Tuesday, September 18, 2012

వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ--2012



వినాయక స్తోత్రం

మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలమ్బితసూత్ర
వామనరూప మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే

దేవదేవసుతం దేవం జగద్విఘ్నవినాయకమ్
హస్తిరూపం మహాకాయం సూర్యకోటిసమప్రభమ్


వామనం జటిలం కాన్తం హ్రస్వగ్రీవం మహోదరమ్
ధూమ్రసిన్దూరయుద్గణ్డం వికటం ప్రకటోత్కటమ్


దన్తపాణిం చ వరదం బ్రహ్మణ్యం బ్రహ్మచారిణమ్
పుణ్యం గణపతిం దివ్యం విఘ్నరాజం నమామ్యహమ్

దేవం గణపతిం నాథం విశ్వస్యాగ్రే తు గామినమ్
దేవానామధికం శ్రేష్ఠం నాయకం సువినాయకమ్

నమామి భగవం దేవం అద్భుతం గణనాయకమ్
వక్రతుణ్డ ప్రచణ్డాయ ఉగ్రతుణ్డాయ తే నమః

చణ్డాయ గురుచణ్డాయ చణ్డచణ్డాయ తే నమః
మత్తోన్మత్తప్రమత్తాయ నిత్యమత్తాయ తే నమః

ఉమాసుతం నమస్యామి గఙ్గాపుత్రాయ తే నమః
ఓఙ్కారాయ వషట్కార స్వాహాకారాయ తే నమః

మన్త్రమూర్తే మహాయోగిన్ జాతవేదే నమో నమః
పరశుపాశకహస్తాయ గజహస్తాయ తే నమః

మేఘాయ మేఘవర్ణాయ మేఘేశ్వర నమో నమః
ఘోరాయ ఘోరరూపాయ ఘోరఘోరాయ తే నమః

పురాణపూర్వపూజ్యాయ పురుషాయ నమో నమః
మదోత్కట నమస్తేఽస్తు నమస్తే చణ్డవిక్రమ

వినాయక నమస్తేఽస్తు నమస్తే భక్తవత్సల
భక్తప్రియాయ శాన్తాయ మహాతేజస్వినే నమః

యజ్ఞాయ యజ్ఞహోత్రే చ యజ్ఞేశాయ నమో నమః
నమస్తే శుక్లభస్మాఙ్గ శుక్లమాలాధరాయ చ

మదక్లిన్నకపోలాయ గణాధిపతయే నమః
రక్తపుష్ప ప్రియాయ చ రక్తచన్దన భూషిత

అగ్నిహోత్రాయ శాన్తాయ అపరాజయ్య తే నమః
ఆఖువాహన దేవేశ ఏకదన్తాయ తే నమః

శూర్పకర్ణాయ శూరాయ దీర్ఘదన్తాయ తే నమః
విఘ్నం హరతుదేవేశ శివపుత్రో వినాయకః

ఫలశ్రుతి

జపాదస్యైవ హోమాచ్చ సన్ధ్యోపాసనసస్తథా
విప్రో భవతి వేదాఢ్యః క్షత్రియో విజయీ భవేత్

వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః పాపైః ప్రముచ్యతే
గర్భిణీ జనయేత్పుత్రం కన్యా భర్తారమాప్నుయాత్

ప్రవాసీ లభతే స్థానం బద్ధో బన్ధాత్ ప్రముచ్యతే
ఇష్టసిద్ధిమవాప్నోతి పునాత్యాసత్తమం కులం

సర్వమఙ్గలమాఙ్గల్యం సర్వపాపప్రణాశనమ్
సర్వకామప్రదం పుంసాం పఠతాం శ్రుణుతామపి

ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే స్కన్దప్రోక్త వినాయకస్తోత్రం సమ్పూర్ణమ్


Monday, September 10, 2012

బృహస్పతి వైభవం


బృహస్పతిగ్రహ అనుగ్రహానికి బృహస్పతి వైభవం చదవండి!

బృహస్పతి ఆవిర్భావం::
బృహస్పతి ప్రజాపతి పుత్రుడు…ప్రజాపతి ఎనమండుగురు….అని పురాణాల ద్వారా మనకు తెలుసుస్తోంది.
దక్షప్రజాపతి… త్వష్ట ప్రజాపతి…. కశ్యప ప్రజాపతి ఈ వరుస క్రమం లో… మరీచి… అనే మహాముని కుడా ప్రజాపతి పదవి లభించింది.ఈ ప్రజాపతులు తమ తమ ప్రాతినిధ్యం నిలుపుకొనుటకు అసంఖ్యాకంగా జనగణాలను సృష్టించ సాగారు.దక్షప్రజాపతికి స్త్రీ సంతానం అధికం ఒక కుమార్తె సతీదేవి ఈమే పరమేశ్వర పత్ని…ఒక కుమార్తె దితి ఆమె కశ్యపుని పత్ని…27 మందిని చంద్రునికి ఇచ్చి వివాహం చేసినాడు దక్షప్రజాపతి.
ఇంకొక ప్రజాపతి.. త్వష్ట… తన కుమార్తె …. సంజ్ఞ….సంజ్ఞను సూర్యునుకి ఇచ్చి వివాహం చేసినాడు త్వష్ట.ప్రజాపతి..
ఇదే విధంగా మరీచి ప్రజాపతి…తన పుత్రిక సురూపను ఆంగిరస మహర్షి ఇచ్చి వివాహం చేసినాడు మరీచి ప్రజాపతి. ఆంగిరస మహర్షి దంపతులకు….ఆంగిరస నామ సంవత్సర వైశాక సుద్ధ ఏకాదశి తిది యందు ఉత్తరపల్గుని నక్సత్రం లో బృహస్పతి జన్మించాడు.
బృహస్పతి రూప వివరణ :
ఒక చేతిలో అక్షమాల..మరొక చేతిలో కమండలం…ధరించి దేవతలకు గురువైనాడు బృహస్పతి…
మరో ప్రజాపతి పుత్రిక …తారను వివాహం చేసుకున్నాడు బృహస్పతి.
గురు గ్రహ అనుగ్రహానికి మార్గాలు

1.గురువారం నాడు శెనగలు దానం చేయుట.
2. బంగారం లో కనకపుష్యరాగాన్ని కుడిచేతి చూపుడు వ్రేలికి ధరించుట.
3.గురుధ్యాన శ్లోకం రోజుకి 160 సార్లు జపించుట.
4.గుంటూరు జిల్లా చేబ్రోలు లో గల బ్రహ్మ దేవాలయం దర్శించుట.
5.తమిళనాడు రాష్ట్రం లోని అల్లంగుడి ఆలయాన్ని దర్శించుట.
6.ప్రతి గురువారం సూర్యోదయానికి పూర్వమే 160 ప్రదక్షిణలు చేయుట.
7.గురువారం రోజున గోవుకు గ్రాసం పెట్టుట.
8.నవగ్రహాలలో గురువుగ్రహం వద్ద గురువారం రోజున 16 పసుపురంగు వత్తులతో దీపారాధన పసుపు వస్త్ర దానం చేయుట.
9.16 గురువారాలు 160 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి కేజిం పావు బరువుకలిగిన శెనగలు పసుపు వస్త్రం లో దానం ఇచ్చుట.
10.16 గురువారాలు ఉపవాసం చేసి ఆఖరి గురువారం దక్షిణామూర్తి కి బృహస్పతికి అర్చన చేయించుట.
ఇలా చేయుట వలన గురుగ్రహానికి పాత్రులు అవుతారు.

Wednesday, September 5, 2012

త్రిశక్తులు..త్రిమూర్తులు
























త్రిమూర్తులు

ఈ జగత్తంతా మాయకు అధీనమై ఉంటుంది. అందువల్లనే సంసారం సాగరమని తెలిసినా అందులోనే పడి కొట్టుకుంటూ మోక్షం కోసం ఎవరూ ప్రయత్నించరు. ఈ విషయంలో త్రిమూర్తులు కూడా అతీతులు కారు అని అంటుంది దేవీ భాగవతం ఆరోస్కంధం. అయితే కొద్దిగా మనసుపెట్టి ఆలోచిస్తే, మరికొంత కృషి చేస్తే మాయకు లోబడకుండా ఉండే ఉపాయం వివరిస్తోంది. మాయశక్తి మహిమ సామాన్యమైంది కాదు. ఎలాంటి వారైనా దానికి లొంగి పోవాల్సిందే. హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు

* బ్రహ్మ - సృష్టికర్త
* విష్ణువు - సృష్టి పాలకుదు
* మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు

ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.


* బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత. విష్ణువు నాభి లోని పద్మంనుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు.



* విష్ణువు: సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, వాసుదేవుడు వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగా ప్రసిద్ధము. విష్ణువు యుగయుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు.


* శివుడు: కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు (పునఃసృష్టికి అనుకూలంగా). ఉండేది కైలాసం. వాహనం నంది. త్రినేత్రుడు. తలపై గంగ. మెడలో సర్పము. చర్మాంబరధారి. భక్తసులభుడు. శివుని ఇల్లాలు పార్వతి జగజ్జనని. ఈశ్వరుడు, శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడు ఇవి ఈయన కొన్ని పేర్లు. వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.

విశేషాలు

* ఒక పురాణ కధ ప్రకారం బ్రహ్మకు ఒక శాపం కలిగింది. కనుక బ్రహ్మను పూజించడం అరుదు. కాని త్రిమూర్తులను కలిపి పూజిస్తే దోషం లేదంటారు.
* ఇలా చేసే పూజలలో త్రిమూర్తి వ్రతం ముఖ్యమైనది.





త్రిశక్తులు

త్రిమూతుల భార్యలుగా ప్రసిద్ధి చెందిన వారే ఈ త్రిశక్తులు . 1.సరస్వతి , 2.లక్ష్మి , 3.పార్వతి .

దైవము అనగా శుద్ద చైతన్య స్వరూపమైన మహా వెలుగు. అది అనంతమైనది. అవధులు లేనిది. ఆ శుద్ద చైతన్యము నుండి జీవుల కోరిక మేరకు సృష్టి సంకల్పం బయలుదేరుతుంది. అసలు మూలతత్వానికి సంకల్పంలేదు. అందున్న జీవుల కోరిక వల్ల ఒక సంకల్పం బయటకు వస్తుంది. పరిపూర్ణత పొందటమే ఆ జీవుల కోరిక. అపరిపూర్ణతచేత మరల మరల జన్మిస్తూ వుంటాం. పరిపూర్ణత పొందినవారు, అపరిపూర్ణులకు సహాయమందించుటకు భగవంతుని ప్రతినిధులుగా వారు కూడా దిగివస్తారు. వారే గురుపరంపర. వీరు పరిపూర్ణత కొరకు ప్రయత్నించే వారికి సహాయ సహకారములు అందిస్తారు. వీరు అన్ని లోకములలో పనిచేస్తూ వుంటారు. అలాంటి పరిపూర్ణుల గురించి భగవద్గీతలో విభూది యోగంలో భగవంతునిచే తెలియపరచ బడినది. వారే సనకస నందనాదులు, సప్త ఋషులు, ప్రజాపతులు మొదలగు వారు. కాబట్టి అసలు సంకల్పము జీవులది. ఆ జీవుల సంకల్పము ప్రకారం వారికి పరిపూర్ణులుగా చేయుటకు భగవంతుడు తనను తాను సృష్టించుకొని ఒక మహా చైతన్య స్వరూపుడై వెలుగై నిలుస్తాడు.

ఆ మహా చైతన్యమే అన్నిటికి ఆథారము. దాన్నే అదితి అని, గాయత్రి అని, సావిత్రి అని, సరస్వతి అని అంటారు. దాన్నే త్రిగుణములకు అవతల వున్న అమ్మవారుగా, జగన్మాతగా కొలుస్తాము. ఆ శుద్ద చైతన్య స్వరూపులమే మనమంతా కూడా. కాని మనం త్రిగుణముల నుండి దిగి వచ్చిన కారణంగా త్రిగుణములలో బంధింపబడి వుంటాము.

Tuesday, September 4, 2012

గంగా చరితం - 1

















గంగా చరితం - 1
శోణా నదీ తీరం ప్రకృతి సోయగానికే మారుపేరులా ఉంది. నదీ తరంగాలతో పాటు వీస్తున్న శీతల పవనాలు వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తున్నాయి.
పెద్దగా లోతు లేని ఒండ్రు, ఇసుకతో కూడిన ఆ శుభ జల వాహినిని ఎలా దాటితే శ్రేయస్కరమనే విషయాన్ని సెలవీయవలసినదిగా విశ్వామిత్రుడ్ని అడిగాడు రాముడు.
నాయనా మహర్షులు నడిచే ఒక మార్గం నాకు తెలుసు. ఆ దారిన నడిస్తే మనం శీఘ్రంగా, శుభప్రదంగా ఈ నదిని దాటగలం. రండి చూపిస్తాను.. అంటూ దారి తీశాడు విశ్వామిత్రుడు. వెంట నడిచారు దాశరధులు, మునులూ.
పరమ సుందరమైన ఉద్యాన వనాలను, సైకత మైదానాల శోభలను తిలకిస్తూ ముని సమూహం ముందుకు సాగింది. వారంతా గంగా తీరానికి చేరుకునేసరికి మధ్యాహ్నమైనది. గంగా తీరం సౌందర్యానికి మంత్రముగ్దులయ్యారు వారంతా. అక్కడి శీతల పవనాల స్పర్శ వారి ప్రయాణ బడలికను లిప్త పాటులో హరించింది. మహర్షి సేవితమగు గంగా తీరాన్ని చేరి, యోగులకు ఆలవాలమైన దివ్య తీర్థాన్ని గాంచి మునులు, రాకుమారులు పులకిత గాత్రులయ్యారు.
శ్రేష్టమైన పుణ్య జలంతో కూడిన ఆ అపార జలనిధిలో హంసలనేకం స్వేచ్చగా సంచరిస్తున్నాయి. ఆ అద్భుత దృశ్యం చూపరులకు కమనీయమై ఒప్పింది. ఇక రామ లక్ష్మణుల సంగతి వేరే చెప్పాలా... ఆ మనోహర తీరాన్ని, అచటి పవిత్రతను కనుగొన్న ఆ సోదరులు నిజవాసం చేరినంతగా సంతోషించారు. మునుల ఆనందానికి ఇక అంతే లేదు. ఏలనంటే వారి నిజవాసమే అది గనుక.
పావన గంగా తీరాన మునులందరూ తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేశారు. శాస్త్ర విహితానుసారం స్నాన సంధ్యార్చనలు ముగిసాయి. అగ్నిహోత్రాలను వెలయించారు. వాటిలో హవిస్సులను అర్పించి పితృ దేవతలను, దేవతలను సంతృప్తి పరిచారు. ఆ తదుపరి హోమాన్నాన్ని తృప్తిగా అమృతం వలె సంభావించి భుజించారు ఆ రుషి సంఘమంతా.
ఇలా అన్ని కార్యక్రమాలూ ముగిసిన తర్వాత మునిజనమంతా విశ్వామిత్ర మహర్షి చుట్టూ చేరారు. రుషిజన పరివేష్టితుడైన విశ్వామిత్రుడు ప్రమధగణ పరివేష్టితుడైన పరమశివుని వలె గోచరిస్తున్నాడు.
మునిజనమంతా మహర్షిని అడిగి తమ ధర్మసందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. అందరి ప్రశ్నలకూ సమాధానాలు చెబుతున్న మహర్షి వాత్సల్య పూరితంగా రాముని పరికించాడు.
అప్పుడు రాముడు అడిగాడు వినయంగా... "మహర్షీ ! గంగానదిని త్రిపథగ అంటారు గదా.. ఈ దివ్య జలవాహిని ఎలా ఆవిర్భవించినది ? ఎలా ముల్లోకాలనూ ఆక్రమించినది... మరెలా సముద్రుని చేరుకున్నది... ఇవన్నీ తెలిపి మమ్మల్ని అనుగ్రహించండి"
రాముని ప్రశ్నకు సమాధానంగా కౌశికుడు గంగా చరితాన్ని చెప్పడం ప్రారంభించాడు... (తరువాయి రెండో భాగం )
శ్రీమద్రామాయణం నుంచి... శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం