Friday, March 30, 2012

శ్రీరామ నవమి
























శ్రీ రామ రామ రామేతి రామే రామే మనోరమే
సహశ్రనామ తత్‌తుల్యం రామనామ వారాననే! (2)

రాముడుద్భవించినాడు రఘుకులంబునా

చైత్రమాసం,పునర్వసు నక్షత్రం,నవమి రోజున శ్రీ రామచంద్రుడు జన్మించెను.
నవమి నాడే సీతామహాదేవితో వివాహముజరిగెననీ,
నవమి నాడే రాజ్య పట్టాభిషేకము జరిగెనని రామాయణ కావ్యము తెలుపుచున్నది.
శ్రీ రామ చంద్రునికి నవమికి వున్న యీ సంబంధం వల్ల శ్రీరామనవమి పండుగను
భారతీయులందరూ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో నవమి నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

శ్రీరామ నవమి వేసవి కాలంలో వచ్చే పండుగ.చైత్ర శుద్ధ నవమి నాడు,
అనగా చైత్ర మాసంలోని శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు.

వందే రఘునందనం
దక్షిణే లక్ష్మణో ధ్వనీ వామతో జానకీ శుభా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం
యత్రరామో భయం నాత్ర నాస్తి తత్రపరాభవః
సహి శూరో మహాబాహుః పుత్రో దశరధస్య చ !!

కుడివైపు ధనర్ధుడైన లక్ష్మణునితో
ఎడమవైపు శుభ లక్ష్మణ అయిన జానకీదేవితో,
ఎదురుగా ఆంజనేయునితో ఉన్న ఆ రఘునందనునికి వందనం.
శూరుడు,మహావీరుడూ, అయిన రాముడు ఎక్కడ వుంటాడో
అక్కడ భయమనేది వుండదు.

రామ మహిమ, రామనామమహిమ ఎంతటివంటే
రాముని చరితలో ఒక్క అక్షరమే మహాపాతకాలను
నశింపజేస్తుందని మహాకవి మనకు హామీ ఇస్తున్నారు.
రాముడు కల్యాణ గుణధాముడు.పావన చరితుడు.
జగత్తులోని మంచినంతటినీ రాశిపోయగా ఏర్పడినవాడే జగదభిరాముడు.
అందుకే రాముడూ,రామాయణమూ ఉన్నచోట అంతా శుభమే కాని,దారిద్య్రాము,
ధఃఖమూ,అనేవి వుండవు.లౌకిక ఆధ్యాత్మికాల మధ్య సేతువు కట్టినవాడు రాముడు.
ఆ రెంటి మధ్య తేడా లేదనీ ఆచరణలో బోధించిన వాడు రాముడు.
ఆ సుగుణాభిరామిని జీవితగాధ నుంచి ఏ కొంచం స్ఫుర్తించినా,
ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోంటాం.అటువంటి పుణ్యశ్లోకుని,
పురుషోత్తముని స్మరించుకొనే శ్రీరామ నవమి పర్వదినం ఈ మాసంలోనే.
ఈ వసంతం ప్రతి ఒక్కరి జీవితంలోనూ నవ్యవసంతాన్ని నింపాలనీ
కోరుకొంటూ ఉగాది శ్రీరామ నవమి సంధర్భంగా
బ్లాగు ప్రజలందరికీ నా హౄదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

పూజకైనా వినాయకధ్యానం,సంకల్పం,పూజ చేసె దేవునికి
షోడశపూజలు మాములే గనుక పూజ యధావిధిగా వాటిని ముగించి
ఆపై శ్రీరామాష్టకం,శ్రీరామ అష్టోత్తరం,జానకీ అష్టకం పఠించి
పూవులతో పూజ చేయాలి.చైత్రమాసం మల్లెలమాసమే గనుక
మల్లెపూవులతో పూజించడం శుభప్రదం.
మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు
ఏదైన సువాసనలుగల తెల్లరంగు పూవులతో సీతాలక్షమ్ణాంజనేయ
సమేత శ్రీరామ పఠానికి పూజించాలి.

వడపప్పు,పానకం, శ్రీరామయ్యకు ప్రీతి. అంటే స్వామి
ఖరీదైన వ్యయప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడనీ
స్వామి సాత్వికుడనీ భక్తులనుండి పిండివంటలుగాక పరిపూర్ణ భక్తి
విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడనీ మనకు అర్థం కావాలి.

వడపప్పు స్నానానికి ముందుగా నానబెట్టుకోకూడదు.
స్నానానంతరం మొదట వడపప్పు నానబెట్టుకొంటే,
తక్కిన వంటలు పూజాదికాలు పూర్తయి,నైవేద్య సమయానికి
ఎలాగూ నానుతుంది.ఆరోజు ఏ వంట చేయాలనుకొన్నారో
ఆ వంట పూర్తిగావించి అదికూడా నైవేద్యం చేయాలి.
వీటితోపాటు ఏదైన ఒక ఫలం నివేదించాలి.

పూజ పూర్తయి నైవేద్యం అయ్యకా తప్పనిసరిగా ఒక ముత్తైదువకు
గానీ,కుటుంబ సభ్యులు, లేక బందువర్గంలోని పెద్దవారికి గాని
శక్త్యానుసారం తాంబూలం ఈ ప్రసాదాలు,వంటలలో కొంత భాగం
ఇచ్చి,కాళ్ళకు నమస్కరించాలి.ఆనాటి రాత్రి ఏదైన అల్పాహారంతో
ఉపవాస దీక్ష చేయాలి.పండ్లు,పాలతో గడిపితే మరింత శ్రేష్టం.
అంటే ఈ పూజరోజున ఒకపూట భూజనం చేయాలన్నమాట
చైత్రమాసంలోని పునర్వసు,నక్షత్రాలలో కుదరకపోతే
ఏ నెలలోనైన పునర్వసు నక్షత్రాలలో ఈ పూజ చేసుకోవచ్చు.

భక్తి కుముదంలోని కొన్ని ఆణిముత్యాలను ఇక్కడ పొందు పరిచాను.
తప్పులున్నా క్షమించమని ప్రార్థన.

Thursday, March 22, 2012

ఉగాది..శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు

























































ఉగాది వచిందోయ్ కొత్త వసంతాలను మోసుకొచ్చిందోయ్
అందరికీ మిత్రులకీ..బంధువులకు..తదితరులకు అందరికీ..
ఉగాది..శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ.
ఉగాది రోజున ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు



ఉగాది పచ్చడి - ప్రాముఖ్యత:
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటాఱు.
ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

"త్వామష్ఠ శోక నరాభీష్టమధుమాస సముద్భవనిబామి శోక సంతప్తాంమమ శోకం సదా కురు

ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.

ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం

ఉగాది ప్రసాదంఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం ,వడపప్పు చోటు చేసుకుంటాయి.ఉగాదితో వేసవి ఆంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది అలాగే వడపప్పు కూడా వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుం కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది.ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది.ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి,ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రాలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది.

ఒక వారం ముందే పండగ పనులు మొదలవుతాయి. ఇంటికి వెల్ల వేసి, శుభ్రం చేసుకుంటారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రీ కొనడంలో ఉత్సాహం పండుగ సందడి ఒక వారం ముందేమొదలవుతుంది. పండుగ రోజున తెల్లవారుఝామునే లేచి, తలస్నానం చేసి, ఇంటికి మామిడి తోరణాలు కడతారు. పచ్చటి మామిడి తోరనాలకు ఈ రోజుకు సంబంధించి ఒక కధ ఉంది. శివపుత్రులు గణపతి, సుబ్రమణ్యస్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవించాడని కధ. ప్రతీ ఇంట ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి , రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దుతారు. శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంత శుభం కలగాలనికోరుకుంటారు. ఆరోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు . ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలెడతారు.
ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు విశేషం.

పంచాంగ శ్రవణం:
ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సరరాశి ఫలాలు తెలుసుకుంటారు సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు. పంచాంగ శ్రవణం వాళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది.

ఊరగాయల కాలం:
మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి, ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది "ఆవకాయ". “ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది”
అందరికీ మిత్రులకీ..బంధువులకు..తదితరులకు అందరికీ..
ఉగాది..శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు

Thursday, March 8, 2012

హోళీ...వసంతకేళీ
















హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాసిస్తాయి, అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషము.

పురాణ కథలతో పాటుగా హోళి పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోళి పండుగను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు.ఇది చలి కాలం తొలగి పోయి ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన వంటిది. హోళి పండుగను సాధారణంగా ' ఫాల్గుణి పూర్ణిమ' నాడు జరుపుకుంటారు. ఇలా ఓక ఋతువు వెళ్ళి మరో ఋతువు వచ్చే సమయంలో ముఖ్యముగా శీతాకాలం 'చలి' పోయి ఎండాకాలం 'వేడి' వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడావల్ల చర్మం చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయి.

ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట కుప్ప పోశారా అన్నంత అందంగా, ఆహ్లాదంగా జరిగే హోళీ అంటే చిన్నా పెద్దా అందరికీ ప్రియమే! వయోభేదం, ఆడా, మగా అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఓ పండుగలా జరుపుకునే హోళీ వివరాలు...

హోళీ ఎప్పుడు ప్రారంభమయిందంటే.... హోళీ పండుగ ఈనాటిది కాదు. ద్వాపర యుగంలోనే ఈ పండుగ జరుపుకున్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. తన నెచ్చెలి రాధ తనకంటే తెల్లగా ఉంటుందని, తనది నలుపని కృష్ణుడు తల్లి యశోద దగ్గర వాపోతాడు. అప్పుడు యశోద కృష్ణుడికి ఓ సలహా ఇస్తుంది. రాధ శరీరం నిండా రంగులు పూయమని కన్నయ్యకు తరుణోపాయం చెబుతుంది. తల్లి సలహా మేరకు ఆ వెన్నదొంగ రాధను పట్టుకుని ఆమెమీద రంగులు కలిపిన నీటిని కుమ్మరిస్తాడు. దానికి ప్రతిగా రాధ కూడా కృష్ణుడిమీద వసంతం కుమ్మరిస్తుంది. అప్పటినుంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు ఒకరిమీద మరొకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమయింది.

కాముని దహనం

హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. ఈ విధానం హోళీ ముందురోజు చలిమంటలు వేయడానికి కూడా పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. హిరణ్యాకశపుని సోదరి, ప్రహ్లాదుని మేనత్త హోళిక. ప్రహ్లాదుడు తన అన్నను చంపించాడన్న కోపంతో ఇంట్లోనే మంటలు రగిల్చి అందులోకి ప్రహ్లాదుడిని తోసే ప్రయత్నం చేస్తుంది. ఆ మంటలు ప్రహ్లాదుని ఏమీ చేయకుండా, హోళికను మాత్రం దహించి వేస్తాయి. అలా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోళీకి ముందురోజు కాముని దహనం పేరుతో చలిమంటలు వేయడం ఆనవాయితీగా వస్తోన్న ఆచారం.

కాముని దహనానికి ఆ పేరు ఎలా వచ్చింది ?

ఓ సమయంలో ధ్యాన నిష్టలో ఉన్న శివునిపై మన్మథుడు పూలబాణాలు వేసి తపోభంగం కలిగిస్తాడు. తన తపస్సు భగ్నం చేసినందుకు శివుడు మన్మథుడిపై ఆగ్రహించి, తన త్రినేత్రంతో కాముడిని అంటే మన్మథుడిని భస్మం చేస్తాడు. తర్వాత రతీదేవి మొర ఆలకించిన శివుడు శాంతించి మన్మథుడిని తిరిగి బ్రతికిస్తాడు. దానికి గుర్తుగానే హోళీ పున్నమికి ముందు కాముని దహనం చేస్తారు. ఇక్కడ కామం అంటే కోర్కె, బాధ అనే అర్థాలు కూడా చెప్పుకుంటారు.
రంగు రంగుల హోళీ మన జీవితాల రసకేళీ అంటూ అందరూ ఆనందంగా జరుపుకొనే వసంతకేళి ఈ హోళీ
అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు అందరూ ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని ఆశిస్తు.....


Saturday, March 3, 2012

శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి
























శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి

1}ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః

2}న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః

3}మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః

4}నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః

5}రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః

6}య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః

7}ణా ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః

8}య యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః
సుజ్ఞానగోచరాయాజ్స్తు యకారాయ నమో నమః

SreemannaaraayaNaashTaaksharee stuti

1}OM OM nama@h praNavaarthaartha sthoolasookshma ksharaakshara
vyaktaavyakta kaLaateeta OMkaaraaya namO nama@h

2}na namO daevaadidaevaaya daehasaMchaarahaetavae
daityasaMghavinaaSaaya nakaaraaya namO nama@h

3}mO mOhanaM viSvaroopaM cha SishTaachaarasupOshitam^
mOhavidhvaMsakaM vaMdae mOkaaraaya namO nama@h

4}naa naaraayaNaaya navyaaya narasiMhaaya naaminae
naadaaya naadinae tubhyaM naakaaraaya namO nama@h

5}raa raamachaMdraM raghupatiM pitraaj~naaparipaalakam^
kausalyaatanayaM vaMdae raakaaraaya namO nama@h

6}ya yaj~naaya yaj~nagamyaaya yaj~narakshaakaraaya cha
yaj~naaMgaroopiNae tubhyaM yakaaraaya namO nama@h

7}Naa NaakaaraM lOkavikhyaataM naanaajanmaphalapradam^
naanaabheeshTapradaM vaMdae Naakaaraaya namO nama@h

8}ya yaj~nakartrae yaj~nabhartrae yaj~naroopaaya tae nama@h
suj~naanagOcharaayaajstu yakaaraaya namO nama@h

Friday, March 2, 2012

సుప్రభాతం



















ప్రాతః స్మరామి హృదిసంస్ఫురదాతమతత్వం!
సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్!
యత్స్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం!
తత్బ్రహ్మ నిష్కల్మహం న చభూతసంఘః!!

సచ్చిదానందరూపము, మహాయోగులకు శరణ్యం, మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన ఆత్మ తత్త్వమును ప్రాతఃకాలమునందు నా మదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మ స్వరూపము స్వప్నమూ, జాగరణ, సుషుప్తి అను వాటిని తెలుసుకొనుచున్నదో నిత్యమూ భేదము లేనిదీ అగు బ్రహ్మను నేనే. నేను పంచ భూతముల సముదాయము కాదు.

ప్రాతర్భజామి చ మనోవచసామగమ్యం!
వాచోవిభాన్తి నిఖిలా యదనుగ్రహేణ!
యం నేతి నేతి వచనైహ్ నిగమా అవోచు!
స్తం దేవ దేవమజ మచ్యుతమాహురగ్ర్యం!!
మనస్సుకు, మాటలకు, అందని ఆ పరబ్రహ్మను ప్రాతఃకాలమునందు సేవించుచున్నాను. ఆయన అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు వెలుగొందుచున్నవి. వేదములు నేతి నేతి (ఇది కాదు ఇది కాదు) వచనములచే ఏ దేవుని గురించి చెప్పుచున్నవో, జనన మరణము లేని ఆ దేవ దేవునే అన్నిటికంటే గొప్ప వాడుగా పండితులు చెప్పారు.

ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం!
పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యాం!
యస్మిన్నిదం జగదశేషమశేష మూర్తౌ!
రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై!!
అజ్ఞానాంధకారము కంటే వేరుగా సూర్యుని వలే ప్రకాశించు పూర్ణ స్వరూపుడు, సనాతనుడు, అగు పురుషోత్తముని ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను.అనంత స్వరూపుడగు ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో సర్పము వలే కనపడుచున్నది.

శ్లోకత్రయమిదం పుణ్యం లోకోత్రయ విభూషణం!
ప్రాతః కాలే పటేద్యస్తు సగత్సేత్పరమం పదం!!
మూడూ లోకములను అలంకరించునవి, పుణ్యకరములు అగు ఈ శ్లోకములను ఎవరైతే ప్రాతః కాలమునందు పటించునో వారు మోక్షమును పొందును.

నిర్వాణ షట్కం























(1 )
మనో బుద్ధ్య హంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే
నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు: చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను, చిత్తమునూ కాను, నేను
కర్ణములనూ కాను, నేను జిహ్వ నూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము ఐననాసికనూ కాను,
నేను చక్షురింద్రియము ఐన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీ
కాను నేను తేజస్సునూ కాను, నేను వాయువునూ కాను, చిదానంద రూపుదనైన శివుడనే,
శివుడనే. నేను అంతః కరణ చతుష్టయము ఐన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను
కాను. నేను జ్ఞానేద్రియములైన త్వక్, చక్షు, శ్రోత్ర, (జిహ్వ)రసన, ఘ్రాణ ఇంద్రియములు అంటే
చర్మము, కనులు, చెవులు,నాలుక, నాసిక(ముక్కునూ) కాను.అంటే 'నాకోసం' అని ఎవరి కోసం
అయితే చర్మము ద్వారా, కనుల ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, ముక్కు ద్వారా
ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నానో ఆ అనుభవించేది నేను కాను. ఆ
అనుభవము నాదీ కాదు. అంటే అనుభవించే వాడు వేరే, నేను కాదు. అంటే నాకోసం అని
తుచ్చమైన ఆనందాలకు నేను లోను కానవసరం లేదు, కాకూడదు, అంటే నేనే కాదు ఎవరూ
కూడా లోను కావలసిన అవసరం లేదు. ఎందుకంటే వీటి ద్వారా కలిగే ఆనందాలు క్షణికాలు
కనుక! నేను పంచ మహా భూతములు ఐన పృదివ్యాపస్తేజో వాయురాకాశములను కాను.అంటే
నేను భూమిని కాను, జలమును అంటే నీరునూ కాను, తేజస్సు అంటే అగ్నినీ కాను, నేను
వాయువునూ కాను, ఆకాశమునూ కాను. పంచ భూతాత్మకమైన ఈ శరీరమును నేను కాను.
ఎందుకంటే పంచ భూతాత్మికమైన ఈ శరీరం పంచ భూతములలో కలిసిపోతుంది కనుక. ఇక్కడి
ఇంకొక రహస్యం ఏమిటంటే పంచ తన్మాత్రలైన శబ్ద, రూప, స్పర్శ, రస, గంధములనుండి వరుసగా
పంచ మహా భూతములు ఐన ఆకాశము,అగ్ని,వాయువు, జలము, భూమి ఉద్భవించాయి,
వీనిని గ్రహించడానికి, అనుభవించడానికి వరుసగా పంచ జ్ఞానేంద్రియములు ఐన చెవులు, కనులు, చర్మము, జిహ్వ, నాసిక ఉద్భవించాయి. వీటి ద్వారా ఈ జ్ఞానములు అనుభవం లోకి వస్తాయి
కనుక వీటిని జ్ఞానేంద్రియములు అన్నారు.

2)
నచ ప్రాణ సంజ్ఞో నవై పంచా వాయుర్నవా సప్త ధాతుర్నవా పంచ కోశః
న వాక్ పాణి పాదౌ నచోపస్థ పాయు చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను ప్రాణ వాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు సంఘమును కాను,
సప్త ధాతువులైన రక్త, మాంస, మేథ, అస్థి, మజ్జ, శుక్ర, రసములను కాను, నేను అన్నమయ,
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే పంచ కోశములను కాను, నేను
పంచ కర్మేంద్రియములైన వాక్కు, చేతులు, పాదములు, కామ ఇచ్చను తీర్చుకునే ఇంద్రియమును
కాను, విసర్జక అవయవ ఇంద్రియమునూ కాను..చిదానంద రూపుదనైన శివుడనే, నేను శివుడనే!

(3)
న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ
న ధర్మో నచార్దో న కామో న మోక్షః చిదానంద రూపశ్శివోహం శివోహం

నాకు ద్వేషము లేదు, రాగము లేదు, నాకు లోభము లేదు,మోహము లేదు, నాకు మదము కానీ, మాత్సర్యము కానీ లేవు, నాకు ధర్మము, అర్ధము, కామము, మోక్షము లేవు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! అనగా నాకు ఏ ద్వంద్వములూ లేవు, నాకు యే
పురుషార్ధములూ లేవు..ఎందుకనగా..నేను భౌతిక శరీరాన్ని కలిగిన మానవుడిని కాను కనుక,
నేను సాక్షాత్తూ శివుడను కనుక, మానవ సహజమైన మంచి చెడులకు అతీతుడను కనుక!

4)
న పుణ్యం న పాపం న సౌఖ్యం న డు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ
అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శ్శివోహం శివోహం

నాకు పుణ్యము లేదు, పాపమూ లేదు, సౌఖ్యము లేదు, దు:ఖము లేదు,మంత్రము, తీర్ధము,
వేదము, యజ్ఞము, ఏవీ లేవు. నేను అనుభవమును కాను, అనుభవించుట యను క్రియనూ
కాను, అనుభవించే వాడినీ కాను, నేను చిదానంద రూపుడనైన శివుడను, నేను శివుడను!

(5)
న మృత్యుర్నశంకా నమే జాతి భేద: పితా నైవ మే నైవ మాతా చ జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపశ్శివోహం శివోహం

నాకు మృత్యువు లేదు, శంకా లేదు, జాతి భేదములు లేవు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జన్మ
లేదు, నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యులు లేరు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! జనన మరణములు, జాతి భేదములు, తల్లి దండ్రులు,
గురు శిష్యులు..ఏ బంధములు లేవు..ఎందుకనగా..నేను శివుడను కనుక..అన్ని బంధములకు, అనుబంధములకు అతీతుడను కనుక!

6)
అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న చా సంగతం నైవ ముక్తిర్నబంధః చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను నిర్వికల్పుడను అనగా నాకు వేరే సాటి ఐనది లేదు, నేను నిరాకారుడను, ఎందుకంటే ఈ
ఆకారం శాశ్వతం కాదు కనుక, అన్నింటికీ, అంతటా అన్ని ఇంద్రియములకూనేనే అధిపతిని, నాకు సంబంధించినవి, సంబంధించనివి ఏవీ లేవు, నాకు ముక్తి లేదు, బంధమూ లేదు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! ఇది నిర్వాణ శతకమునకు సాహిత్యానువాదము, కొద్ది వ్యాఖ్యానముతో. ఆది శంకరాచార్యులవారి సాహిత్యం స్తోత్ర భక్తి సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు
అని రెండుగా విభజించ వచ్చు క్లుప్తముగా. ఇది వైరాగ్య ప్రకరణముల కోవలోనిది. ఆధునిక పోటీ
పరీక్షలలో జవాబులు తప్పుగా ఇచ్చినప్పుడు, సరిగా జవాబులిచ్చిన కారణంగా వచ్చే 'మార్కుల'
నుండి తప్పుగా ఇచ్చిన వాటికి శిక్షగా మార్కులు తగ్గించే పద్ధతి వుంటుంది కొన్ని పరిక్షలలో.
అందుకని సమాధానం సరిగా తెలియనప్పుడు సరి కాని సమాధానములను వరుసగా ఇది కాదు,
ఇది కాదు అని చివరికి సరి ఐన లేదా సరి ఐనట్లు అనిపించిన సమాధానమును చేరుకొనే పద్ధతి
మొకటి ఉంది. దీనినే తీసివేత పద్ధతి లేదా ఆంగ్లంలో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం, అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది
భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక
'ఇది కాదు' 'ఇది కాదు' అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని
తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతం 'నేతి'..'నేతి'..అంటే
.'న ఇతి'..'న ఇతి'..అంటే..'ఇది కాదు'..'ఇది కాదు'..అనే 'నేతి' మార్గం అని చెప్పింది! ఈ నిర్వాణ
శతకం లో 'చిదానంద రూపుడైన శివుడు' అనే పరమాత్మ తత్త్వాన్ని అదే మార్గంలో ఆది శంకరుడు
తెలియ జేశారు! నిర్వాణ షట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో
దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము కాని, ఇక్కడ క్లుప్తముగా మాత్రమే చర్చ ప్రస్తుతానికి!
ఒకరి అభ్యర్ధన మేరకు, వారి సందేహములను ప్రస్తుతానికి తీర్చడానికి నాకున్న కొద్ది పరిధిలో, అల్ప జ్ఞానముతో చేస్తున్న ప్రయత్నము ఇది.

మనో బుద్ధ్యాహంకార చిత్తాని నాహం.. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు
విధములైన అంతః కరణ ప్రవృత్తులు వున్నాయి.

మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా,
క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది, వుసి గొల్పుతుంది, పురి
కోల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది, ఆకాశానికి ఎత్తేస్తుంది,
అందలాలెక్కిస్తుంది, అధః పాతాళానికి తొక్కేస్తుంది. కనుకనే మనసే అన్నింటికీ కారణం, ప్రేరణం,
ఉత్ప్రేరకం, వినాశకరం. అందుకే ' మన ఏవ మనుష్యాణామ్ కారణం బంధ మోక్షయో:
' మనుషుల బంధాలకు, మోక్షానికి కారణం మనసే అన్నది ఒక ఉపనిషత్తు! 'ద్వే శబ్దే బంధ
మోక్షాయ మమేతి న మమేతిచ, మమేతి బధ్యతే జంతు: న మమేతి విముచ్యతే.. 'నాది',
'నాది కాదు' అనే రెండు శబ్దాలే బంధానికీ, మోక్షానికీ కారణాలు, నాది అనుకుంటే బంధం,
ఎందుకంటే నాది అనే దానితో మొదలై, నాది మాత్రమే, నాకు మాత్రమే, నాకు కాకున్నా పరవా
లేదు ఎవరికీ కాకూడదు..నాది కాకున్నా పరవా లేదు, ఎవరిదీ కాకూడదు, ఎవరికీ చెందకూడదు..
అనే దాకా దారి తీస్తుంది. ఆది వినాశనానికి దారి తీస్తుంది. ఈ నాడు సమాజంలో జరుగుతున్న
హింసకు, దౌర్జన్యానికీ అదే కారణం!

బుద్ధి విచక్షణను కలిగిస్తుంది. మంచి, చెడులను గ్రహింప గలుగుతుంది. చిత్తము తన ఇష్టం
వచ్చినట్లుగా ప్రవర్తించేలా చేస్తుంది. అహంకారం మహదహంకారం(గొప్ప అంధకారం)
మిధ్యాహంకారం (మిధ్యాన్ధకారం) అని రెండు రకాలుగా ఉన్నది. అహంకారం అంటేనే అంధ కారం.
సృష్టికి మొదలు మహా అంధకారం వ్యాపించి వున్నది..ఏదీ తెలియని బ్రహ్మ దేవుడు తనకన్నా పరమాత్ముడు ఐన వాడిని ప్రార్ధిస్తే ఆ శ్రీ మహా విష్ణువు తన తేజః పుంజములతో దానిని తొలగించి కరుణిస్తే, అప్పుడు బ్రహ్మ తన సృష్టిని కొనసాగించాడు అని పురాణ గాధ.

నేను అనేది సాత్త్వికాహంకారం, నేను కూడా అనేది రాజసిక అహంకారం, నేను మాత్రమే అనేది
తామసిక అహంకారం! నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడి నుండి, ఎక్కడికి అనే అన్వేషణ
సాత్త్వికమైనది, మనిషిని వున్నతుడిని చేస్తుంది. నేను కూడా అనేది రాజసికమైనది, నాకూ ఒక
ఉనికి, ఒక సత్తా ఉంది అనే సాధనకు ఉపకరిస్తుంది..ఈ రెండూ మంచివే..అవసరమైనవే. నేను
మాత్రమే, నాకు మాత్రమే, నాది మాత్రమే అనేది తమసికమైనది, ఆది కలిగివున్నవాడిని, వాడి
ద్వారా సర్వాన్నీ నాశనం చేస్తుంది. ఈ నాశనానికి చిత్తం బాటు వేస్తుంది, చిత్తం వచ్చినట్లు
ప్రవర్తించడం ద్వారా, దానికి మనసు కారణమౌతుంది సరిగా వుపయోగించకుంటే, మనసే
అన్నింటికీ కారణం కనుక దానిని బుద్ధికి స్వాధీనం చేసి, అప్పుడు బుద్ధి ద్వారా కలిగిన విచక్షణతో
మంచి చెడులను తెలిసికొని, మంచిని గ్రహించి, చెడును విసర్జించాలి కనుక బుద్ధి పరమాత్మ తత్త్వం. ఉపనిషత్తులు అన్నీ ఇదే చెప్పాయి.

ఆత్మానగుం రధినం విద్ధి శరీరం రధమేవతు బుద్ధించ సారధిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ,
ఇన్ద్రియాణి హయాన్యాహు: తేషాం విషయ గోచరాన్, అత్మెంద్రియ మనో యుక్తం
భోక్తేత్యాహుర్మనీషిణః .. అన్నది ఒక ఉపనిషత్తు. అంటే శరీరమే రధము. ఆత్మ అంటే పరమాత్మ
స్వరూపి ఐన జీవాత్మ రధికుడు. అంటే రధాన్ని ఎక్కే వాడు. బుద్ధి సారధి. అంటే పరమాత్మ
రూపకమైన బుద్ధి ఈ రధాన్ని నడిపితే, గుర్రములవంటి ఇంద్రియములను మనసు అనే కళ్ళెం తో
అదుపు చేస్తూ, పరమాత్ముడి సారధ్యంలో, సర్వం ఆయనకే అప్పగించి, నమ్మి,కూర్చుంటే రధాన్ని క్షేమంగా గమ్యానికి నడుపుతాడు, కనుక మనసు అనే కళ్ళెమును కూడా సారధి ఐన
పరమాత్ముడికి అప్పగించాలి అంటే మనసును పరమాత్ముని యందు లగ్నం చేయాలి. ఆత్మ, ఇంద్రియాలు, మనసు కలిగిన వాడిని భోక్త అంటారు, డానికి బుద్ధిని కూడా జోడిస్తే ఆ భోక్తృత్వ
భావన నశిస్తుంది. అప్పుడు నేను చేస్తున్నాను, చూస్తున్నాను, అనుభవిస్తున్నాను అనే భావన
నశిస్తుంది. అప్పుడు సుఖ దు:ఖాలూ, రాగ ద్వేషాలు, బంధ మోక్షాలూ, మంచీ చెడూ, ఇలాంటి ద్వంద్వాలు నశిస్తాయి. శివమే అంటే శాంతమే, సౌఖ్యమే, ఆనందమే మిగులుతుంది..కనుక శివోహం..శివోహం!

బుద్ధికి అప్పజెప్పి ప్రయాణం చేస్తే కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రి యాలూ దారి తప్పవు, మంచి కర్మలే మిగులుతాయి, మంచి జ్ఞానమే మిగులుతుంది అప్పుడు శివుడౌ తాడు మానవుడు, కనుక ఇంతా
కలిగిన శివుడనే నేను!

సప్త ధాతువులు, పంచ ప్రాణాలు, పంచ కోశాలు, బంధాలు, భవ బంధాలు, అనుబంధాలు,
సంబంధాలు అన్నీ నేను దేహం అనుకుంటే అవి గెలుస్తాయి, నేను దేహమును కాను, ఎందుకంటే
దేహం శాశ్వతం కాదు కనుక, అని తెలిసికొంటే దేహం నశిస్తుంది, ఆత్మ రహిస్తుంది, ఆత్మ
మిగులుతుంది, ఆ ఆత్మ పరమాత్మ తత్త్వం కనుక, జీవం ఉన్నంత కాలం జివునితో ఉంది
తరువాత దేవునితో కలిసిపోతుంది కనుక, డానికి మరణం లేదు, కనుక ఆది శాశ్వతం.
ఈ జ్ఞానం కలిగితే దేహం ద్వారా వచ్చే ఏ మంచి చెడు..సుఖ దు;ఖాలు..మొదలైన ద్వంద్వాలున్డవు
కనుక అప్పుడు మిగిలేది పరమానందమే కనుక నేను శివుడను, నేను శివుడనే!

మనసును బుద్ధి ద్వారా నియమించుకుని కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను
జయించి, కర్మేన్ద్రియములను, జ్ఞానేన్ద్రియములను, ప్రాణ వాయువులను, సప్త ధాతువులను,
పంచ మహా భూతాలను, పంచ కోశాలను జయించి అంటే ఇవన్నీ జయించడం ద్వారా మిగిలిన పరమానందమును అనుభవించడం ద్వారా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడనే నేను!

యద్వాచా నాభ్యు దితం యేన వాగాభ్యుధ్యతే ....
యన్మనసా న మనుతే ఏనాహుర్మనోమతం ....
యత్ చక్షుసా న పశ్యతి యేన చక్శూగుమ్సి పశ్యతి....
యత్ శ్రోత్రే ణ న శ్రుణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం...
యత్ ప్రాణేన న ప్రాణితి యేన ప్రాణాః ప్రణీయతే...
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసతే ....

ఏది వాక్కుల ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా వాక్కు పలుకడం జరుగుతుందో, ఏది
మనసు ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా మనసు దేనినైనా తెలిసికొన గలుగుతుందో,
ఏది కనుల ద్వారా చూడ బడ జాలదో, దేని ద్వారా కనులు చూడ గలుగుతాయో, ఏది చెవుల
ద్వారా వినబడ జాలదో దేని ద్వారా చెవులు విన గలుగుతాయో, ఏది ప్రాణములచేత జీవింపదో,
దేని ద్వారా ప్రాణములు జీవింప గలుగుతాయో అదియే బ్రహ్మము..వేరేది ఏదీ కాదు..అని
చెప్పింది ఉపనిషత్తు. రెండు పెదవులు, ముప్పై రెండు పళ్ళూ, నాలుక, కొండ నాలుక వున్నవాళ్ళు
కూడా పలుక లేని వారు వున్నారు, మూగ వాళ్ళు, అంటే వీటన్నింటికీ పలుకును ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ఆది లేక పోతే ఇవన్నీ వున్న వాళ్ళు కూడా పలుకలేరు కదా, కళ్ళు, కను బొమలు,
కను గుడ్లు అన్నీ సరిగా వున్నా చూపు లేని వాళ్ళు గుడ్డి వాళ్ళు వున్నారు, అంటే వీటన్నింటికీ
చూపును ఇచ్చే శక్తి ఒకటి వేరేది వున్నది, అలాగే చెవులున్నా, కర్ణభేరి వున్నా మిగిలినవి అన్నీ
సరిగా వున్నా వినలేని చెవిటి వాళ్ళు వున్నారు, అంటే వీటన్నిటికీ విన గలిగిన శక్తిని ఇచ్చే శక్తి
ఒకటి వున్నది కదా, ప్రాణములు వున్నప్పుడూ తెలియబదనిది, అదేదో తెలియనిది లేకుంటే
ప్రాణములు లేకుండా పోతాయో దాని వల్లనే ప్రాణములున్నట్లు, జీవం వున్నట్లు కనిపిస్తుందో...
అదియే బ్రహ్మము..అంటే కేవలమ్మ్పైకి కనిపించే నోరు, కళ్ళు, చెవులు,ఇవన్నీ సరిగా వున్న
అవి పని చేయకుండ పోతాయి, అంటే వీటికి శక్తినిచ్చే శక్తి ఒకటి ఉంది కదా..అదే బ్రహ్మం.
పంచకర్మెంద్రియలూ. పంచా జ్ఞానేంద్రియాలు అలాగే వున్నా ప్రాణం లేని శరీరం ఎందుకూ పనికి
రాదు, ఏదీ చేయ లేదు. నోరున్నా పలుక లేదు,చేతులున్నా పను చేయ లేవు, కాళ్ళు వున్నా
నడువ లేవు, కామేంద్రియం వున్నా పని చేయదు, కామం వుండదు, విసర్జక అవయవం వున్నా
విసర్జించే శక్తి వుండదు , చర్మం వున్నా స్పర్శను గ్రహింప లేదు, కనులు వున్నా చూడలేవు,
చెవులు వున్నా వినలేవు, నాలుక వున్నా రుచి చూడ లేదు, ముక్కు వున్నా వాసన చూడలేదు,
సప్త ధాతువులూ వున్నా వాటి పని అవి చేయ లేవు, పంచా కోశాలు వున్నా పనికి రావు..ఇవన్నీ
వున్నా ఏది లేకుంటే ఇవన్నీ లేనట్లే లెక్కనో అదే ప్రాణ శక్తి, అదే బ్రహ్మం, అదే జీవం, అదే నాదం,
అదే వేదం! కనుక ఆ శక్తిని మాత్రమే శాశ్వతము ఐన శక్తిగా తెలిసికొంటే మిగిలినవన్నీ అశాశ్వతాలు
అని తెలిసికొనడం జరుగుతుంది. అప్పుడు మిగిలిన వాటి ద్వారా వచ్చే సుఖ దు:ఖాలు, జయాపజయాలు, క్షణికమైనవి అని తెలుస్తుంది, ఆనందమే మిగులుతుంది, కనుక శివుడని
పోతాను కనుక నేను శివుడను, నేను శివుడనే!

అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం
తథా అరసం నిత్య మగంధ వచ్చయత్
అనాద్యనంతం మహతః పరం ధృవం
నిచాయ్య తన్మ్రుత్యు ముఖాత్ప్ర ముచ్యతే..అన్నది ఉపనిషత్తు ఇదే భావాన్ని తెలియ జేస్తూ..ఈ
జ్ఞానం కలిగినప్పుడు మృత్యువు లేకుండా పోతుంది, పుట్టుకే శాశ్వతం కాదు అని తెలిస్తే
మృత్యువూ శాశ్వతం కాదు అని తెలుస్తుంది కనుక మృత్యువు వుండదు, ఇదంతా అశాశ్వతం
అని తెలుస్తుంది కనుక ఇవన్నీ పోయేవే అని తెలుస్తుంది కనుక భయం వుండదు, ఆ భయమే మృత్యువు, ఆ బలహీనతే మృత్యువు, తెలిసికొన్న ఆ శాశ్వత సత్యం, ఆ శక్తి అదే జీవం, ఎందుకంటే
డానికి చావు అంతం అనేది లేదు కనుక, ఇదే భావాన్ని స్వామి వివేకానంద చెప్పింది! ఇక్కడ చావు వుండదు అంటే పుట్టుకా శాశ్వతం కాదు, చావూ శాశ్వతం కాదు, అవి సహజ ధర్మాలు,అనివార్యాలు
అని తెలియడం వలన కలిగే జ్ఞానం వలన కలిగే ఆనందం వలన మృత్యు భీతి వుండదు కనుక
మృత్యు భావం వుండదు కనుక మృత్యువు వుండదు అని అర్థం, అంతే కానీ ఈ జ్ఞానం కలిగిన
వాడు శారీరకంగా చిరంజీవి అని కాదు, శరీరానికే మృత్యువు, ఆత్మకు కాదు అని తెలిసికొనడం
వలన కలిగే చావు లేని ఆత్మ జ్ఞానం అని అర్థం!..ఎందుకంటే ఆ ఆత్మకు చావు లేదు కనుక..
ఇదే శ్రీ కృష్ణుడు అర్జునునితో చెప్పింది!

నిర్వాణ షట్కానికి ఇంకా పంచ కోశ వివరణ మాత్రమే వున్నది..ఇక్కడ మిగిలిపోయింది..అది ఇంకా
మరీ లోతైనది, ఇక్కడ అంత అవసరం ఈ సాహిత్యాన్ని అర్థం చేసికొనడం కోసం లేదని ప్రస్తుతానికి
ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. నా అల్ప బుద్ధికి అందిన విషయాన్ని ఇక్కడ ఇవ్వడానికి ఆ జగద్గురువుల ప్రేరణకు ఆయన పాద పద్మములకు వినయంగా అంజలిస్తూ...స్వస్తి!

శ్రీమచ్చంకారాచార్య కృత సువర్ణమాలా స్తుతి:
























అథకథమపిమద్రసనాంత్వద్గుణలేశైర్విశోధయామి విభో !
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ యుగం ||ఆఖండల మదఖండన పండిత తండుప్రియ చండీశ విభో !
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ యుగం ||
ఇభచర్మాంబర! శంబర రిపు వపురపహరణోజ్వల నయన విభో ! సాంబ |ఈశ! గిరీశ! నరేశ! పరేశ! మహేశ! బిలేశయ భూషణ! భో! సాంబ ||
ఉమయా దివ్యసుమఞ్గళ విగ్రహయాలిఞ్గిత వామాఞ్గ విభో! || సాంబ ||
ఊరీకురుమా మఙ్ఞమనాథం దూరీకురు మే దురితం భో! || సాంబ ||
ఋషివరమానస హంస చరాచర జనన స్థితి లయ కారణ భో! || సాంబ ||
ౠక్షాధీశ! కిరీటి! మహోక్షారూఢ! విధృత రుద్రాక్ష విభో! || సాంబ ||
లు్‌వర్ణద్వంద్వ మవృంత కుసుమమివాంఘ్రౌ తవార్పయామి విభో! || సాంబ ||
ఏకం సదితి శృత్యాత్వమేవ సదసీ త్యుపాస్మహే మృడ భో! || సాంబ ||

ఐక్యం నిజ భక్తేభ్యో వితరసి విశ్వంభరోత్ర సాక్షీ భో! || సాంబ ||
ఓమితి తవ నిర్దేష్ట్రీ మాయా~స్మాకం మృదోపకర్త్రీ భో! || సాంబ ||
ఔదాస్యం స్ఫుటయతి విషయేషు దిగంబరతా చ తవైవ విభో! || సాంబ ||
అంతఃకరణ విశుధ్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో! || సాంబ ||
అస్తోపాధి సమస్త వ్యస్తై రూపైర్జగన్మయోసి విభో! || సాంబ ||

కరుణా వరుణాలయ మయి దాస ఉదాసస్తవోచితో నహి భో! || సాంబ ||
ఖలసహవాసం విఘటయ ఘటయ సతామేవ సంగమనిశం భో! || సాంబ ||
గరళం జగదుపకృతయే గిలితం భవతాసమోస్తి కోత్ర విభో! || సాంబ ||
ఘనసార గౌరగాత్ర! ప్రచుర జటాజూట భధ్ధ గంగ విభో! || సాంబ ||
ఙ్ఞప్తిస్సర్వ శరీరేష్వఖండితా యా విభాతి సాత్వం భో! || సాంబ ||

చపలం మమ హృదయ కపిం విషయేద్రుచరం దృఢం బధాన విభో! || సాంబ ||
ఛాయాస్థాణోరపి తవ తాపం నమతాం హరత్యహో శివభో! || సాంబ ||
జయ! కైలాస నివాస! ప్రమథగణాధీశ! భూసురార్చిత! భో! || సాంబ ||
ఝణుతక ఝంతరి ఝణుతక్కిట తక శబ్దైర్నటసి మహానట భో! || సాంబ ||
ఙ్ఞానం విక్షేపావృతి రహితం కురు మే గురుస్త్వమేవ విభో! || సాంబ ||


టంకార స్తవధనుషో దలయతి హృదయం ద్విషామశనిరివ భో! || సాంబ ||
ఠాకృతిరివ తవ మాయా బహిరంతశ్శూన్యరూపిణీ ఖలు భో! || సాంబ ||
డంబరమంబురుహామపి దలయత్యనఘం త్వదంఘ్రి యుగళం భో! || సాంబ ||
ఢక్కా~క్షసూత్ర శూల ద్రుహిణ కరోటీ సముల్లసత్కర భో! || సాంబ ||
ణాకార గర్భిణీ చేఛ్ఛుభదా తే శరగతిర్నృణామిహ భో! || సాంబ ||

తవమన్వతి సంజపతస్సద్యస్తరతి నరో హి భవాబ్ధిం భో! || సాంబ ||
థూత్కారస్తస్య ముఖే భూయాత్తే నామ నాస్తి యస్య విభో! || సాంబ ||
దయనీయశ్చ దయాళుః కోస్తి మదన్యస్త్వదన్య ఇహ వద భో! || సాంబ ||
ధర్మస్థాపన దక్ష త్ర్యక్ష గురో దక్ష యఙ్ఞ శిక్షక భో! || సాంబ ||
నను తాడితోసి ధనుషా లుబ్ధధియా త్వం పురా నరేణ విభో! || సాంబ ||

పరిమాతుం తవ మూర్తిం నాలమజస్తత్పరాత్పరోసి విభో! || సాంబ ||
ఫలమిహ నృతయా జనుషస్త్వత్పదసేవా సనాతనోసి విభో! || సాంబ ||
బలమారోగ్యంచాయుస్త్వద్గుణ రుచితాం చిరం ప్రదేహి విభో! || సాంబ ||
భగవాన్ భర్గ భయాపహ భూతపతే భూతి భూషితాంగ విభో! || సాంబ ||
మహిమా తవ న హి మాతి శృతిషు హిమానీ ధరాత్మజాధవ భో! || సాంబ ||

యమనియమాదిభిరంగైర్యమినో హృదయే భజంతి స త్వం భో! || సాంబ ||
రజ్జావహిరివ శృక్త్తౌ రజతమివ త్వయి జగంతి భాంతి విభో! || సాంబ ||
లబ్ధ్వా భవత్ప్రసాదాచ్చక్రం విధురవతి లోకమఖిలం భో! || సాంబ ||
వసుధా తధ్ధర తచ్ఛయరథ మౌర్వీశర పరాకృతాసుర భో! || సాంబ ||

శర్వదేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్త గర్వ హరణ విభో! || సాంబ ||
షడ్రిపు షడూర్మి షడ్వికారహర సన్ముఖ షన్ముఖ జనక విభో! || సాంబ ||
సత్యం ఙ్ఞానమనంతం బ్రహ్మేత్యేతల్లక్షణ లక్షిత భో! || సాంబ ||

హాహాహూహూ ముఖ సుర గాయక గీతాపదానపద్య విభో! || సాంబ ||
ళాదిర్నహి ప్రయోగస్తదంతమిహ మఞ్గళం సదాస్తు విభో! || సాంబ ||
క్షణమివ దివసాన్నేష్యతి త్వత్పద సేవాక్షణోత్సుకశ్శివ భో! || సాంబ ||

|| ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్యపాద శిష్యస్య శ్రీమఛ్ఛంకరభగవతః కృతౌ సువర్ణమాలాస్తుతిః సంపూర్ణా

మాతృపంచక శ్లోకములు
















మాతృపంచక శ్లోకములు

౧. ముక్తామణిస్త్వం నయనం నమేతి రాజేతి జీవేతి చిరం సుత త్వం!
ఇతి ఉక్తవత్యాః తవవాచి మాతః దదామ్యాహం తండులమేవ శుష్కమ్!!
'నువ్వు నా ముత్యానివి, నా రత్నానివి, నా కంటి వేలుగువు, కుమారా! నువ్వు చిరంజీవివై వర్ధిల్లాలి' అని ప్రేమగా నన్ను పిలిచినా నీ నోటిలో అమ్మా, ఈనాడు కేవలం ఇన్ని ముడి బియ్యపు గింజలను వేస్తున్నాను.

౨.అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే కియదవోచ ఉచ్చైహ్!
క్రిష్ణేతి గోవిందేతి హరే ముకుందేతి అహో జనన్యై రచితోయమంజలిహ్!!
'అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!' అంటూ పంటి బిగువున ప్రసవ వేదనను భరించి నాకు జన్మనిచ్చిన తల్లీ! నీకు నమస్కరిస్తున్నాను.

౩.ఆస్తాం తావడియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యధా!
నైరుచ్యం తనుశోషణం మలమపి శయ్యా చ సాంవత్సరీ!
ఏకస్యాపి న్ గర్భభార భరణ క్లేశస్య యస్స్యాక్షమో!
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః!!
అమ్మా! నన్ను కన్నా సమయంలో నువ్వు ఎంతటి శూల వ్యధను అనుభించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి, శయ్య మలినమైనా - సం!! కాలం ఆ క్లేశాన్ని ఎలా భరించావో కదా! ఎవరైనా అలాంటి బాధను సహించగలరా? ఎంత ఉన్నతుడైనా కుమారుడు తల్లి రుణాన్ని తీర్చుకోగాలడా? నీకు అంజలి ఘటిస్తున్నాను.

౪.గురు కులముపసృత్య స్వప్న కాలేపి తు దృష్ట్వా!
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైహ్!
గురుకులముపసృత్య సర్వం ప్రరుదత్తే సమక్షం!
సదపి చరణయోస్తే మాతురస్తు ప్రణామః!!
స్వప్నంలో నన్ను సన్యాసి వేషంలో చూసి, కలతపడి, గురుకులానికి వచ్చి బిగ్గరగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడి వారందరికీ ఖేదం కలిగించింది. అంతటి ప్రేమమయివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నానమ్మా!

౫.న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా!
స్వ గావా నో దత్తా మరనదివసే శ్రాద్ధవిధినా!
న దత్తో మాతస్తే మరణ సమయే తారక మనురకాలే!
సంప్రాప్తే మయి కురు దయం మాతరతులాం!!
అమ్మా! సమయం మించి పోయాక వచ్చినందువల్ల మరణ సమయంలో గుక్కెడు నీళ్ళు కూడా నేను నీ గొంత్లో పోయలేదు. శ్రాద్ధ విధిగా గోదానమైనా చేయలేదు. ప్రాణోత్క్రమణ సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని ఉచ్ఛరించలేదు. నన్ను క్షమించి, నా యందు తులలేని దయ చూపించు తల్లీ!

ఈ ఐదు స్లోకాశ్రు కణాల్లోనూ 'మాతృదేవో భవ' అనే గంభీర ఉపనిషద్వాణి ప్రతిష్టితమై ఉంది. మహిత వేదాంత ప్రవచానానికే కాదు - మహనీయ మాతృ భక్తి ప్రకటనకు కూడా ఆచార్యకం ఆదిశంకరుల వాణి.

శ్రీ ప్రభో వేంకటేశా







ఓం వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం భూర్భువస్సువః
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత్

ప్రభో వెంకటేశా విభో శ్రీనివాసా!!
నమో దేవ దేవా నమో సర్వ రూపా!!

ప్రభో వెంకటేశా విభో శ్రీనివాసా!!
నమో దేవ దేవా నమో సర్వ రూపా!!
సదా శ్రీవ లీల ఇరాదీందు లీల
నినే కంట చూసి తరించానులేరా

ప్రభో వెంకటేశా విభో శ్రీనివాసా!!
ప్రభో వెంకటేశా!!

సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ శంభువం
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
విశ్వదః పరమాన్నిత్యం విశ్వం నారాయనగుం హరిం
విశ్వమే వేదం వరుణస్తద్విశ్వముపజీవతి

నిఖిలాంగ దైవాలు నీ దాసులూ
అఖిలాండ మేలేటి ఈ భక్తులూ
విశ్వాంతరాళాల యుగ సంధిలో విజ్రుంభమాణాలు నీకాంతులు
జాహ్నవి పుట్టిన పాదం నరజాతికదే అభిషేకం
ఆపద మొక్కులు తీర్చే నీ శ్రీపదమే సుశ్లోకం
ఎన్నో కొండలెక్కి వెలిగేటి రూపం ఎన్నో మెట్లు దాటి వచ్చే మాదు జన్మం
ఆదిత్య తాపా రుత్ర్యేంద్ర రూపా వేదాంత రూపా విజ్ఞాన దీపా
నిన్నే కన్నానయ్యా శక్తి రూపా!!

స్వర సప్తక శైలేంద్ర విలాసా ఆ ఆ ఆ ఆ
అగుమా ప్రణవా కార విలాసా
వేదనలూదిన వేణువు నీవు ఆ శివుడెరుగని వెన్నెల నీవు
మాటలకందని మౌనం నీవు బ్రహ్మకు తెలియని వేదం నీవు
పరమ హంసలకు యోగం నీవు హృదయ నేత్రముల శాస్త్రము నీవు
దివిని వీడి ఇటు భువిని చేరుకొని కలిమినేలు ఘన దైవం నీవు
త్రేతాయుగమున రామా రారా ధరణిజ సోమా
ద్వాపరయుగ గోపాలా నందనమాయెను నేల
కలియుగ విరజా పుష్కరిణీ తట భక్త కోటి పరిపాలా
నిగామాకాశపు నీలిమలంటిన సూర్య చంద్ర మణి హార
రసనావేదం రగిలే ఘన వ్యసనావేశం కలిగే
తిరుమల నాలో ఎదిగే శుభ తిరుపతి నాలో వెలిగే
భుక్తికి పెంచిన దేహం ముక్తిణి కోరే...
భక్తికి లొంగిన ఆత్మలు నీ పరమాయే

వెంకట రమణ సంకట హరణ శంకర సదనా
వెంకట రమణ సంకట హరణ శంకర సదనా

ప్రభో వెంకటేశా..! వెంకటేశా..!
శ్రీనివాసా..! శ్రీనివాసా..!

ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.. గోవిందా...!
ఆపదమోక్కులవాడ... అడుగడుగు దండాలవాడ... వడ్డికాసులవాడ.... గోవిందా.. గోవిందా...!

Thursday, March 1, 2012

గురు పాదుకా సూక్తం




















1::అనంత సంసార సముద్ర తార నౌకాయిదాభ్యాం గురు భక్తిదాభ్యాం
వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం, నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

2::కవిత్వ వారాశి నిశాకరాభ్యాం, దౌర్భాగ్యదావాం బుధ మాలికాభ్యాం
ధూరీకృతానమ్ర విపత్థిదాభ్యాం, నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

3::నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః
మూకాస్చ వాచస్పతితాం హితాభ్యాం, నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

4::నాలీక నీకాశ పదాహ్రితాభ్యాం, నానా విమోహాది నివారికాభ్యాం
నమజ్జనాభీష్ట తతిబ్రదాభ్యాం, నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

5::నృపాలిమౌలి బ్రజ రత్న కాంతి సరిద్ధిరాజ జ్జశకన్యకాభ్యాం
నృపత్వదాభ్యాం నతలోకపంఖ్తేః, నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

6::పాపాంధకారార్క పరంపరాభ్యాం, తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం
జాడ్యాబ్ధి సంసోషణవాఢవాభ్యాం, నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

7::శమాదిషట్క ప్రద వైభవాభ్యాం, సమాధిదాన వ్రతదీక్షితాభ్యాం
రమాధవాన్ధ్రి స్థిర భక్తిదాభ్యాం, నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

8::స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం, స్వాహా సహాయాక్ష ధురంధరాభ్యాం
స్వాన్తాఛ్ఛభావ ప్రద పూజనాభ్యాం, నమో నమః శ్రీ గురు పాదుకాదుభ్యాం

9::కామాదిసర్ప వ్రజ గారుఢాభ్యాం, వివేక వైరాగ్య నిధిప్రదాభ్యాం
బోధ ప్రదాభ్యాం ధ్రుతమోక్షదాభ్యాం, నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

ఇతి శ్రీ శన్కరాచార్య విరిచిత శ్రీ గురుపాదుకా స్తోత్రమ్

గురు ప్రాథన

























::: రోజూ చెప్పుకోవలసిన గురు ప్రాథనా స్తోత్రాలు :::

గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః
గురుఃసాక్షాత్ పరంబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః

1::అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షుర్ ఉన్మీలియం యేన తస్మైశ్రీ గురవేనమహా

chat 3 Times at ones
2::దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర
దిగంబరా దిగంబరా నృసింహ్మా సరస్వతి దిగంబరా..

3::ఓం నమః ప్రణవార్థాయ శుధ జ్ఞానైక మూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ ధక్షణామూర్తయే నమః

4::గురవే సర్వలోకానాం బిషజే భవరోగిణాం
నిధయే సర్వ విధ్యానాం దక్షనామూర్తయే నమః

5::ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురుఃపదమ్
మంత్రమూలం గురోర్వాకం..మోక్షమూలం గురోః కృపాః

6::దిగంబరాయ విద్మహే..అత్రిపుత్రాయ ధీమహి
తన్నోదత్త ప్రచోదయాత్..chat 3 Times at ones

7::నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ
కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్‌మహాదేవాయ నమః ఓమ్

8::నృసింహ్మస్వామినే నమః :::

అకాలమౄత్యుహరణం సర్వవ్యాధి నివారణం
సమస్త పాపక్షయ కరం
శ్రీ నరసింహ్మ పాదోదకం పావనం శుభం

9::నాగస్తోత్రం:::

నమస్తే దేవదేవేశా..నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర..ఆదిశేష నమోస్తుతే

















guru praathana

gururbrahmaa, gururvishNu@h, gururdaevO mahaeSvara@h
guru@hsaakshaat^ paraMbrahmaa, tasmai Sree guravae nama@h

1::ajnaana timiraandhasya jnaanaanjana Salaakayaa
chakshur unmeeliyam yEna tasmaiSree guravEnamahaa

#chat 3 Times at ones#
2::digambaraa digambaraa Sreepaada vallabha digambara
digambaraa digambaraa nRsiMhmaa saraswati digambaraa..

3::Om nama@h praNavaarthaaya Sudha jnaanaika mUrtayE
nirmalaaya praSaantaaya dhakshaNaamoortayE nama@h

4::guravE sarvalOkaanaam bishajE bhavarOgiNaam
nidhayE sarva vidhyaanaam dakshanaamoortayE nama@h

5::dhyaanamoolam gurOrmoorti@h poojaamoolam guru@hpadaమ్
mantramoolam gurOrvaakam..mOkshamUlam gurO@h kRpaa@h

6::digambaraaya vidmahE..atriputraaya dhiimahi
tannOdatta prachOdayaat..#chat 3 Times at ones#

7::namastE astu bhagavan viSwESwaraaya mahaadEvaaya
trayambakaaya tripuraantakaaya trikaalaagni kaalaaya
kaalaagni rudraaya neelakanThaaya mRtyunjayaaya
sarvESwaraaya sadaaSivaaya Sreeman^mahaadEvaaya nama@h ఓమ్

8::nRsiMhmaswaaminE nama@h :::

akaalamRutyuharaNam sarvavyaadhi nivaaraNam
samasta paapakshaya karam
Sree narasiMhma paadOdakam paavanam Subham

9::naagastOtram:::

namastE dEvadEvESaa..namastE dharaNiidhara
namastE sarva naagEndra..aadiSEsha namOstutE