభారం అప్పగించి తపస్సులకై హిమాలయాలకు వెళతాడు. అంశుమానుడు ముప్ఫై రెండువేల ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత స్వర్గ ప్రాప్తి పొందుతాడు కాని గంగను భూమి మీదకు తీసుకు రాలేకపోతాడు.

దిలీపుడు ధర్మబద్ధంగా పాలిస్తాడు. కానీ, ఆయన కూడా గంగను ఎలా తీసుకువచ్చి సగర పుత్రులకు స్వర్గ ప్రాప్తి కలిగించాలి అన్న సంకల్పం,నిశ్చయం చేసుకోలేకపోతాడు. దీని గురించి విచారపడతాడు దిలీపుడు. ఆ విచారంలోనే అతడు ప్రాణం విడుస్తాడు. దిలీపుడికి సర్వ లక్షణ సంపన్నుడైన కుమారుడు కలుగుతాడు. అతడే భగీరథుడు.

భగీరథుడు పుత్రసంతానం లేక విచారంలో ఉంటాడు. అప్పుడు ఆ మహారాజు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, తన పిత్రుదేవతలైన సగర పుత్రుల స్వర్గ ప్రాప్తికి, తనకు పుత్ర సంతాన ప్రాప్తి కోసం ఘోర తపస్సు చేస్తాడు. కొన్ని వేల ఏళ్ళు తపమొనరించిన తర్వాత బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై అతని తపస్సుకి మెచ్చి గంగ ప్రవాహం ద్వారా సాగరపుత్రులకు స్వర్గ ప్రాప్తి, భగీరథుడుకి పుత్రప్రాప్తి వరాలను ఇస్తాడు. కానీ, గంగా ప్రవాహాన్ని తట్టుకొనే శక్తి భూమికి లేదని, ఆ పనికి ఒక్క శంకరుడే సమర్థుడని చెప్పి అంతర్ధానం అవుతాడు బ్రహ్మ.

గంగావతరణం కోసం భగీరథుడు ఏడాది శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై గంగను తన శిరస్సులో దాల్చటానికి ఒప్పుకుంటాడు. దేవతలా ఆశీర్వాదంతో గంగావతరణం మొదలవుతుంది.

గంగ పొగరుతో శివున్ని ముంచి పాతాళానికి వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంది. శివుడి క్రోధంతో ఆమె మదాన్ని అణిచి తన జటా ఝూటాల్లో ఆమెను బంధిస్తాడు. గంగ ఆ బంధనంలోంచి బయట పడటానికి తీవ్ర ప్రయత్నం చేసి విఫలమవుతుంది. అలా బందీ అయిన గంగను భువి మీదికి వదలమని భగీరథుడు మళ్ళీ శివుని మెప్పించ తపస్సు చేస్తాడు. ఆ సదాశివుడు సంతుష్టుడై గంగను భూమి మీదకు విడుస్తాడు.




















అలా శివుని జటా ఝూటాల్లోంచి గంగానది హిమాలయాలలోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని ఏడు పాయలుగా తాకుతుంది - తూర్పు దిక్కుగా హ్లాదిని, పావని, నళిని నదులుగా, పశ్చిమ దిక్కుగా సుచక్షు, సీత, సింధు నదులుగా పారుతుంది.

గంగా ప్రవాహమున సాగి వచ్చిన చేపలు, తాబేళ్లు, మొసళ్ళు మరియు ఇతర జంతువులతో భూమి మిక్కిలి శోబిల్లెను. దివినుండి భువికి దిగి వచ్చిన గంగను దేవతులు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు కన్నుల పండువగా, సంభ్రమాశ్చర్యములతో చూశారు. గంగా ప్రవాహము కొన్ని చోట్ల అతివేగంగా, కొన్ని చోట్ల వంకరగా, కొన్ని చోట్ల విశాలముగా, కొన్ని చోట్ల దూకుతూ, తుళ్ళి పడుతూ, ఇంకొక చోట ప్రశాంతముగా సాగింది. దేవతలు, ఋషులు మున్నగు వారు "ఈ జలము శివుని శిరస్సునుంది పడింది, కనుక అతి పవిత్రమైనది" అని తలచుకుంటూ, ఆ నీటిని తమ శిరస్సుపై చల్లుకొని ఆచమనం చేశారు. శాపం వలన దివినుండి భువికి చేరినవారు ఈ గంగలో మునిగి పాపరాహితులై, తిరిగి తమ లోకాలకు వెళ్లారు. పవిత్ర గంగానదీ స్నానముచే జనాలు అలసటలు తొలగి సంతోషించారు.


ఏడవ పాయ భగీరథుడి రథాన్ని దక్షిణ దిక్కుగా అనుసరించి, జహ్ను మహర్షి ఆశ్రమాన్ని, యజ్ఞ వాటికను ముంచెత్తుతుంది. ఆ మహర్షి ఆగ్రహం చెంది ఆ నదిని మింగేస్తాడు. దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు ఆ మహర్షి పాదాలపై పడి గంగను వదలమని ప్రార్థిస్తారు. అప్పుడు శాంతించిన జహ్ను మహర్షి తన చెవి ద్వారా గంగను వదులుతాడు. అలా జహ్ను మహర్షి కుమార్తెయై గంగ జాహ్నవి అనే నామంతో కూడా పిలవబడింది. దక్షిణ దిశగా ప్రవహించి సాగరంలో కలిసి, పాతాళానికి వెళ్లి సగర పుత్రులను పావనం చేస్తుంది గంగ.

అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై భగీరథుడిని ప్రశంసించి, సాగరపుత్రులకు స్వర్గాలోకాలను అనుగ్రహిస్తారు. పిత్రుదేవతలకోసం అంతటి కష్టతరమైన కార్యం సాధించిన భగీరథుడికి ఎన్నో వరాలు ఇస్తారు. గంగావతరణానికి కారకుడైన అతడిని భువిలో గంగకు తండ్రిగా శ్లాఘిస్తారు. అప్పటినుంచి గంగ భాగీరథిగా ప్రసిద్ధి చెందింది.

గంగ మూడు లోకాలు (దివి, భువి, పాతాళం), మూడు దిక్కులు (తూర్పు, పడమర, దక్షిణ) పారింది కనుక త్రిపథగ గా పేరొందింది. అలా అవతరించిన గంగా నది ఈ అవనిలో అత్యంత పావనమైన నదిగా విశ్వ విఖ్యాతి పొందింది.

సీతా కల్యాణం చిత్రంలో బాపు, రమణలు ఈ ఘట్టాన్ని అందంగా, సవివరంగా తెరకు ఎక్కించారు. సదాశివ బ్రహ్మేన్ద్రులు మంచి కీర్తన రచించారు ఈ గంగా నదిపై.

తుంగ తరంగే గంగే జయ తుంగ తురంగే గంగే
దూరీకృత జన పాప సమూహే పూరిత కచ్ఛప పృచ్ఛగ్రాహే |తుంగ|
పరమహంస గురు భణిత చరిత్రే బ్రహ్మా విష్ణు శంకర నుతి పాత్రే |తుంగ|

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

అంతర్యామి - అంతయును నీవే
నుండి సేకరించినది :)

వీరిచే పోస్ట్ చెయ్యబడింది Prasad Akkiraju వద్ద

గోవు పూజ పాట














గోవు అడుగులయందు అష్టైశ్వర్యములుండును.
గిట్టల మధ్యన గంధర్వులుందురు.
పాదాలయందు చతుర్వేదములుండు
పిక్కలయండు గుడి గంటలుండు
గిట్టల చివర పన్నగులుందురు
గిట్టల ప్రక్కలో అప్సరసలుందురు
తొడలయందు సర్వలోక తీర్ధములుండు
పొదుగున పుండరీకాక్షుడు ఉండును
చనులయందు సాలగ్రామాలుండును
పితుకుల యందు సప్త సముద్రములుండు
నాభియందున శ్రీకమలముండు
కడుపున భూదేవి స్థిరముగానుండు
తోకను సోముడు నివసించుచుండును
తోకయందలి రోమాల సూర్యరశ్మి యుండు
ఉర మధ్యమున ఋషులు నివసింతురు.
చర్మమున సకల శుభములు వర్ధిల్లు
శరీరములోని రోమాల సకల దేవతలు ఉండు
మాంసమున మాధవుడు నిలయమై ఉండు
ఎముకల యందు బ్రహ్మ నివసించు
పృష్ట భాగమున ఏకాదశ రుద్రులు ఉండెదరు
హృదయమున సాధ్వులు వసించుచుందురు
మూపురమున చుక్కలు మెరయుచునుందురు
మెడను ఇంద్రుడు నివసించుచుండు
పెదవులు వైకుంట ద్వారములగును
నాలుకయండు నారాయణుడుండు
దవడలయందు ధర్మదేవత యుండు
నోరున లోకేశము నిలయమై యుండు
హుంకారమున సరస్వతీ దేవి నివసించు
ముక్కున శీతాచల పుత్రి యుండు
ముక్కు కాడన కుమార స్వామి వర్ధిల్లు
గడ్డము కైలాస శిఖరమై యుండు
నుదురున పరమేశ్వరుడు నివసించును
నేత్రముల సూర్య చంద్రులు మెరయు
కర్ణముల అశ్వనీ దేవతలు వెలయు
కొమ్ములు గోవర్ధన పర్వతములగును
కొమ్ముల కొసలు సర్వ తీర్ధములగును
గోవు పాలయందు సరస్వతీ నదియు,
పంచితమున గంగానదియు,
గోమయమున శ్రీమహాలక్ష్మియును
ఆజ్యమున అగ్నిదేవుడును నివసించును

గోవుపాట పాడిన ఫలితమెయ్యది యనగా
వేకువన పాడితే కోటి వేల నదులలో స్నానాలు చేసిన ఫలితం
ప్రొద్దున్నే పాడితే కోటి వేల బ్రహ్మ కలశాల నోము నోచిన ఫలితం
మధ్యాహ్నమున పాడితే కోటి వేల బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం
సంధ్య వేళ పాడితే కోటి దేవాలయములలో దీపారాధన చేసిన ఫలితం
అమావాస్య నాడు పాడితే ఆరునెలల పాపం,
పౌర్ణమి నాడు పాడితే పది నెలల పాపం పోవును
గోవును వర్ణించిన ఇంతికి సకల శుభములు, ఇహ పర సుఖములు కలుగును.

Sunday, May 15, 2011

శ్రీషిర్దీ సాయిబాబాను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి



శ్రీషిర్దీ సాయిబాబాను ప్రత్యక్షంగా చూసినవాళ్ళలో జీవించి ఉన్న ఏకైక వ్యక్తి గీతాబాయి గధియా



మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా రహతా లో నివసిస్తున్న గీతాబాయి గధియా గారి  వయస్సు ఇప్పుడు 105 సంవత్సరాలు. శ్రీషిర్దీ  సాయిబాబాను స్వయంగా చూసినవాళ్ళలో ఆవిడ ఒక్కరే యిప్పటికీ జీవించి ఉన్నారు.  ఆవిడ  తాను ప్రత్యక్షంగా  షిర్డీ  సాయిబాబాను చూశారు.   ఆవిడ ఆయన పాదాలను స్పృశించారు.  బాబాగారు తమ దివ్య హస్తాలతో యిచ్చిన వాటిని ఆవిడ స్వీకరించారు.  మనం సాయిబాబా  విగ్రహాన్ని చూస్తాము.  గీతాబాయి గారు సాయిబాబాను ప్రత్యక్షంగా చూశారు.  మనము సాయిబాబా పాదాలవద్ద మన కానుకలను సమర్పిస్తాము.  గీతాబాయి గారు నేరుగా సాయిబాబాగారి దివ్యహస్తాలకు అందించారు.  మనం సాయిబాబా గురించి విన్నాము.  గీతాబాయి గారు సాయిబాబా స్వయంగా మాట్లాడటం విన్నారు.  మనకు ఈ మధ్యనే సాయిబాబా గురించి తెలిసింది.  గీతాబాయిగారికి 95 సంవత్సరాల క్రితం నుండే  సాయిబాబా గురించి తెలుసు.  మనకు బాబా సమాధి దర్శన భాగ్యం కలిగింది.  గీతాబాయిగారు సాయిబాబాగారి దివ్య చరణకమలాలను స్వయంగా స్పృశించారు.  మనం సాయి భజనలు చాలా రచించాము.  గీతాబాయిగారు సాయిబాబా పాడటం స్వయంగా విన్నారు.  మనం షిరిడీకి నడచి వెడతాము.  గీతాబాయిగారిని ఆవిడ తండ్రి షిరిడీకి ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు.  మనం బాబాకు నైవేద్యం సమర్పిస్తాము.  గీతాబాయి గారి చిన్ని చేతులు బాబాగారిచ్చిన కానుకలతో నిండిపోయాయి.  మనం బాబాను పిలుస్తాము.  కాని, గీతాబాయిగారిని సాయిబాబా తానే స్వయంగా పిలిచారు.  సాయిబాబాగారిని చూసినప్పుడు ఆవిడ వయసు కేవలం 10 సంవత్సరాలు. ఆరోజుల్లో సాయిబాబాతో తన చిన్నతనంలో గడిపిన రోజులు, ప్రతి సంఘటన ఆవిడకి బాగా గుర్తున్నాయి.  ప్రతివిషయం బాగా గుర్తుకు తెచ్చుకోగలరు.  10 సంవత్సరాల క్రితం ఆవిడకు 3 సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది.  గీతాబాయిగారు యిప్పుడు ఏడవతరానికి సంబంధించిన వారసులతో ఉన్నారు.  ఆవిడ డాక్టర్ల మీద గాని, మందుల మీద గాని ఆధారపడకుండా యితకుముందు లాగే మంచి ఆరోగ్యంతో ఉన్నారు.  ఇప్పటికీ ఆవిడ మంచి శరీర సౌష్టవంతో ఆరోగ్యంగా ఉండటం చూసిన పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఆమెను ఎంతో గౌరవిస్తారు.  ఆవిడ దృష్టి యిప్పటికీ చక్కగా ఉంది.  మంచి వినికిడి శక్తి వుంది.  ఆవిడ చక్కగా మాట్లాడగలరు.  తాను స్వయంగా వ్రాసిన సాయి భజనలను పాడగలరు.  ఆమె ప్రతీరోజు ఉదయం 3 గంటలకే లేచి, ఎవరి సహాయం లేకుండా తన పనులను తానే స్వయంగా చేసుకొంటారు.  తేలికపాటి ఆహారం, డ్రై ఫ్రూట్స్, స్వచ్చమైన వెన్న తీసుకుంటారు. ఆమె బాబాగారు వంట చేసే కుండని, గోధుమలను విసిరే తిరగలిని, ఎప్పుడు జ్వలిస్తూ ఉండే ధునిని చూశారు.  బాబా తన దుస్తులను తానే స్వయంగా ఉతుకుకొని వాటిని వాడాలో ఆరవేయడం చూశారు.  ఆవిడ మేనత్త (తండ్రి సోదరి) ద్వారకామాయి కుడిప్రక్కనే షిరిడీలో ఉండేవారు.  గీతాబాయిగారు 10 సంవత్సరాల వయసులో ఆమె మేనత్త యింటికి వెళ్ళి అక్కడ గడుపుతూ ఉండేవారు. ఆరోజుల్లో ఆడపిల్లలను యింటిలోనుండి బయటకు వెళ్లనిచ్చేవారు కాదు.  ఆవిధంగానే గీతాబాయిగారి విషయంలో కూడా.  కాని, ఎప్పుడయినా బయటకు వెళ్ళినపుడు అవిడ ద్వారకామాయికి వెళ్ళి సాయిబాబాతో ఆడుకునేది.  బాబాగారు ఫొటోలో ఉన్నట్లుగానే ఎలా దుస్తులు ధరించేవారో ఆవిడ వర్ణించి చెపుతూ ఉంటారు. ఇంక్కా ఆవిడ వర్ణించి చెప్పిన సంఘటనలు.   బాబా ఆవిడను చూడగానే నీకేమయినా డబ్బు కావాలా అని అడిగేవారు.  బాబా రహతా వెళ్ళేటపుడు కదలుతున్న బస్సులోకి కూడా ఎక్కేవారు.  అలాగే బస్సు వెడుతున్నపుడు కూడా బస్సులోనించి దిగేవారు.  రహతా వెళ్ళినపుడెల్లా అక్కడి దుకాణుదారులు తమంత తామే బాబాకు కానుకలు సమర్పించుకొనేవారు.  బాబా షిరిడీకి తిరిగి వచ్చిన తరువాత వాటినన్నిటినీ పంచిపెట్టేస్తూ ఉండేవారు. అలా పంచిపెట్టబడినవాటిలో బాబానుంచి ఆవిడకు డ్రైఫ్రూట్స్ లభించాయి. బాబాగారినించి స్వయంగా డ్రైఫ్రూట్స్ స్వీకరించిన గీతాబాయి గారు ఎంతో అదృష్టవంతురాలు. ఆరోజుల్లో పిల్లల మీద ఎన్నో ఆంక్షలు ఉండేవి.  పిల్లలను ఎక్కడా బయట తిరగనిచ్చేవారు కాదు.  ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు.  బాబాగారు చేసిన అద్భుతాలేమీ కూడా ఆమెకు చూసే అదృష్టం కలగలేదు.  బాబావారిని దర్శించడానికి ఎంత పెద్ద గుంపు ఉండేదో కూడా ఆమెకు తెలీదు.  కాని, బాబా ఊదీ ఎంత అమోఘమైందో ఆమె ధృవపరుస్తూ చెప్పారు.  దానికి తానే సాక్ష్యమని చెప్పారు.  బాబా చేసే అద్భుతాలకు తాను ఆయనని "అధ్బుతాలను చేసే బాబా" అని అనేదానినని చెప్పారు. చిన్నతనం వల్ల అప్పట్లో ,  బాబా మహాసమాధి చెందేవరకు వాస్తవానికి సాయిబాబాగారి ఔన్నత్యం గురించి తెలియదని చెప్పారు .  ఆతరువాతే అందరూ ఆయన భగవంతుడని తెలుసుకొన్నారు.    

శ్రీ మహా సరస్వతి మూల మంత్రం-- Sri maha Saraswati Moola Mantra




































ఓం హ్రీం హ్ర్సైం హ్రీం ఓం ఐం థీం క్లీం సౌః సరస్వత్య్తే స్వాహాః ||

శ్రీ మహా సరస్వతి యంత్రమును అర్చించు వారు యంత్రమును రాగి రేకు పై కాని కాగితముపై కాని వ్రాసి పటము కట్టించి యథా శక్తి గా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్న గొప్ప గద్య పద్య రచన వాక్సుద్ధి , విద్య ప్రాప్తి , మేథా ధారణా శక్తి తప్పక కలుగును.

శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ కాల మాన సంకీర్తణాధికముగా త్రి న్యాస పూర్వకముగా , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.

ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి మంత్ర యంత్రములు పని సాధన లందు అనంత ఫల సాధకము లగును.

-: శ్రీ సరస్వతీ గాయత్రి :-

|| వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యైచ ధీమహితన్నోవాణీః ప్రచోదయాత్.//

Thursday, May 5, 2011

శ్రీ హనుమన్నమస్కారః
























హనుమన్నమస్కారః

1}గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్
రామాయణమహామాలారత్నం వందేజ్నిలాత్మజమ్

2}అంజనానందనంవీరం జానకీశోకనాశనమ్
కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్

3}మహావ్యాకరణాంభోధిమంథమానసమందరమ్
కవయంతం రామకీర్త్యా హనుమంతముపాస్మహే

4}ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యః శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయమ్

5}మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి

6}ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయవిగ్రహమ్
పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనమ్

7}యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
బాష్పవారిపరిపూర్ణలోచనం మారుతిర్నమత రాక్షసాంతకమ్

!!!!!!!! hanumannamaskaara@h !!!!!!!

1}gOshpadeekRtavaareeSaM maSakeekRtaraakshasam^
raamaayaNamahaamaalaaratnaM vaMdaejnilaatmajam^

2}aMjanaanaMdanaMveeraM jaanakeeSOkanaaSanam^
kapeeSamakshahaMtaaraM vaMdae laMkaabhayaMkaram^

3}mahaavyaakaraNaaMbhOdhimaMthamaanasamaMdaram^
kavayaMtaM raamakeertyaa hanumaMtamupaasmahae

4}ullaMghya siMdhO@h salilaM saleelaM ya@h SOkavahniM janakaatmajaayaa@h
aadaaya taenaiva dadaaha laMkaaM namaami taM praaMjaliraaMjanaeyam^

5}manOjavaM maarutatulyavaegaM jitaeMdriyaM buddhimataaM varishTham^
vaataatmajaM vaanarayoothamukhyaM SreeraamadootaM Sirasaa namaami

6}aaMjanaeyamatipaaTalaananaM kaaMchanaadrikamaneeyavigraham^
paarijaatatarumoolavaasinaM bhaavayaami pavamaananaMdanam^

7}yatra yatra raghunaathakeertanaM tatra tatra kRtamastakaaMjalim^
baashpavaariparipoorNalOchanaM maarutirnamata raakshasaaMtakam^

Monday, May 2, 2011

శ్రీ సుదర్శనషట్కం
















శ్రీ సుదర్శనషట్కం

1}సహస్రాదిత్యసంకాశం సహస్రవదనం పరమ్
సహస్రదోస్సహస్రారం ప్రపద్యేజ్హం సుదర్శనమ్

2}హసంతం హారకేయూర మకుటాంగదభూషణైః
శోభనైర్భూషితతనుం ప్రపద్యేజ్హం సుదర్శనమ్

3}స్రాకారసహితం మంత్రం వదనం శత్రునిగ్రహమ్
సర్వరోగప్రశమనం ప్రపద్యేజ్హం సుదర్శనమ్

4}రణత్కింకిణిజాలేన రాక్షసఘ్నం మహాద్భుతం
వ్యుప్తకేశం విరూపాక్షం ప్రపద్యేజ్హం సుదర్శనమ్

5}హుంకారభైరవం భీమం ప్రణాతార్తిహరం ప్రభుం
సర్వపాపప్రశమనం ప్రపద్యేజ్హం సుదర్శనమ్

6}ఫట్కారాస్తమనిర్దేశ్య దివ్యమంత్రేణసంయుతం
శివం ప్రసన్నవదనం ప్రపద్యేజ్హం సుదర్శనమ్

7}ఏతైష్షడ్భిః స్తుతో దేవః ప్రసన్నః శ్రీసుదర్శనః
రక్షాం కరోతి సర్వాత్మా సర్వత్ర విజయీ భవేత్

SreesudarSanashaTkaM

1}sahasraadityasaMkaaSaM sahasravadanaM param^
sahasradOssahasraaraM prapadyaejhaM sudarSanam^

2}hasaMtaM haarakaeyoora makuTaaMgadabhooshaNai@h
SObhanairbhooshitatanuM prapadyaejhaM sudarSanam^

3}sraakaarasahitaM maMtraM vadanaM Satrunigraham^
sarvarOgapraSamanaM prapadyaejhaM sudarSanam^

4}raNatkiMkiNijaalaena raakshasaghnaM mahaadbhutaM
vyuptakaeSaM viroopaakshaM prapadyaejhaM sudarSanam^

5}huMkaarabhairavaM bheemaM praNaataartiharaM prabhuM
sarvapaapapraSamanaM prapadyaejhaM sudarSanam^

6}phaTkaaraastamanirdaeSya divyamaMtraeNasaMyutaM
SivaM prasannavadanaM prapadyaejhaM sudarSanam^

7}aetaishshaDbhi@h stutO daeva@h prasanna@h SreesudarSana@h
rakshaaM karOti sarvaatmaa sarvatra vijayee bhavaet^

Wednesday, April 27, 2011

సంతాన గోపాల స్తోత్రమ్























సంతాన గోపాల స్తోత్రమ్

ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

ఓం నమో భగవతే వాసుదేవాయ

సంతానగోపాలస్తోత్రం

1} శ్రీశం కమలపత్రాక్షం దేవకీనన్దనం హరిమ్
సుతసంప్రాప్తయే కృష్ణం నమామి మధుసూదనమ్

2} నమామ్యహం వాసుదేవం సుతసంప్రాప్తయే హరిమ్
యశోదాఙ్కగతం బాలం గోపాలం నన్దనన్దనమ్

3} అస్మాకం పుత్రలాభాయ గోవిన్దం మునివన్దితమ్
నమామ్యహం వాసుదేవం దేవకీనన్దనం సదా

4} గోపాలం డిమ్భకం వన్దే కమలాపతిమచ్యుతమ్
పుత్రసంప్రాప్తయే కృష్ణం నమామి యదుపుఙ్గవమ్

5} పుత్రకామేష్టిఫలదం కఞ్జాక్షం కమలాపతిమ్
దేవకీనన్దనం వన్దే సుతసమ్ప్రాప్తయే మమ

6} పద్మాపతే పద్మనేత్రే పద్మనాభ జనార్దన
దేహి మే తనయం శ్రీశ వాసుదేవ జగత్పతే

7} యశోదాఙ్కగతం బాలం గోవిన్దం మునివన్దితమ్
అస్మాకం పుత్ర లాభాయ నమామి శ్రీశమచ్యుతమ్

8} శ్రీపతే దేవదేవేశ దీనార్తిర్హరణాచ్యుత
గోవిన్ద మే సుతం దేహి నమామి త్వాం జనార్దన

9} భక్తకామద గోవిన్ద భక్తం రక్ష శుభప్రద
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో

10} రుక్మిణీనాథ సర్వేశ దేహి మే తనయం సదా
భక్తమన్దార పద్మాక్ష త్వామహం శరణం గతః

11} దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

12} వాసుదేవ జగద్వన్ద్య శ్రీపతే పురుషోత్తమ
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

13} కఞ్జాక్ష కమలానాథ పరకారుణికోత్తమ
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

14} లక్ష్మీపతే పద్మనాభ ముకున్ద మునివన్దిత
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

15} కార్యకారణరూపాయ వాసుదేవాయ తే సదా
నమామి పుత్రలాభార్థ సుఖదాయ బుధాయ తే

16} రాజీవనేత్ర శ్రీరామ రావణారే హరే కవే
తుభ్యం నమామి దేవేశ తనయం దేహి మే హరే

17} అస్మాకం పుత్రలాభాయ భజామి త్వాం జగత్పతే
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ రమాపతే

18} శ్రీమానినీమానచోర గోపీవస్త్రాపహారక
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే

19} అస్మాకం పుత్రసంప్రాప్తిం కురుష్వ యదునన్దన
రమాపతే వాసుదేవ ముకున్ద మునివన్దిత

20} వాసుదేవ సుతం దేహి తనయం దేహి మాధవ
పుత్రం మే దేహి శ్రీకృష్ణ వత్సం దేహి మహాప్రభో

21} డిమ్భకం దేహి శ్రీకృష్ణ ఆత్మజం దేహి రాఘవ
భక్తమన్దార మే దేహి తనయం నన్దనన్దన

22} నన్దనం దేహి మే కృష్ణ వాసుదేవ జగత్పతే
కమలనాథ గోవిన్ద ముకున్ద మునివన్దిత

23} అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
సుతం దేహి శ్రియం దేహి శ్రియం పుత్రం ప్రదేహి మే

24} యశోదాస్తన్యపానజ్ఞం పిబన్తం యదునన్దనం
వన్దేహం పుత్రలాభార్థం కపిలాక్షం హరిం సదా

25} నన్దనన్దన దేవేశ నన్దనం దేహి మే ప్రభో
రమాపతే వాసుదేవ శ్రియం పుత్రం జగత్పతే

26} పుత్రం శ్రియం శ్రియం పుత్రం పుత్రం మే దేహి మాధవ
అస్మాకం దీనవాక్యస్య అవధారయ శ్రీపతే

27} గోపాల డిమ్భ గోవిన్ద వాసుదేవ రమాపతే
అస్మాకం డిమ్భకం దేహి శ్రియం దేహి జగత్పతే

28} మద్వాఞ్ఛితఫలం దేహి దేవకీనన్దనాచ్యుత
మమ పుత్రార్థితం ధన్యం కురుష్వ యదునన్దన

29} యాచేహం త్వాం శ్రియం పుత్రం దేహి మే పుత్రసంపదమ్
భక్తచిన్తామణే రామ కల్పవృక్ష మహాప్రభో

30}ఆత్మజం నన్దనం పుత్రం కుమారం డిమ్భకం సుతమ్
అర్భకం తనయం దేహి సదా మే రఘునన్దన

31} వన్దే సన్తానగోపాలం మాధవం భక్తకామదమ్
అస్మాకం పుత్రసంప్రాప్త్యై సదా గోవిన్దమచ్యుతమ్

32} ఓంకారయుక్తం గోపాలం శ్రీయుక్తం యదునన్దనమ్
క్లీంయుక్తం దేవకీపుత్రం నమామి యదునాయకమ్

33} వాసుదేవ ముకున్దేశ గోవిన్ద మాధవాచ్యుత
దేహి మే తనయం కృష్ణ రమానాథ మహాప్రభో

34} రాజీవనేత్ర గోవిన్ద కపిలాక్ష హరే ప్రభో
సమస్తకామ్యవరద దేహి మే తనయం సదా

35} అబ్జపద్మనిభం పద్మవృన్దరూప జగత్పతే
దేహి మే వరసత్పుత్రం రమానాయక మాధవ

36} నన్దపాల ధరాపాల గోవిన్ద యదునన్దన
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో

37} దాసమన్దార గోవిన్ద ముకున్ద మాధవాచ్యుత
గోపాల పుణ్డరీకాక్ష దేహి మే తనయం శ్రియమ్

38} యదునాయక పద్మేశ నన్దగోపవధూసుత
దేహి మే తనయం కృష్ణ శ్రీధర ప్రాణనాయక

39} అస్మాకం వాఞ్ఛితం దేహి దేహి పుత్రం రమాపతే
భగవన్ కృష్ణ సర్వేశ వాసుదేవ జగత్పతే

40} రమాహృదయసంభారసత్యభామామనః ప్రియ
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో

41} చన్ద్రసూర్యాక్ష గోవిన్ద పుణ్డరీకాక్ష మాధవ
అస్మాకం భాగ్యసత్పుత్రం దేహి దేవ జగత్పతే

42} కారుణ్యరూప పద్మాక్ష పద్మనాభసమర్చిత
దేహి మే తనయం కృష్ణ దేవకీనన్దనన్దన

43} దేవకీసుత శ్రీనాథ వాసుదేవ జగత్పతే
సమస్తకామఫలద దేహి మే తనయం సదా

44} భక్తమన్దార గమ్భీర శఙ్కరాచ్యుత మాధవ
దేహి మే తనయం గోపబాలవత్సల శ్రీపతే

45} శ్రీపతే వాసుదేవేశ దేవకీప్రియనన్దన
భక్తమన్దార మే దేహి తనయం జగతాం ప్రభో

46} జగన్నాథ రమానాథ భూమినాథ దయానిధే
వాసుదేవేశ సర్వేశ దేహి మే తనయం ప్రభో

47} శ్రీనాథ కమలపత్రాక్ష వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

48} దాసమన్దార గోవిన్ద భక్తచిన్తామణే ప్రభో
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

49} గోవిన్ద పుణ్డరీకాక్ష రమానాథ మహాప్రభో
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

50} శ్రీనాథ కమలపత్రాక్ష గోవిన్ద మధుసూదన
మత్పుత్రఫలసిద్ధ్యర్థం భజామి త్వాం జనార్దన

51} స్తన్యం పిబన్తం జననీముఖాంబుజం
విలోక్య మన్దస్మితముజ్జ్వలాఙ్గమ్

52} స్పృశన్తమన్యస్తనమఙ్గులీభిర్వన్దే
యశోదాఙ్కగతం ముకున్దమ్

53} యాచేఽహం పుత్రసన్తానం భవన్తం పద్మలోచన
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

54} అస్మాకం పుత్రసమ్పత్తేశ్చిన్తయామి జగత్పతే
శీఘ్రం మే దేహి దాతవ్యం భవతా మునివన్దిత

55} వాసుదేవ జగన్నాథ శ్రీపతే పురుషోత్తమ
కురు మాం పుత్రదత్తం చ కృష్ణ దేవేన్ద్రపూజిత

56} కురు మాం పుత్రదత్తం చ యశోదాప్రియనన్దనమ్
మహ్యం చ పుత్రసన్తానం దాతవ్యంభవతా హరే

57} వాసుదేవ జగన్నాథ గోవిన్ద దేవకీసుత
దేహి మే తనయం రామ కౌశల్యాప్రియనన్దన

58} పద్మపత్రాక్ష గోవిన్ద విష్ణో వామన మాధవ
దేహి మే తనయం సీతాప్రాణనాయక రాఘవ

59} కఞ్జాక్ష కృష్ణ దేవేన్ద్రమణ్డిత మునివన్దిత
లక్ష్మణాగ్రజ శ్రీరామ దేహి మే తనయం సదా

60} దేహి మే తనయం రామ దశరథప్రియనన్దన
సీతానాయక కఞ్జాక్ష ముచుకున్దవరప్రద

61} విభీషణస్య యా లఙ్కా ప్రదత్తా భవతా పురా
అస్మాకం తత్ప్రకారేణ తనయం దేహి మాధవ

62} భవదీయపదాంభోజే చిన్తయామి నిరన్తరమ్
దేహి మే తనయం సీతాప్రాణవల్లభ రాఘవ

63} రామ మత్కామ్యవరద పుత్రోత్పత్తిఫలప్రద
దేహి మే తనయం శ్రీశ కమలాసనవన్దిత

64} రామ రాఘవ సీతేశ లక్ష్మణానుజ దేహి మే
భాగ్యవత్పుత్రసన్తానం దశరథప్రియనన్దన
దేహి మే తనయం రామ కృష్ణ గోపాల మాధవ

65}కృష్ణ మాధవ గోవిన్ద వామనాచ్యుత శఙ్కర
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

66} గోపబాల మహాధన్య గోవిన్దాచ్యుత మాధవ
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే

67} దిశతు దిశతు పుత్రం దేవకీనన్దనోయం
దిశతు దిశతు శీఘ్రం భాగ్యవత్పుత్రలాభమ్

68} దిశతు దిశతు శీఘ్రం శ్రీశో రాఘవో రామచన్ద్రో
దిశతు దిశతు పుత్రం వంశ విస్తారహేతోః

69} దీయతాం వాసుదేవేన తనయోమత్ప్రియః సుతః
కుమారో నన్దనః సీతానాయకేన సదా మమ

70} రామ రాఘవ గోవిన్ద దేవకీసుత మాధవ
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

71} వంశవిస్తారకం పుత్రం దేహి మే మధుసూదన
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

72} మమాభీష్టసుతం దేహి కంసారే మాధవాచ్యుత
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

73} చన్ద్రార్కకల్పపర్యన్తం తనయం దేహి మాధవ
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

74} విద్యావన్తం బుద్ధిమన్తం శ్రీమన్తం తనయం సదా
దేహి మే తనయం కృష్ణ దేవకీనన్దన ప్రభో

75} నమామి త్వాం పద్మనేత్ర సుతలాభాయ కామదమ్
ముకున్దం పుణ్డరీకాక్షం గోవిన్దం మధుసూదనమ్

76} భగవన్ కృష్ణ గోవిన్ద సర్వకామఫలప్రద
దేహి మే తనయం స్వామింస్త్వామహం శరణం గతః

77} స్వామింస్త్వం భగవన్ రామ కృష్న మాధవ కామద
దేహి మే తనయం నిత్యం త్వామహం శరణం గతః

78} తనయం దేహిఓ గోవిన్ద కఞ్జాక్ష కమలాపతే
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

79} పద్మాపతే పద్మనేత్ర ప్రద్యుమ్న జనక ప్రభో
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

80} శఙ్ఖచక్రగదాఖడ్గశార్ఙ్గపాణే రమాపతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

81} నారాయణ రమానాథ రాజీవపత్రలోచన
సుతం మే దేహి దేవేశ పద్మపద్మానువన్దిత

82} రామ రాఘవ గోవిన్ద దేవకీవరనన్దన
రుక్మిణీనాథ సర్వేశ నారదాదిసురార్చిత

83} దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

84} మునివన్దిత గోవిన్ద రుక్మిణీవల్లభ ప్రభో
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

85} గోపికార్జితపఙ్కేజమరన్దాసక్తమానస
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

86} రమాహృదయపఙ్కేజలోల మాధవ కామద
మమాభీష్టసుతం దేహి త్వామహం శరణం గతః

87} వాసుదేవ రమానాథ దాసానాం మఙ్గలప్రద
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

88}కల్యాణప్రద గోవిన్ద మురారే మునివన్దిత
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

89} పుత్రప్రద ముకున్దేశ రుక్మిణీవల్లభ ప్రభో
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

90} పుణ్డరీకాక్ష గోవిన్ద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

91} దయానిధే వాసుదేవ ముకున్ద మునివన్దిత
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

92} పుత్రసమ్పత్ప్రదాతారం గోవిన్దం దేవపూజితమ్
వన్దామహే సదా కృష్ణం పుత్ర లాభ ప్రదాయినమ్

93} కారుణ్యనిధయే గోపీవల్లభాయ మురారయే
నమస్తే పుత్రలాభాయ దేహి మే తనయం విభో

94} మస్తస్మై రమేశాయ రుమిణీవల్లభాయ తే
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

95} మస్తే వాసుదేవాయ నిత్యశ్రీకాముకాయ చ
పుత్రదాయ చ సర్పేన్ద్రశాయినే రఙ్గశాయినే

96} రఙ్గశాయిన్ రమానాథ మఙ్గలప్రద మాధవ
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

97} దాసస్య మే సుతం దేహి దీనమన్దార రాఘవ
సుతం దేహి సుతం దేహి పుత్రం దేహి రమాపతే

98} యశోదాతనయాభీష్టపుత్రదానరతః సదా
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

99} మదిష్టదేవ గోవిన్ద వాసుదేవ జనార్దన
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

100} నీతిమాన్ ధనవాన్ పుత్రో విద్యావాంశ్చ ప్రజాపతే
భగవంస్త్వత్కృపాయాశ్చ వాసుదేవేన్ద్రపూజిత

ఫలశృతిః

యఃపఠేత్ పుత్రశతకం సోపి సత్పుత్రవాన్ భవేత్
శ్రీవాసుదేవకథితం స్తోత్రరత్నం సుఖాయ చ

జపకాలే పఠేన్నిత్యం పుత్రలాభం ధనం శ్రియమ్
ఐశ్వర్యం రాజసమ్మానం సద్యో యాతి న సంశయః

ఇతి సంతానగోపాల స్తోత్రం సంపూర్ణమ్