Sunday, August 15, 2010

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి--Sri SubramanyaSwami








గౌరీ శంకరుల మంగళకర ప్రేమకు,అనుగ్రహానికి ఐక్య రూపంసుబ్రహ్మణ్యస్వామి. షణ్ముఖుడు,కార్తీకేయుడు, వేలాయుధుడు,కుమారస్వామి గా పేరు గడించినస్వామి కారణజన్ముడు.తారకాసురుడు, సురావణుడుమరికొందరు రాక్షసులు ప్రజలను,దేవతలను హింసిస్తూ ఉండేవారు. ఈఅసురల బారి నుండి కాపాడమనిబ్రహ్మను కోరగా, శివ పార్వతులకుజన్మించిన పుత్రుడు వారిని వధిస్తాడనిచెప్పాడు. ఆ రకంగా పార్వతిపరమేశ్వరుల అనుగ్రహం తోకుమారస్వామి పుట్టుక విలక్షనమైనది.

శివాంశతో జన్మించినసుబ్రహ్మణ్యస్వామి గంగాదేవి గర్భంలోపెరుగుతాడు.గంగాదేవి ఆ పుత్రునిభారం మోయలేక రెల్లు పొదల్లోకి జారవిడుస్తుంది. అప్పుడు కృత్తికా దేవతలు ఆరుగురు తమస్తన్యమిచ్చి పెంచుతారు. రెల్లు పొదల్లో పెరిగినందువల్ల శరవణుడు అని, కృత్తికా దేవతలుపెంచినందు వల్ల కార్తికేయుడని పేరు వచ్చినది అని పురాణాలు చెబుతున్నాయి. ఆరుముఖాలు కలిగినందు వల్లనా షణ్ముఖుడు అని అంటారు. నెమలి వాహనం కలిగిన స్వామిగణేశునికి సోదరుడు. ఆరు ముఖాలలో ఐదు పంచేంద్రియాలకు, ఒకటి మనసుకు ప్రతీక.

స్వామి అనే నామధేయం సుబ్రహ్మణ్య స్వామి కి మాత్రమే సొంతం. సేనాపతిగా సకల దేవగణాలచేత పూజలు అందుకొనే సుబ్రహ్మణ్యుని అనుగ్రహం పొందితే గౌరిశంకరుల కటాక్షం లభిస్తుందనిప్రతీతి. తారాకాసురుడిని సంహరించిన కుమార స్వామి మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడుజన్మించాడు. ఆరు ముఖాలు, పన్నెండు చేతులు సూర్య తేజస్సుతో జన్మించిన షణ్ముఖునిఆరాధించడం వలన సమస్తదోషాలు తొలగి, శుభాలు కల్గుతాయని భక్తుల నమ్మకం.ఆషాడమాస శుక్ల పక్ష పంచమి, షష్టిని పర్వదినాలుగా జరుపుకొంటారు. శుక్ల పక్ష పంచమినిస్కంద పంచమని, షష్టిని కుమార షష్టి అని భావించి భక్తులు ఆ రెండు రోజుల విశేష పూజలుచేస్తారు.
పంచమి నాడు ఉపవాసం ఉంది, షష్టి నాడు కుమారస్వామి ని పూజించినట్లైతే నాగ దోషాలుతొలగుతాయని, జ్గ్యానం వృద్ధి కలుగుతుందని, కుజదోషాలు తొలగుతాయని, సంతానంకలుగుతుందని నమ్మకం.

హే స్వామినాధ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతి సుముఖ పంకజ పద్మబందో
శ్రీ శాది దేవగణాధిత పాదపద్మ
వల్లీ సనాధ దేహి కరావలంభం

నేను casual గా నాగేద్రుని చిత్రాన్ని

webలో వెతుకుతున్నప్పుడు ఈ సుబ్రమణ్యంస్వామి కథ

simpleగా చాలా అర్థమయ్యెట్లుగా వుండెది

చదివి అది నాకు నచ్చి

నా Blogలో వేసుకొన్నాను ఇది నాసొంతం కాదు నాకు నచ్చినదీ మీకూ

నచ్చవచ్చుననీ ఈ పురాణం వేసాను :)

No comments: