Thursday, October 25, 2012

శ్రీమచ్చంకరాచార్య కృత శివానందలహరి



Wednesday, October 24, 2012

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- శ్రీరాజరాజేశ్వరీ దేవి



                                               శ్రీరాజరాజేశ్వరీ దేవి అవతారము తొమ్మిదవ రోజు



అందరికీ హృదయపూర్వక విజయ దశమి శుభాకాంక్షలతో ___/\___


శ్రీరాజరాజేశ్వరీ దేవి అవతారము

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారిని
శ్రీరాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు.
సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత.
మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.
అధిష్టాన దేవత రాజరాజేశ్వరీదేవి.
దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ముగిసిన తరువాత జరుపుకొనే విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడిందని పండితులంటారు.
ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము.
ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది.
దుర్గాదేవి వివిధ కల్పాలలో నానావిధ దుష్ట దనుజల్ని, వివిధ రూపాలు ధరించి సంహరించి
లోకానికి ఆనందాన్ని కలిగించింది. ఎక్కడా ఆమెకు అపజయం లేదు కాబట్టి అపరాజిత అయ్యింది.
ఎప్పుడూ విజయం సాధించింది కాబట్టి విజయ అని పిలువబడింది.
శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన శ్రీలలితాదేవే సాక్షాత్తూ శ్రీరాజరాజేశ్వరి.
పరమశాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండాన్ని (చెరుకు) చేతిలో ధరించి
ఒక చేత అభయముద్రను చూపిస్తూ దర్శనమిస్తుంది. అపరాజితాదేవి స్వరూపమైన రాజరాజేశ్వరీదేవిని దర్శిస్తే అపజయమే ఉండదు.
ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది.
అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత.
శ్రీచక్రార్చన, కుంకుమార్చన చేయవలెను.

అమ్మకు నివాళించే నైవేద్యం::పరమాన్నం
అన్నిరకాల వంటకాలు చేసుకోవచ్చు విజయాలు ఇచ్చే
ఆ చల్లని తల్లికి ఎంత చేసినా తనివితీరదు



శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్

అమ్బా శామ్భవి చన్ద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అమ్బా మోహిని దేవతా త్రిభువనీ ఆనన్దదాయినీ
వాణీ పల్లవపాణివేణుమురళీగానప్రియా లోలినీ
కల్యాణీ ఉడురాజబిమ్బ వదనా ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా నూపురరత్నకఙ్కణధరీ కేయూరహారావళీ
జాతీచమృకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా
వీణావేణు వినోదమణ్డితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మణీ త్రిపురాన్తకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముణ్డా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ వల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా శూలధనుః కశాఙ్కశధరీ అర్థేన్దుబిమ్బాధరీ
వారాహీమధుకైటభప్రశమనీ వాణీ రమా సేవితా
మల్లద్యాసురమూకదైత్యమథనీ మహేశ్వరీ చామ్బికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీ కృతా
ఓఙ్కారీ వినతాసుతార్చితపదా ఉద్దణ్డ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాదిపిపీలికాన్తజననీ యా వై జగన్మోహినీ
యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళా మాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా పాలితభక్తరాజదనిశం అమ్బాష్టకం యః పఠేత్
అమ్బాలోలకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతమ్
అమ్బా పావనమన్త్రరాజపఠనాదన్తే చ మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

{{ ఇతి శ్రీరాజరాజేశ్వర్యష్టకం సమ్పూర్ణమ్ }}
Sunder Raj Priya

Tuesday, October 23, 2012

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- శ్రీ మహిషాసురమర్ధిని దేవి




                                                         శ్రీ మహిషాసురమర్ధిని దేవి 8వ రోజు 




శ్రీ మహిషాసురమర్ధిని దేవి 8వ రోజు 
    
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపముదాల్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది మహిషాసుర మర్ధినీ దేవి.
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజశుద్ధ నవమినాడు అమ్మవారిని శ్రీమహిషాసురమర్దినీదేవిగా అలంకరిస్తారు. దీన్నే మహర్నవమి అని కూడా అంటారు. 
ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. 
మహిషాసురుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడుతున్న ఇంద్రాది దేవతలు తమతమ శరీరాల్లోంచి దివ్య తేజసును బయటకు ప్రసరించారు. ఆ తేజస్సు నుంచి దివ్య తేజోమూర్తి ఉద్భవించింది.ఆ తేజోమూర్తికి దేవతలంతా తమతమ ఆయుధాల్ని సమర్పించారు. హిమవంతుడు సింహాన్ని సమర్పిస్తాడు హిమవంతుడు సింహాన్ని సమర్పిస్తాడు. సింహవాహినిగా ఆ శక్తి వికటాట్టహాసం చేసి, మహిషాసురుడి సేనాపతులైన రాక్షసులందరినీ సంహరిస్తుంది. అనంతరం మహిషాసురుడిని చంపి  
అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రిపై వెలిసింది. కాలక్రమంలో కనకదుర్గగా కీర్తి పొందింది. సింహవాహనం మీద ఆలీఢ పాద పద్ధతిలో ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దుర్గమ్మ దర్శనమిస్తుంది  
అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. 
ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.

ఈ తల్లికి ఇష్టమైన రంగు::ముదురు నీలం 

నైవేద్యం::బెల్లం పాయసం  

Sunder Raj Priya 

మహిషాసురమర్ధిని స్తోత్రం 

1::అయిగిరి నందిని, నందిత మేదిని, విశ్వ వినోదిని నందనుతె
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతె
భగవతి హె శితికంఠకుటుమ్భిని భూరికుటుంభిని భూరికృతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

2::సురవరవర్షిని దుర్ధరదర్షిణి దుర్ముఖమర్షిని హర్షరతె
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్మశమోషిణి ఘోషరతె
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

3::అయి జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతె
శిఖర శిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతె
మధుమధురె మధుకైటభభంజిని కైటభభంజిని రాసరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

4::అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతె
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతె
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భఠాధిపతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

5::అయి రణదుర్మదశత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతె
చతురవిచారధురీణమహాశివ దూతక్రిత ప్రమథాధిపతె
దురితదురీహదురాశయదుర్మతి దానవదూత కృతాంతమతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

6::అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరె
త్రిభువనమస్తక శూలవిరోధిశిరోధికృతామల శూలకరె
దుమిదుమితామర దుందుభినాద మహోముఖరీకృత తిగ్మకరె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

7::అయి నిజహుంక్రితి మాత్రనిరాక్రిత ధూమ్రవిలోచన ధూమ్రశతె
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతె
శివశివశుంభని శుంభమహాహవతర్పిత భూతపిశాచరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

8::ధనురనుసంగరణక్షణసంగ పరిశ్ఫురదంగ నటత్కటకె
కనకపిశంగ ప్రిశత్కనిశంగ రసాద్భటశృంగ హతాబటుకె
క్రుతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

9::జయ జయ జప్యజయె జయశబ్ద పరస్తుతిటతత్పర విశ్వనుతె
ఝణ ఝణ ఝింఝిమిఝింక్రితనూపుర సింజితమోహిత భూతపతె
నటిత నటార్ధనటీనటనాయక నాటితనాట్యసుగానరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

10::అయి సుమనః సుమనః సుమనః సుమనోహరకాంతియుతె
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకరవక్రవృతె
సునయనవిభ్ర మరభ్ర మరభ్ర మరభ్ర మరభ్ర మరాధిపతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె


11::సహితమహాహవ మల్లమతల్లిక మల్లితరల్లిక మల్లరతె
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లికభిల్లిక వర్గవృతె
సిత క్రుత ఫుల్లిసముల్లసితారుణతల్లజ పల్లవసల్లలితె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

12:అవిరలగండ గలంమదమేదుర మత్తమతంగజరాజపతె
త్రిభువన భూషణ భూతకలానిధి రూపపయోనిధిరాజసుతె
అయి సుదతీజనలాలసమానస మోహనమన్మథరాజసుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

13:కమలదలామలకోమల కాంతికలాకలితామల బాలలతె
సకలవిలాసకలానిలయక్రమ కెలిచలత్కల హంసకులె
అలికులసంకుల కువలయమండల మౌలిమిలద్భకులాలికులె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

14:కరమురలీరవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతె
మిలితపులింద మనోహరగుంజిత రంజితశైలనికుంజగతె
నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసమ్భ్రుత కేలితలె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

15:కటితటపీతదుకూలవిచిత్ర మయూఖతిరస్క్రిత చంద్రరుచె
ప్రణత సురాసుర మౌలిమణిస్ఫురదంశులసన్నఖ చంద్రరుచె
జితకనకాచల మౌలిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

16:విజితసహస్ర కరైకసహస్ర కరైకసహస్ర కరైకనుతె
క్రుతసురతారక సంగరతారక సంగరతారక సూనుసుతె
సురథసమాధి సమానసమాధి సమాధి సమాధి సుజాతరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

17:పదకమలం కరుణానిలయె వరివస్యతి యోనుదినం సశివె
అయి కమలె కమలానిలయె కమలానిలయః సకథం న భవెత్
తవ పదమెవ పరం పదమిత్యనుశీలయతొ మమ కిం న శివె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

18::కనకలసత్కల సింధుజలైరనుసించినుతె గుణరంగభువం
భజతి స కిం న శచికుచకుంభ తటీపరిరంభ సుఖానుభవం
తవ చరణమ్ శరణమ్ కరవాణి నతామరవాణి నివాసిశివమ్
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

19::తవ విమలేందుకులం వదనెందుం అలం సకలం నను కూలయతె
కిము పురుహూత పురీందుముఖీసుముఖీభిరసౌ విముఖీక్రియతె
మమ తు మతం శివనామధనె భవతీ క్రిపయా కిముత క్రియతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

20::అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమె
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథనుమితాసిరతె
టదుచితమత్ర భవత్యురరీకురుతాదురుతాప మపాకురుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె.

Monday, October 22, 2012

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- దుర్గా దేవి



                                                           ఏడవ రోజు దుర్గా దేవి అవతారము



ఏడవ రోజు దుర్గా దేవి అవతారము
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము.  భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.
అమ్మవారి ఇష్టమైన ప్రసాదం..( కదంభం) సాంబర్ అన్నం)

పూజా విధానము::-ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.
మంత్రము: “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రమును  పఠించాలి.

శ్రీ  దుర్గ సూక్తం

ఓం || జాతవే’దసే సునవామ సోమ’ మరాతీయతో నిద’హాతి వేదః’ 
స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా’ నావేవ సింధుం’ దురితా‌உత్యగ్నిః 

తామగ్నివ’ర్ణాం తప’సా జ్వలంతీం వై’రోచనీం క’ర్మఫలేషు జుష్టా”మ్ 
దుర్గాం దేవీగ్‍మ్ శర’ణమహం ప్రప’ద్యే సుతర’సి తరసే’ నమః’ 

అగ్నే త్వం పా’రయా నవ్యో’ అస్మాంథ్-స్వస్తిభిరతి’ దుర్గాణి విశ్వా” 
పూశ్చ’ పృథ్వీ బ’హులా న’ ఉర్వీ భవా’ తోకాయ తన’యాయ శంయోః 

విశ్వా’ని నో దుర్గహా’ జాతవేదః సింధున్న నావా దు’రితా‌உతి’పర్-షి 
అగ్నే’ అత్రివన్మన’సా గృణానో”‌உస్మాకం’ బోధ్యవితా తనూనా”మ్ 

పృతనా జితగ్ం సహ’మానముగ్రమగ్నిగ్‍మ్ హు’వేమ పరమాథ్-సధస్థా”త్ 
స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా క్షామ’ద్దేవో అతి’ దురితా‌உత్యగ్నిః 

ప్రత్నోషి’ కమీడ్యో’ అధ్వరేషు’ సనాచ్చ హోతా నవ్య’శ్చ సత్సి’ 
స్వాంచా”ఙ్నే తనువం’ పిప్రయ’స్వాస్మభ్యం’ చ సౌభ’గమాయ’జస్వ 

గోభిర్జుష్ట’మయుజో నిషి’క్తం తవేం”ద్ర విష్ణోరనుసంచ’రేమ 
నాక’స్య పృష్ఠమభి సంవసా’నో వైష్ణ’వీం లోక ఇహ మా’దయంతామ్ 

ఓం కాత్యాయనాయ’ విద్మహే’ కన్యకుమారి’ ధీమహి | తన్నో’ దుర్గిః ప్రచోదయా”త్

ఓం శాంతిః శాంతిః శాంతిః’ 




శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం

దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా 
సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా 
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా

నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా 

పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ 
తేజోవతీ మహామాతా కోతిసూర్యసమప్రభా 

దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ 
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా 

కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ 
ధర్మఙ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా 

కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా 
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా 

సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా 
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా 

భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా 
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా 

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా 

కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ 
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ

ఙ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ

స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ 
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా 

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా 
సర్వఙ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ 

సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ 

 || ఇతి శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ 

Sunday, October 21, 2012

అష్టదిక్పాలకులు ఎవరు?
















అష్టదిక్పాలకులు ఎవరు?
వారి భార్యల పేర్లు చాలా మందికి తెలియవు.
అసలు అష్టదిక్పాలకులు అంటే ఏంటి?
నాలుగు ప్రధాన దిక్కులతో పాటు.. నాలుగు దిక్కుల మూలలకు కాపలాగా ఉండే వారినే-అధిపతులుగా ఉండే వారినే అష్టదిక్పాలకులు అంటారు.
ఒక హిందూ మతములోనే ఈ దేవతా మూర్తులను మనము చదువ గలుగూ ఉన్నాము . మిగతా మతాలలో ఈ నమ్మకము లేదు. ఆత్యాధ్మికముగా ఇది ఒక నమ్మకము మాత్రమే. ఉన్నారా? లేరా? అనేది ప్రక్కన పెడితే ... దేవుళ్లే మనకి కపాలా ఉన్నార్ననే నమ్మకము మనోబలాన్ని ఇస్తుంది.

అష్టదిక్పాలకులు..వారి సతీమణులు --వీరిలో-------->
..................................................................>
తూర్పు దిక్కుకు ఇంద్రుడు --భార్య : శచీదేవి,

పడమర దిక్కుకు వరుణుడు--భార్య : కాళికాదేవి,

ఉత్తర దిక్కుకు కుబేరుడు --భార్య : చిత్రరేఖాదేవి,

దక్షిణ దిక్కుకు యముడు--భార్య : శ్యామలాదేవి,

ఆగ్నేయానికి అధిపతిగా అగ్నిదేవుడు--భార్య స్వాహాదేవి:

నైరుతి దిక్కుకు అధిపతిగా నిర్భతి--భార్య : దీర్ఘాదేవి,

వాయువ్య దిక్కుకు వాయుదేవుడు--భార్య : అంజనాదేవి,

ఈశాన్య దిక్కుకు ఈశానుడు--భార్య : పార్వతీదేవి . . . .వీరినే అష్టదిక్పాలకులు అంటారు.

(rachana Venkata madhu)


Saturday, October 20, 2012

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- శ్రీ లలితా త్రిపుర సుందరీ

                                              ఆరవ రోజు అవతారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి


శ్రీ లలితా త్రిపుర సుందరీ

ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం


బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాభ్యాం
మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశమ్‌॥

దసరాలో ఆశ్వయుజ శుద్ధసప్తమి నాడు దుర్గమ్మను శ్రీలలితాత్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు.
త్రిపురాత్రయములో రెండొవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత.

త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు. 
సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ.

బ్రహ్మవిష్ణుమహేశ్వరులకన్నా పూర్వం నుంచి ఉన్నది కాబట్టి త్రిపురసుందరి అని పిలువబడుతోంది. 
శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్ర అధిదేవతగా భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తుంది. 
దుర్గమ్మ సన్నిధిలో శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠితమైన శ్రీచక్ర అధిష్టాన దేవత కూడా ఈ లలితాత్రిపురసుందరీదేవే. 
పూర్వం దుర్గమ్మ ఆలయంలో శంకరాచార్యులు శ్రీచక్రయంత్రాన్ని ప్రతిష్ఠించారు. 
అప్పటి వరకు ఉగ్రస్వరూపంతో చండీదేవిలా ఉన్న దుర్గాదేవి లలితంగా పరమశాంత స్వరూపంతో దర్శనమిస్తోంది. 
అందుకని ఇక్కడి శ్రీచక్రానికి నిత్యం లలితా ఆష్టోత్తరం, లలితా సహస్రనామాలతో కుంకుమపూజ చేస్తారు. 
లలితాసహస్రనామ స్తోత్రంలో వర్ణించిన విధంగా 
‘సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా’ అన్నట్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటూ నిలబడి 
లలితా పరాభట్టారికను వింజామరతో సేవిస్తున్నట్లుగా అలంకారం చేస్తారు. 
మధ్యలో ఉన్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరకుగడను ధరించి, 
శివుని వక్షస్థలం మీద కూర్చుని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది. 

దారిద్ర్య దుఃఖాలను తొలిగించి సకల ఐశ్వర్యాభీష్టాలను సిధ్ధింపజేస్తుంది. 
అమ్మ శ్రీవిద్యా స్వరూపిణి. సృష్ఠి, స్థితి సమ్హార రూపిణి.
ఈ అమ్మ వారికి ప్రీతికరమైన ప్రసాదం గారెలు,పులిహోర.

కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

మంత్రము: “ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః” అనే మంత్రము 108 మార్లు జపించవలెను.

రోజూ శుభోదయాన్న శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తూ..
లలితా సహస్రనామావళి చెప్పుకొంటే
అనుకొన్న కార్యాలు నెరవేరుతాయి..దయామయి సౌశీలవతి అయిన ఆ పరాశక్తి 
ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ...జై శ్రీ మాత్రేనమహా... 




"ఈ ప్రపంచం అంతా 'త్రిపురం'. పురం అంటే చోటు అని అర్థం. ........... 
........ మనమున్నచోటు నడిమి భాగం. దానికి పైన ఊర్థ్వలోకాలు. క్రింద అధోలోకాలు. ఈ ఊర్థ్వ, మధ్య, అధో లోకాలు .. మూడు లోకాలు. 
అలాగే భూత, భవిష్యత్, వర్తమానాలు. 
వ్యాపించిన గుణాలు .. సత్త్వ, రజస్తమో గుణాలు. 
జరిగే పనులు సృష్టి, స్థితి, లయలు... 
ముగ్గురు వేల్పులు బ్రహ్మ, విష్ణు, రుద్రులు. 
ఓంకారం మూడు అంగాలు... అ, ఉ, మ. 
వేదానికి ప్రధానంగా మూడు రకాల మంత్రాలు... ఋక్, యజు, స్సామములు.
ఇలా అన్నీ "త్రి" పురాలే.. 
ఇక మనలో .. భౌతిక, ప్రాణిక, మానసిక శక్తులు మూడు. 
స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు. 
జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు. 
యోగపరమైన నాడులు మూడు... ఇడ, పింగళ, సుషుమ్న. 
ఇలా బైటా, లోపలా ఉన్న ప్రపంచమంతా మూడింటితో కూడినదే. ఈ మూడింటిలో వ్యాపించిన సౌందర్యమే...'త్రిపుర సుందరి'......
........ 'పురా' అంటే.......... 'పూర్వము' అని కూడా అర్థం...ఈ మూడు చోట్లు (ముల్లోకాలు, మూడు స్థితులు, మూడు కాలాలు వగైరాలు) కలుగక పూర్వమే ఉంది ఆ 'సౌందర్యం'..........
.......ముందున్నదీ, నిండినదీ అయిన ఆ శాశ్వత చిత్ శక్తియే నిజమైన లావణ్యం. అందుకే అది 'లలిత'. జీవరాశి అంతా ఆ శక్తినే ఆశ్రయించుకున్నది.. ఆశ్రయ శక్తినే 'శ్రీ' అంటారు. ... చైతన్యంకన్నా నిజమైన 'ఐశ్వర్యం' ఏముంది ? చైతన్యమేలేకుంటే శోభ, కాంతి ఉండవు.. అందుకే 'సౌందర్యలహరి'యే 'శ్రీమాత'.."
....................(... బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి కలం నుండి వెలువడిన "...ఏష ధర్మః సనాతనః" గ్రంధం నుండి.)

ఆ జగన్మాతను ఈ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరిగా ఆరాధిస్తున్నాము...
రాసినవారు ( Dinavahi Vekata Hanumantharao ) వారి నుండి సేకరణ 

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- శ్రీ సరస్వతి దేవి

                                                       ఐదవరోజు అవతారం సరస్వతీ దేవీ  

                               

శ్రీ సరస్వతి దేవి అవతారము 5వ రోజు

శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. 
చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. 
బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణములు వర్ణిస్తున్నాయి. 

శ్వేత పద్మాన్ని ఆసనముగా అధీష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి
అభయ ముద్రతో భక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది.
వ్యాసభగవానుడు, వాల్మీకిమహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు,
పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవమును వరముగా అందచేసింది.
అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది.
త్రిశక్తి స్వరూపములలో సరస్వతీదేవి మూడొవ శక్తిరూపము.
సంగీత సాహిత్యములకు అమ్మ అథిష్టాన దేవత.
సకల జీవుల జిహ్మాగ్రముపై అమ్మ నివాసము ఉంటుంది.


"సరస్వతి వాహనము హంస. హంస అంటే శ్వాసశక్తి. 
రెండు రెక్కల పై విహరించే హంసలా ఇడ పింగళ నాడుల ఆధారంగా 
సుషుమ్న నాడిపై ప్రవహించే ప్రాణశక్తి అదే. ప్రవహించడమే సరస్వతి.. 
సరస్వతి అంటే జ్ఞానం.. గురువునుంచి శిష్యునికి పరంపరాగతంగా ప్రవహిస్తుంది జ్ఞానం.. 
హంసపై చరిస్తుంది. శ్వాసననుసరించి చరిస్తుందని అర్థం.
అంతేగాక క్షీరనీరములను విడదీసి క్షీరమునే గ్రోలుతుంది అని నానుడి ఉంది. 
అలాగే ప్రపంచమందలి సత్ - అసత్తులను విడదీసి అసత్తును వర్జించి, సద్వస్తువును అన్వేషించడమే జ్ఞానము అని చెప్పబడుతున్నది. 
అటువంటి వివేక జ్ఞానానికి అధినేత్రి సరస్వతి. ఆ జ్ఞానము భక్తులకు ప్రసాదించు శక్తియే సరస్వతీ దేవి హంసవాహన పరమార్థం. 
ఆమె నాదస్వరూపిణి అనడానికి సూచనగా వీణాపాణియైనది. మూర్తి శ్వేతం అది పరిపూర్ణ శుద్ధ తత్వంగా గ్రహింపదగినది. 
ప్రశాంతి చిహ్నం శ్వేతత్వం. శ్వేతవర్ణం ప్రత్యేక వర్ణం కాదు. 
సర్వవర్ణ సమష్టి రూపమవడం (వీభ్ఘ్Yఓఋ) వలన సరస్వతీ దేవి సర్వవిద్యా సమష్టి మూర్తి అని తెలియవచ్చు.... "

రాసినవారు  (Dinavahi Vekata Hanumantharao) నుండి సేకరణ 

శ్రీ సరస్వతి స్తోత్రం

1::
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా 
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా 

2::
దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ 
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాౙ్సమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా

3::
సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా 
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా 

4::
సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా 
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ 

5::
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా 

6::
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః 
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః

7::
నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః 
విద్యాధరే విశాలాక్షి శుద్ధఙ్ఞానే నమో నమః 

8::
శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః 
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః 

9::
ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః 
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః 

10::
మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః 
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః 

11::
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః 
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః 

12::
సర్వఙ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః 
సంపన్నాయై కుమార్యై చ సర్వఙ్ఞే తే నమో నమః 

13::
యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః 
దివ్యఙ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః 

14::
అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః 
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః 

15::
అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః 
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః 

16::
ఙ్ఞాన విఙ్ఞాన రూపాయై ఙ్ఞానమూర్తే నమో నమః 
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః 

17::
పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః 
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ 

18::
మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః 
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః 

19::
కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః 
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః 

20::
సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే 
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి 

21::
ఇత్థం సరస్వతీ స్తోత్రమగస్త్యముని వాచకమ్ 
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ 

నేటి నైవేద్యం: దద్ధ్యోదనం (పెరుగన్నం)

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- శ్రీమహాలక్ష్మీదేవి

                                     
                                                 నాలుగవరోజు అవతారం శ్రీమహాలక్ష్మీ దేవీ

       
నాలుగవరోజు అవతారం శ్రీమహాలక్ష్మీ దేవీ
శ్రీమహాలక్ష్మీదేవి::

సిందూరాభాంచ పద్మస్థాం పద్మపత్రంచ దర్పణం
అర్ఘ్యపాత్రంచ దధతీం సద్భార మకుటాన్వితాం
నానా దాసీ పరివృతాం కాంచీ కుండలమండితాం

లావణ్య భూమికాం వందే సుందరాంగద బాహుకాం॥

దసరాలో ఆశ్వయుజ శుద్ధ చవితినాడు అమ్మవారిని శ్రీమహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. మంగళప్రదమైన దేవత లక్ష్మీదేవి. దుర్గాసప్తశతి అంతర్గతమైన దేవీచరిత్ర లో ఆదిపరాశక్తి... మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాలను ధరించి దుష్టరాక్షస సంహారం చేసిందని చెప్పబడింది. మూడు శక్తుల్లో ఒకటైన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి మహిషుడనే అసురుణ్ని సంహరించి మహిషమర్దినిగా ప్రసిద్ధి పొందింది. ఆ తరువాత మహిషాసురమర్దినీదేవిగా ఇంద్రకీలాద్రిపై కొలువైంది. సత్యలక్ష్మి, భోగలక్ష్మి, రాజ్యలక్ష్మి, యోగలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అమృతలక్ష్మి, కామ్యలక్ష్మి అనే ఎనిమిది విధాలుగా మహాలక్ష్మీదేవి మనకు కనిపిస్తుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి అనే మరో ఎనిమిది రకాల అష్టలక్ష్ములు కూడా లోకంలో ప్రసిద్ధమయ్యాయి. దుర్గమ్మ త్రిశక్తుల్లో ఒకటైన మహాలక్ష్మి స్వరూపిణి కాబట్టి అమ్మవారి దేవాలయ కుడ్యకోష్టాల చుట్టుపక్కల అష్టలక్ష్మి విగ్రహాల్ని అందంగా ప్రతిష్టించారు. రెండు చేతుల్లో కమలాల్ని ధరించి వరదాభయహస్తాల్ని ప్రద ర్శిస్తూ గజరాజు తనని కొలుస్తుండగా కమలాసనాసీనురాలిగా మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది.

నేటి నైవేద్యం: ముద్గాన్నం శాకాన్నము 
(పెసరపప్పు, పులగం)
 

దసరా నవరాత్రులు - దేవీ అవతారం విశిష్టత -- అన్నపూర్ణాదేవి


                                                        మూడవరోజు అవతారం అన్నపూర్ణ దేవీ 





దసరా నవరాత్రి 
అన్నపూర్ణాదేవి అవతారం 3వ రోజు 

ఊర్వీ సర్వజయేశ్వరీ జయకరీ
మాతాకృపాసాగరీ

నారీనీల సమానకుంతలధరీ
నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్ మోక్షకరీ సదాశుభకరీ
కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ !!


దసరా ఉత్సవాలలో మూడోరోజు అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు.
సకలప్రాణకోటికీ జీవనాధారం అన్నం.అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.
ఈ రూపంలో అమ్మ రసపాత్రనుధరించి దర్శనమిస్తుంది.
ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత.అన్నపూర్ణాదేవి.
ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం,సమయ స్ఫుర్తి , వాక్‌సిద్ధి, శుద్ధి,భక్తిశ్రద్ధలు ఐశ్వర్యం కలుగుతాయి.
మానవుణ్ణి సకలసంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది .ప్రపంచ సృస్టి పోషకురాలు. " అమ్మ " అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది.బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈ తల్లి వహిస్తుందని ఆర్షవాక్యం. తెల్లని పుష్పాలతో అమ్మను పూజించాలి...హ్రీం..శ్రీం..క్లీం..ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రం జపించాలి.అమ్మవారికి కొబ్బర అన్నం , దద్ధోజనం , కట్టెపొంగలి నివేధించాలి అన్నపూర్ణ అష్టోత్తరం , స్తోత్రాలు పారాయణం చేయాలి...అమ్మకు ఏదో ఒక వంటకం నివేదించిననూ.సంటుస్తురాలవుతుంది..మంగళవారం..శుక్రవారం..ధాన్యాలలో విగ్రహం ప్ర్ట్టి ఆ తల్లిని కొలిస్తే..అన్నానికి లోటుండదని పెద్దల నానుడి..ఓం శ్రీఅన్నపూర్ణాదేవి నమో నమహా___/\___


!!! అన్నపూర్ణాష్టకమ్ – శ్రీ అన్నపూర్ణా దేవి అష్టకం !!!

1}
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


2}
నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


3}
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


4}కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


5}దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విఙ్ఞాన-దీపాంకురీ
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


6}ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

7
}ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

8
}దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

9
}చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


10}క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

11
}అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే
ఙ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ

12
}మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్

13
}సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే 
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమో‌உస్తు తే 


{{ ఇతి శ్రీ శంకరాచార్య విరచిత అన్నపూర్ణాష్టకమ్ సంపూర్ణం }}


దసరా నవరాత్రులు – దేవీ అవతారం విశిష్టత -- గాయత్రి దేవి


రెండవరోజు అవతారం గాయత్రి దేవి 



రెండవరోజు అవతారం గాయత్రి దేవి 

ఈ రోజు అవతారం గాయత్రి దేవి, ఈ అవతారం విశిష్టత

సకల వేద స్వరూపం గాయత్రి దేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవి
ని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతః కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది





ఓం బ్రహ్మకుండికాహస్తాం
శుద్ధజ్యోతిస్వరూపిణీం
సర్వతత్త్వమయీంక

వందే గాయత్రీం వేదమాతరమ్//

ఆశ్వయుజ శుద్ధ విదియనాడు కనకదుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరిస్తారు. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొందింది. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టానదేవత. గాయత్రీమంత్ర ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని వేయిసార్లు ధ్యానిస్తే చాలు, గాయత్రీమాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్సుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు. 


సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకూ నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రీ మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదు ముఖాలతో, వరద అభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది.

నేటి నైవేద్యం: స్నిగ్ధౌదనం (నేతి అన్నం)





"ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః 
యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే" 

తాత్పర్యము::

1)ముక్తా = ముత్యపు వర్ణము, 2) విద్రుమ = పగడపు వర్ణము, 3) హేమ = బంగారపు వర్ణము, 4) నీల = నీలవర్ణము, 5) ధవళ = తెల్లని వర్ణము గల ఐదు ముఖములు కలిగినదియు, 

ప్రతిముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు, 
చంద్రకళతో కూడిన కిరీటము కలదియు, 
పరమార్థ వివరాణత్మక బీజాక్షరములు కలిగినదియు,

వరద మరియు అభయముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైన గాయత్రీదేవి దర్శనమిస్తుంది.

సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. 
అమ్మవారు 24 తత్త్వములతో, 5 ముఖములు కలిగిన శక్తిగా ప్రభోధిస్తారు.

ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. 
ప్రాత: కాలంలో గాయత్రిగానూ, 
మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, 
సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. 

ముఖంలో అగ్ని, 
శిరస్సులో బ్రహ్మ, 
హృదయంలో విష్ణువు, 
శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. 

గాయత్రియే సకల దేవతలకు ఆరాధనీయం. "న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్"
భావము: తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేవు - ఆర్యోక్తి 

"గాయతాం త్రాయతే ఇతి గాయత్రి" - గానము చేయువాని రక్షించేది గాయత్రి. అనగా గొంతెత్తి బిగ్గరగా రాగ భావ శృతి లయ యుక్తంగా పాడవలెను. 

అమ్మను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి, తద్వార బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.

"ఓం భూర్భువస్సువః| ఓం తత్సవితుర్వరేణ్యమ్| భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్|"

గాయత్రీ మంత్ర పదవిభాగము:
ఓం, తత్, సవితుః, వరేణ్యమ్, భర్గః, దేవస్య ధీమహి, ధియః, యః, నః, ప్రచోదయాత్

పదక్రమము:
వరేణ్యమ్, నః, ధియః,ప్రచోదయాత్ యః తత్, ఓం సవితుః, దేవస్య, భర్గః, ధీమహి

అర్థములు:
వరేణ్యమ్ = కోరదగినదియు (అందరికీ శ్రేయస్సును కలిగించుటలో)
నః = మన
ధియః = బుద్ధులను
ప్రచోదయాత్ = ప్రేరేపించునదియు,
యః = ఎవరో
ఓం = ప్రణవ ప్రతీకమైన
తత్ = ఆ
సవితుః దేవస్య = వెలుగుల సవితృ మూర్తి యొక్క
భర్గః = స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన తేజస్సును
ధీమహి = ధ్యానించుదుము (గాక)

తాత్పర్యము: 
అందరికి శ్రేయస్సును కలిగించుటలో కోరదగినదియు, మన బుద్ధులను ప్రేరేపించునది ఎవరో - ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల సవితృమూర్తియొక్క(స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన) తేజస్సును ధ్యానించెదము గాక!

గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి. 

లోకాస్సమస్తాః సుఖినో భవంతు | ఓం శాంతిః శాంతిః శాంతిః|

దసరా నవరాత్రులు – దేవీ అవతారం విశిష్టత -- బాలాత్రిపురసుందరి

 మొదటి రోజు :: బాలాత్రిపురసుందరీ అవతారం.



బాలాత్రిపురసుందరి:

ఆశ్వయుజ మాసం శక్తిని ఆరాధించే విశేషమాసం. శరత్కాలంలో వచ్చే రాత్రులు కావటంతో వీటిని శరన్నవరాత్రులనీ, దేవీ ఆరాధన ప్రధానమైనది కాబట్టి దేవీనవరాత్రులనీ అంటారు. అసురత్వాన్ని అంతం చేసి, దురితాలను దూరం చేసే దుర్గాదేవి దశావతారాలను, ఒక్కోరోజు ఒక్కో అవతారంలో అలంకరిస్తారు.

అరుణ కిరణజాలైరంచితా సావకాశా

విధృత జపపుటీకా పుస్తకాభీతిహస్తా
ఇతరవరకరాఢ్యా ఫుల్లకల్హారసంస్థా
నివసతు హృది బాలా నిత్యకళ్యాణశీలా॥


మొదటిరోజు అమ్మవారు శ్రీబాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపుర త్రయంలో ఈ దేవి మొదటిది. బాలాదేవి మహిమాన్వితమైనది. శ్రీబాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది. అతి ముఖ్యమైనది కూడా. అందుకే శ్రీవిద్యోపాసకులను మొట్టమొదట ఈ బాలా మంత్రాన్నే ఉపదేశిస్తారు. పవిత్ర శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. అందుకే ముందుగా ఆ దేవిని అర్చిస్తేనే మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. బాలా త్రిపురసుందరీదేవిని ధ్యానిస్తేనే దుర్గాదేవి సంతోషిస్తుంది. కాబట్టి బాలాదేవి స్వరూపం ఎలా ఉంటుందో భక్తులకు తెలియచేయటం కోసమే ఈ అలంకరణ. 

నైవేద్యం - పాయసాన్నం
అలంకరణ - బాలాత్రిపురసుందరి..

Wednesday, October 17, 2012

దసరా నవరాత్రులు ___/\___






మహా శక్తిస్వరూపిణి అయిన దుర్గా మాతని మనం అనేక రూపాలాలో కొలుచుకుంటాము. ఐతే వాటిలో ముఖ్యమైనవి 9 అవతారాలు. వారినే మనం నవదుర్గలని అంటుంటాం.

దుర్గా మాత ముఖ్యమైన అవతారాలు మూడు. మాహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. వీరు శ్రీమహావిష్ణువు, పరబ్రహ్మ, పరమశివుని అర్ధాంగినులుగా మనకు తెలుసు. వీరిలో ఒక్కొక్కరూ తిరిగి 3 అవతారాలు పొందారు. ఆ విధంగా నవదుర్గలుగా ప్రసిద్ధి చెందారు.

1. శైలపుత్రి

నవదుర్గలలో ప్రధమమైన శైలపుత్రి హిమవంతుని పుత్రిక. ఈమెయే వెనుకజన్మలో దక్షప్రజాపతి కుమార్తె సతి. హిమవంతుడు పర్వతరాజు కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది. ఈమె వాహనం నంది. ఒక చేతిలో త్రిశూలం రెండో చేతిలో కలువ, నుదుటిన చంద్ర వంక ధరించిన ఈమె మహిమలు అపారం. నవరాత్రి సంధర్భంగా మొదటిరోజున ఈమె పూజ జరుగుతుంది.

2. బ్రహ్మచారిణి

దుర్గామాత అవతారాలలో రెండవది అయిన బ్రహ్మచారిణి, తపస్సుకు ప్రతీక. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి తపస్సు అని అర్థం. వేదము, తత్వము, తపము అనే పదాలు బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలుగా వాడుతారు. ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో తులసి మాల ధరించే ఈమెను సకల సౌభాగ్యదాయనిగా పూజిస్తారు.

3. చంద్రఘంట

దుర్గామాత మూడవ అవతారమైన చంద్రఘంట మాత శిరసున అర్ధచంద్రుడిని గంటరూపంలో ధరించింది. అందువలననే ఆమెకి ఈ నామధేయం కలిగింది. సింహవాహిని ఐన ఈమె బంగారు దేహఛాయ కలిగి, పది హస్తాలతో ఉంటుంది. ఈమె పది హస్తాలలో శంఖ, ఖడ్గ, గద, కమండలము, విల్లు, కమలం మొదలైనవి కలిగి చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది.

4. కూష్మాండ

సూర్యలోక నివాసిని అయిన కూష్మాండదేవి, సూర్యకాంతిని పోలిన దేహఛాయతో ఉంటుంది. ఈమె దేహఛ్ఛయతో దశ దిశంతాలు వెలుగు పొందుతాయి. సింహవాహిని ఐన ఈ దేవికి ఎనిమిది హస్తములలో కమండలము, విల్లు, అమ్ము, కమలము, అమృతభాండము, చక్రము, త్రిశులము, జపమాల ఉంటాయి.

5. స్కందమాత

కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత మహాదుర్గ ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.

6. కాత్యాయని

దుర్గామాత ఆరవ అవతారమైన కాత్యాయనిమాతను సకల వరప్రదాయనిగా పూజిస్తారు. శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఈమెనే ఆరాధించారు. బంగారు మేనిఛాయతో, అత్యంత ప్రకాశవంతమైన ఈమెకు నాలుగు హస్తములు. ఒక చేత కత్తి, రెండవ చేత కమలం, మిగిలిన రెండుచేతులలో అభయప్రదాన ముద్రలో ఉంటుంది. ఈమె వాహనం సింహం.

7. కాళరాత్రి

దుర్గమాత ఏడవ అవతారం కాళరాత్రి. ఈమె శరీరఛాయ చిమ్మచీకటిలా నల్లగా ఉంటుంది. చెదరిన జుట్టుతో, మెడలో వాసుకొనిన మాల మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఈమెకు మూడు కళ్ళు. ఈమె ఉచ్వాస నిశ్వాసలు అగ్నిని విరజిమ్ముతుంటాయి. ఈమెకు నాలుగు హస్తములు. కుడి రెండు హస్తములలో ఒకటి అభయాన్ని, రెండవది భాయాలని పారదోలేవిగా ఉంటాయి. ఎడమచేతిలో ఒక చిన్న కత్తి, ఇనుముతోచేసిన రంపంలాంటి అయుధం ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈమె రూపం ఉగ్రమే ఐనా ఈమెని పూజించిన వారికి అన్ని శుభములని కూరుస్తుంది కనుక ఈమెనే శుభంకరి అని కూడా పిలుస్తారు.

8. మహాగౌరి

దుర్గామాత అష్టమ అవతారం మహాగౌరి. ఈమె చంద్రునిపోలిన మేనిఛాయతో ఉంటుంది. ఈమె పార్వతి రూపంలో ఉన్నప్పుడు, శివునికోసం మహాతపస్సు చేసింది. అప్పుడు ఆమె శరీరఛ్ఛాయ నల్లగా మారిపోయింది. అది గమనించిన మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగాజలాలతో కడగగా ఆమెకు ఆ మేనిఛ్ఛాయ కలిగిందని ఒక కథ. సర్వకాల సర్వావస్తలలో ఈమెను ఎనిమిది ఏళ్ళ బాలికగానే పూజిస్తారు.
అత్యంత ప్రశాంతమైన స్వరూపం కలిగిన ఈమెకు నాలుగు చేతులు. రెండు చేతులలో త్రిశులం, దమరుకము ధరించి మిగిలన రెండుచేతులతో వర, అభయ ముద్రలతో దర్శనమిస్తుంది. ఈమె వాహనం నంది.

9. సిద్ధిదాత్రి

దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తులకు అష్టసిద్దులను (అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇసిత్వ, మరియు వాసిత్వ అనేవి అష్టసిద్ధులు) ప్రసాదించగలిగే దేవత. ఈమె ద్వారానే పరమశివుడు ఈ సిద్ధులని సంపాదించాడని, అర్ధనారీశ్వరుడిగా పేరుపొందాడని దేవీపురాణంలో చెప్పబడింది. కమలంలో కూర్చునే ఈ దేవత వాహనం సింహం. నాలుగు హస్తాలలో శంఖ, చక్ర, గదా, పద్మాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది.


ఈ నవదుర్గ ఆరాధనకు యోగపరంగా కూడా అర్థం చెప్పబడింది. అది ఇంకెప్పుడైనా చర్చించుకుందాము.
యాదేవీ సర్వభూతేషు శ్రీరూపేణ సంస్థితా
నమస్తస్యె నమస్తస్యె నమెస్తస్యె నమొ నమః