Thursday, June 21, 2012

కుమారస్వామికి శివపార్వతులిచ్చిన ‘ఫలం’... పళని

తమిళనాడులో శివమహాదేవునికి, ఆ స్వామి మహితపరివారమైన అర్థాంగి పార్వతీదేవి, పెద్దకుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దైవాలకు, వారి కుటుంబాలకు లేదనడం అత్యంత సహజోక్తి.




సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురి పాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరి త్రే ఉన్నది. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే అవి చాలా ఉన్నాయి. కుమార, కుమరన్‌, కుమార స్వామి, స్కంద, షణ్ముఖ, షన్ము గం, శరవణ, శరవణన్‌, గుహ, గుహన్‌ ము రుగ, మురుగన్‌- ఇలా ఎన్నో పేర్లున్నాయి.

తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామి గల వైభ వ ఆలయాలలో ‘పళని’ ప్రముఖమైంది. ఈ పుణ్యనామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భంలో త న ఇరువురు ప్రియ పుత్రులైన గణేశుని, కు మారుని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్తారు. వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరుతా డు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసి న వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వ రూపులైన తన తల్లి, తండ్రుల చుట్టూ అత్యం త భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భత ఫలాన్ని పొందుతాడు. త్వరత్వరగా విశ్వప్ర దక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మ ణ్యస్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు.





అది చూసి శివ దేవుడు జాలిపడి ‘‘అన్న య్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత! నీవే ఒక అద్భుత ఫలానివి ‘ఫలం- ని’! నీ పేరిట ఒక సుందర మహిత పుణ్య క్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్లి నివా సం ఉండు’’ అంటూ కుమారుని బుజ్జగించా డు. దీంతో వైభవమైన ‘పళని’ రూపుదిద్దు కుంది. అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమయింది!.

పళనిలోని మురుగన్‌ ఆలయం సహజ సిద్ద మైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పం డుగైన కొండపై నిర్మితమైంది!. దీనిని ‘మురు గన్‌ కొండ’ అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై ‘ఏరియల్‌ రోప్‌ - వే’ ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణకో సమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబ డింది. సాధారణంగా భక్తులు ముందు గిరిప్ర దక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు!. మెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరగానే చు ట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి. మొట్ట మొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శన మిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముం దుకు వెలితే వరవేల్‌ మండపం కనిపి స్తుంది. ఈ మండప స్థంబాలు అ త్యంత సుందరమైన శిలా చిత్రాల తో మంత్రముగ్ధులుగావిస్తాయి.





ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి. గర్భగుడిలో ప్రతిష్టితమైన కమనీయ కుమా రస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్ర ముఖుడైన భోగార్‌ పర్వవేక్షణంలో రూపొం దింపబడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. దీనిని ‘న వ పాషాణం’ అనే విశేషమైన శిలనుమలచి త యారు చేశారని, ఇందులో శక్తివంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు. ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూప, దీప సమ ర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్ర హంలోని సునిశితమైన మూలికా పదార్థం క్రి యాశీలమై ఒక విధమైన వాయువులను వెలు వరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్నివ్యా ధులకు సంబంధించిన దోషాలు హరించుకు పోయి ఆరోగ్యవంతులవుతారని చెబుతారు!. మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వా మి భక్తజన సంరక్షకుడుగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపు రూప దివ్య దర్శన భాగ్యాన్ని అందజేస్తారు.

http://www.suryaa.com..nundi sekarinchinadi meeku inkaa kotta vaartalu chudaalante ii link pai clck cheyandi

No comments: