Thursday, August 14, 2014

శ్రీమహాలక్ష్మీ పాట














శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది.....సౌభాగ్య శోభల వరము తెచ్చింది....

కొంగుబంగరు తల్లి కోరి వచ్చింది....మంగళారతులెత్తి ఎదురేగరండి


జనులారాలెండి నిదురించకండి...శుక్రవారపు సిరిని సేవించరండి

సిద్ధి బుద్ధూలనొసగు భారతీ మూర్తీ....శక్తి యుక్తుల నొసగు పార్వతీ మూర్తీ.


అష్ఠ సంపదలనోసగు శ్రీ సతీ మూర్తీ.....ముమ్ముర్తులకు మూలమీదివ్య
 దీప్తి 

కళ లేని కన్నులకు కనిపించదండీ...కలత ఎరుగని సతుల కరుణించునండీ


ముత్తైదువుల పసుపుకుంకుమల సాక్షీ...పారాణి పాదాల అందియల సాక్షీ

పచ్చతోరణ మున్నా ప్రతి ఇల్లు సాక్షి......నిత్యమంగళమిచ్చు నత్తిల్లే సాక్షి

అటువంటి ఇల్లే కోవెలగ యెంచి.....కొలువుండు ఆ ఆకలిమి కాణాచి వచ్చి 

కిరాత వారాహీ స్తోత్రమ్


అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య ,దూర్వాసో భగవాన్ ఋషిః 
అనుష్టుప్ ఛందః ,శ్రీ కిరాతవారాహీ ముద్రారూపిణీ దేవతా 

హుం బీజం - రం శక్తిః – క్లీం కీలకం 
మమ సర్వశత్రుక్షయార్థం శ్రీ కిరాతవారాహీస్తోత్రజపే వినియోగః 

1::ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం 
క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే 

2::స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీం 
దంష్ట్రాకరాళవదనాం వికృతాస్యాం మహారవాం 

3::ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం 
లోచనాగ్నిస్ఫులింగాద్యైర్భస్మీకృత్వాజగత్త్రయం

4::జగత్త్రయం మోదయంతీమట్టహాసైర్ముహుర్ముహుః 
ఖడ్గం చ ముసలం చైవ పాశం శోణితపాత్రకం 

5::దధతీం పంచశాఖైః స్వైః స్వర్ణాభరణభూషితాం 
గుంజామాలాం శంఖమాలాం నానారత్నవిభూషితాం 

6::వైరిపత్నీకంఠసూత్రచ్ఛేదనక్షురరూపిణీం 
క్రోధోద్ధతాం ప్రజాహంతృ క్షురికే వస్థితాం సదా

7::జితరంభోరుయుగళాం రిపుసంహారతాండవీం 
రుద్రశక్తిం పరాం వ్యక్తామీశ్వరీం పరదేవతాం 

8::విభజ్య కంఠదంష్ట్రాభ్యాం పిబంతీమసృజం రిపోః 
గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః 

9::కపోతాయాశ్చ వారాహీ పతత్యశనయా రిపౌ 
సర్వశత్రుం చ శుష్యంతీ కంపంతీ సర్వవ్యాధయః 

10::విధివిష్ణుశివేంద్రాద్యా మృత్యుభీతిపరాయణాః 
ఏవం జగత్త్రయక్షోభకారకక్రోధసంయుతాం 

11::సాధకానాం పురః స్థిత్వా ప్రవదంతీం ముహుర్ముహుః 
ప్రచరంతీం భక్షయామి తపస్సాధకతే రిపూన్

12::తేపి యానో బ్రహ్మజిహ్వా శత్రుమారణతత్పరాం 
త్వగసృఙ్మాంసమేదోస్థిమజ్జాశుక్లాని సర్వదా 

13::భక్షయంతీం భక్తశత్రో రచిరాత్ప్రాణహారిణీం 
ఏవంవిధాం మహాదేవీం యాచేహం శత్రుపీడనం 

14::శత్రునాశనరూపాణి కర్మాణి కురు పంచమి 
సర్వశత్రువినాశార్థం త్వామహం శరణం గతః 

15::తస్మాదవశ్యం శత్రూణాం వారాహి కురు నాశనం 
పాతుమిచ్ఛామి వారాహి దేవి త్వం రిపుకర్మతః

16::మారయాశు మహాదేవీ తత్కథాం తేన కర్మణా 
ఆపదశత్రుభూతాయా గ్రహోత్థా రాజకాశ్చ యాః 

17::నానావిధాశ్చ వారాహి స్తంభయాశు నిరంతరం 
శత్రుగ్రామగృహాన్దేశాన్రాష్ట్రాన్యపి చ సర్వదా 

18::ఉచ్చాటయాశు వారాహి వృకవత్ప్రమథాశు తాన్ 
అముకాముకసంజ్ఞాంశ్చ శత్రూణాం చ పరస్పరం 

19::విద్వేషయ మహాదేవి కుర్వంతం మే ప్రయోజనం 
యథా నశ్యంతి రిపవస్తథా విద్వేషణం కురు 

20::యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్పితం 
ఇదానీమేవ వారాహి భుంక్ష్వేదం కాలమృత్యువత్ 

21::మాం దృష్ట్వా యే జనా నిత్యం విద్వేషంతి హసంతి చ 
దూషయంతి చ నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ 

22::హంతు తే ముసలః శత్రూన్ అశనేః పతనాదివ 
శత్రుదేహాన్ హలం తీక్ష్ణం కరోతు శకలీకృతాన్ 

23::హంతు గాత్రాణి శత్రూణాం దంష్ట్రా వారాహి తే శుభే
సింహదంష్ట్రైః పాదనఖైర్హత్వా శత్రూన్ సుదుస్సహాన్ 

24::పాదైర్నిపీడ్య శత్రూణాం గాత్రాణి మహిషో యథా 
తాంస్తాడయంతీ శృంగాభ్యాం రిపుం నాశయ మేధునా

25::కిముక్తైర్బహుభిర్వాక్యైరచిరాచ్ఛత్రునాశనం 
కురు వశ్యం కురు కురు వారాహి భక్తవత్సలే 

26::ఏతత్కిరాతవారాహ్యం స్తోత్రమాపన్నివారణం 
మారకం సర్వశత్రూణాం సర్వాభీష్టఫలప్రదం 

27::త్రిసంధ్యం పఠతే యస్తు స్తోత్రోక్త ఫలమశ్నుతే 
ముసలేనాథ శత్రూంశ్చ మారయంతి స్మరంతి యే

28::తార్క్ష్యారూఢాం సువర్ణాభాం జపేత్తేషాం న సంశయః
అచిరాద్దుస్తరం సాధ్యం హస్తేనాకృష్య దీయతే 

29::ఏవం ధ్యాయేజ్జపేద్దేవీమాకర్షణఫలం లభేత్
అశ్వారూఢాం రక్తవర్ణాం రక్తవస్త్రాద్యలంకృతామ్ 

30::ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం జనవశ్యమాప్నుయాత్
దంష్ట్రాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం ప్రయచ్ఛతి 

31::దూర్వాస్యాం సంస్మరేద్దేవీం భూలాభం యాతి బుద్ధిమాన్ 
సకలేష్టార్థదా దేవీ సాధకస్తత్ర దుర్లభః  

ఇతి శ్రీ వారాహీ స్తోత్రమ్ సమాప్తం  

vaaraahi kaaryasidhi mantram 

Om mai klam 
Om namO bhagavatii
uchishTa vaaraahi
trilOkava Sankarii
mama sakala kaaryaam 
saadaya saadaya 

huum bhaT swaaha 

వారాహి కార్యసిధి మంత్రం 

ఓం మై క్లం 
ఓం నమో భగవతీ
ఉచిష్ట వారాహి
త్రిలోకవ శంకరీ
మమ సకల కార్యాం 
సాదయ సాదయ 

హూం భట్ స్వాహ 

వారాహి గాయత్రీ మంత్రం 

ఓం మహిషద్వజాయై విద్మహే
దండ హస్తాయై ధీమహి
తన్నో వారాహి ప్రచోదయాత్ 


ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకొంటే మీరు అనుకొన్న పనులు జరుగుతాయి 

వారాహి దేవి మంత్రం

ఈ మంత్రాన్ని జపిస్తే ఏ మంత్రమైనా తొందరగా సిద్ధిస్తుందిట. అలాగే స్వప్న వారాహి మంత్రం చేస్తే కలలో దేవి కనిపించి సాధకుని ప్రశ్నలకు జవాబిస్తుందిట. దుస్వప్నాలని కూడా రాకుండా ఈ శక్తి కాపాడుతుందని నమ్ముతారు. చిన్న పిల్లలకు ఈ మంత్రం తో విబూది పెడితే పీడ కలలు రావంటారు.


ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠః ఠః స్వాహా

ఈ మంత్రాన్ని 18 సార్లు పఠిస్తే అనుకొన్న కార్యం ఫలిస్తుంది ఇది నిజం 

Wednesday, August 13, 2014

శీతలాదేవి




జ్వరాది వ్యాధుల్ని పోగొట్టే ’శీతలాదేవి’
విశ్వచక్రంలోనున్న దేవతాశక్తుల్ని దివ్య మంత్ర 
నామ స్తోత్రాదులతో స్పందింపజేసి అభీష్టసిద్ధుల్ని సాధించే ’శబ్దచికిత్సా’ 
విధానాలను మన ఋషులు ఏర్పాటు చేశారు.
వ్యాధుల్ని నివారింపజేసి, జ్వరాలను తొలగించే శక్తి ఉన్న శీతలాదేవిని ఉత్తరాది, వంగదేశం, ఉత్కళ రాష్ట్రాలలో ఎక్కువగా ఆరాధిస్తారు. 

సుమారు ప్రతి దేవాలయంలో శీతలాదేవికి చిన్న ఆలయముండడమే కాక, ప్రత్యేకించి శీతలా మందిరాలు సైతం కనిపిస్తుంటాయి. శీతలా స్తోత్రాలు నిత్యపారాయణాలుగా ఉండడమే కాక, అతి సామాన్యులు సైతం ఈ తల్లిని ఆరాధిస్తుంటారు.

ఒకసారి రామకృష్ణ పరమహంస శిష్యునికి అనారోగ్యం కలిగింది. 
అప్పుడతను మాత శారదాదేవితో రైల్లో ప్రయాణిస్తున్నాడు. 
అనారోగ్యం కారణంగా ఆ శిష్యుడు మూసిన కళ్లు తెరవలేక పోతున్నాడు.

అది నిద్రో, లేవలేని నిస్సహాయతో గానీ ఆ అస్పష్ట కలత నిద్రలోనే అతనికొక భయంకరమైన ఆకారం ఒకటి కనిపించి 
'ఇప్పటికే నేను నిన్ను మృత్యువుకు అప్పచెప్పి ఉండేదాన్ని. కానీ, నీ గురువాజ్ఞ మేరకు వదిలి పెడుతున్నాను. 
అయితే, ఇందుకు కృతజ్ఞతగా నేనుచూపించే ఈ దేవతామూర్తికి నువ్వు బాగా తియ్యగా ఉండే రసగుల్లాలను నైవేద్యం పెట్టాలి' అని ఆదేశించి అదృశ్యమైంది. ఆ ఆకారం చూపించిన దేవతా మూర్తి ఎర్రని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంది.

ఆ తరువాత చిత్రంగా అతని అనారోగ్యం నయమైంది.ఎంత తీవ్రమైన జ్వరంగానీ, ఎంతో కాలంనుండి తగ్గకుండా పీడి స్తున్న వ్యాథులు పీడిస్తుంటే ఈ తల్లికి భక్తిశ్రద్ధలతో మొక్కుకుంటే తప్ప కుండా అవి నివారణ మవుతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.

అనంతశక్తి స్వరూపిణియైన జగదంబ తన అనంత అనుగ్రహాన్ని వివిధ విధాలుగా అందించడానికి అనంత రూపాలను ధరించింది. అలాంటి రూపాలలో ఈ శీతలాదేవి ఒకటి, జ్వరహరణ శక్తులలో ఒకటి. 

గాడిద వాహనంపై కూర్చుని చేట, చీపురు, కలశంవంటి వాటితో ప్రకాశించే ఈ తల్లిరూపం రోగనాశక శక్తులకు సంకేతం.

జంతువులలో కూడా అనేక రహస్య శక్తులుంటాయి. 
ఆ శక్తుల్ని గమనిస్తే - కొన్ని జంతువుల ఇంద్రియాలలో సూక్ష్మశక్తులున్న విషయం స్పష్టమౌతుంది. 
ఆ ప్రత్యేకతలన్నీ విశ్వశక్తిలోని అంశాలే.

శక్తులకు సూక్ష్మ జగత్తులో ఉన్న ఆకృతులను మంత్రద్రష్టలు దర్శించి, వాటిద్వారా మనం తగిన ప్రయోజనాలను పొందాలని వివిధ స్తోత్రాలనందించారు.

గాడిద, చేట, చీపురు, కలశం - ఈపరికరాలు రోగకారక క్రిమినాశన, జ్వరహరణ శక్తులకు సంకేతాలు.

స్ఫోటకము, ఉష్ణతలు, తీవ్రజ్వరాలు నశించడానికి, పిల్లలకు వచ్చే ఆటలమ్మవంటి ’మారీ’ వేదనలు తొలగడానికి, శీతలాదేవిని తలంచి ఈ స్తోత్రం చదివితే చాలు - తప్పక ఆ వ్యాధులు నివారణ అవుతాయని శాస్త్రోక్తి. "శీతలా" నామస్మరణమే జ్వరతాపాలను పోగొడుతుందని పురాణవచనం.

అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః - అనుష్టుప్ ఛన్దః - శీతలా దేవలా దేవతా - లక్ష్మీర్బీజం - భవానీశక్తిః -సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః